Gyanvapi case: శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయాలని కోరిన హిందూ పక్షం
Hindu Side Moves Plea Seeking Carbon Dating Of ‘Shivalinga’: జ్ఞానవాపి మసీదు కేసులో గురువారం వారణాసి కోర్టులో కీలక వాదనలు జరిగాయి. హిందూ పక్షం న్యాయవాది విష్ణు జైన్, జ్ఞానవాపి మసీదులో ఉన్న శివలింగానికి ‘కార్బన్ డేటింగ్’చేయాలని శివలింగంగా చెబుతున్న ఆకారంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై వారణాసి జిల్లా కోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది.
జ్ఞానవాపి శృంగార్ గౌరీ వివాదం కేసులో వారణాసి జిల్లా కోర్టులో జస్టిస్ ఏకే విశ్వేశ ముందు ఈ కేసు విచారణకు వచ్చింది. హిందూ పక్షం శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయాలని పట్టుబట్టింది. అయితే దీనిపై అభిప్రాయాన్ని తెలపాలని న్యాయమూర్తి ముస్లిం పక్షానికి నోటీసులు జారీ చేసి దీనిపై అభ్యంతరాలు ఎమైనా ఉంటే తెలపాలని కోరింది. విచారణను ఎనిమిది వారాల తర్వాత జరపాలన్న డిమాండ్ పై ముస్లిం పక్షం పట్టుబట్టింది. అయితే కోర్టు మాత్రం సెప్టెంబర్ 29కి తరుపరి విచారణను వాయిదా వేసింది.
Also Read
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
Read Also: Priyamani: బొడ్డుపై అది ఉండాలని నిర్మాత టార్చర్ చేశాడు..
మేము శివలింగం కార్బన్ డేటింగ్ కోసం డిమాండ్ చేశామని.. ముస్లింపక్షం మాత్రం దీన్ని ఫౌంటైన్ అంటుందని.. నిజాలు వెలికి తీసేందుకు స్వతంత్ర సంస్థ దీన్ని పరిశీలించాల్సి ఉంటుందని.. అందుకే కార్బన్ డేటింగ్ కోసం పిటిషన్ దాఖలు చేశామని హిందూ పక్షం న్యాయవాది విష్ణు శకంర్ జైన్ తెలిపారు. కార్బన్ డేటింగ్ వల్ల శివలింగంగా చెప్పబడుతున్న ఆకారం వయస్సును కనుక్కునే అవకాశం ఉంది. ఇది మసీదు నిర్మించిన సమయంలో ఉందా.. లేకపోతే అంతకన్నా పురాతనమైందా..? అనేది కార్బన్ డేటింగ్ వల్ల తెలిసే అవకాశం ఉంది.
గత విచారణలో వారణాసి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘ప్రార్థన స్థలాల చట్టం-1991’ జ్ఞానవాపి మసీదుకు వర్తించదని కీలక తీర్పు వెల్లడించింది. అంజుమన్ ఇంతేజామియా మసీదు వాదనల్ని కోర్టు తీరస్కరించింది. 1947 ఆగస్టు 15కు ముందు నుంచే ఇది హిందూ దేవాలయం అని చెబుతున్న క్రమంలో ఈ చట్టం వర్తించదని తెలిపింది. ఆ తరువాత మళ్లీ ఈ రోజే వారణాసి కోర్టులో వాదనలు జరిగాయి. జ్ఞానవాపి మసీదులో ఉన్న దేవతా మూర్తులకు పూజలు చేసుకునే అవకాశం కల్పించాలంటూ ఐదుగురు మహిళలు కోర్టులో కేసు వేయడంతో జ్ఞానవాపి మసీదు వ్యవహారం తెరపైకి వచ్చింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!