GVL Narasimha Rao: INDIA కూటమిలో ఏకైక సమస్య ఉంది.. జీవీఎల్ కీలక కామెంట్స్
GVL Narasimha Rao Interesting Comments On INDIA Alliance: విపక్షాల కూటమికి INDIA (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్) అనే పేరు ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ కూటమిపై ఎంపీ జీవీఎల్ నరసింహరావు స్పందిస్తూ.. ఈ కూటమిలో ఓ ఏకైక సమస్య ఉందని, అనేకమందిపై అవినీతి అభియోగాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. రేపటి నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని, ఈ సమావేశాల్లో కేంద్రం 21 బిల్లులను తీసుకురానుందని స్పష్టం చేశారు. గత పార్లమెంట్ సమావేశాలు చేదు అనుభవంగా మారాయని.. ఆ సమావేశాల్లో చర్చ జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని పేర్కొన్నారు. మోడీ స్పీచ్ని అడ్డుకొని, ప్రతిపక్షాలు అరాచకం సృష్టించాయని మండిపడ్డారు.
Seema Haider: సీమా భారత్ కు ఎలా వచ్చింది.. ‘యూపీ ఏటీఎస్’ విచారణలో సంచలన నిజాలు..!
Also Read
- Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
- May 1st Labor Day: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ఈరోజే ఎందుకు.. పూర్తి వివరాలు
- West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర దీదీ ధర్నా..
- Mamata Banerjee: బీహార్, మహారాష్ట్ర కాదు.. ఇది బెంగాల్.. ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ విమర్శలు
ప్రతిపక్షాలు విధ్వంస ధోరణితో వ్యవహరిస్తున్నాయని.. ఇప్పుడు INDIA పేరుతో కొత్త కూటమి తెరపైకి వచ్చిందని జీవీఎల్ అన్నారు. అసలు ఈ కొత్త కూటమి ఎందుకు? గతంలో ఉన్న కూటమిపై అభ్యంతరాలు వచ్చాయా? అని ప్రశ్నించారు. తమను తాము రక్షించుకునేందుకు ఒక రక్షణ కవచం కోసం ఈ కూటమిని ఏర్పరుచుకున్నారే తప్ప.. ప్రజల ఎజెండా వాళ్లకు లేదని విమర్శించారు. ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాలను ఫణంగా పెట్టొద్దని కొరారు. రాజకీయ పట్టుదలకు పోతే కష్టమని.. ఏదో కుంటి సాకు చెప్పి పార్లమెంట్ను అడ్డుకుంటే ప్రజా ఆగ్రహం తప్పదని హెచ్చరించారు. ఎకానమీలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు. ప్రపంచ దేశాలు ప్రధాని మోడీకి బ్రహ్మరథం పడుతున్నాయన్నారు. కానీ.. ప్రతిపక్షాలు మాత్రం అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఉభయ సభల్లోనూ ప్రజలకు ఉపయోగపడేలా ప్రతిపక్షాలు వ్యవహరించాలని సూచించారు.
Ponnam Prabhakar: మోడీ ఫోటోతో దేశం అభివృద్ధి కాదు.. పొన్నం ప్రభాకర్ కౌంటర్
ఏపీ అభివృద్ధిపై తానే ఎన్నో ప్రశ్నలు పార్లమెంట్లో లేవనెత్తానని జీవీఎల్ చెప్పుకొచ్చారు. ఏపీలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువగా తామే పార్లమెంట్లో చర్చకు తెచ్చామని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధిపై తమకున్న చిత్తశుద్ధి మరొకరికి లేదని వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. కేంద్రం ఏపీ రాష్ట్రానికే ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు.
తాజావార్తలు
-
Shubman Gill: ఈ రోజు నా రోజు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
-
SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
-
Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
-
Kalki2898AD : ‘కల్కి 2’ షూటింగ్ స్టార్ట్.. రెబలోడు సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడుతున్నాడంటే?
-
US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’ సిద్ధం!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!