Jnanpith Award: గుల్జార్, జగద్గురు రాంభద్రాచార్యలకు జ్ఞానపీఠ్ అవార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jnanpith Award: 2023కి గానూ ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రాంభద్రాచార్యలకు 58వ జ్ఞానపీఠ్ అవార్డులను కమిటీ శనివారం ప్రకటించింది. గుల్జార్ హిందీ సినిమాల్లో సినీగేయ రచయితగా ప్రసిద్ధి చెందారు. ప్రస్తుతం ఉన్న ప్రసిద్ధ ఉర్దూ కవుల్లో ఒకరిగా ఉన్నారు. అంతకుముందు గుల్జార్కి 2002లో ఉర్దూ సాహిత్య అకాడమీ అవార్డు, 2013లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2004లో పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. ఐదుసార్లు జాతీయ చలనచిత్ర అవార్డుల్ని సొంతం చేసుకున్నారు.
Read Also: Yash: పాన్ ఇండియా హీరో.. కుటుంబంతో కలిసి కిరాణా కొట్టులో ఏం చేస్తున్నాడు.. ?
Also Read
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
- అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
- Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
గుల్జార్తో పాటు సంస్కృత సాహిత్యవేత్త జగద్గురు రాంభద్రాచార్యకు కూడా అవార్డును ప్రకటించింది. చిత్రకూట్ లోని తులసీ పీఠం వ్యవస్థాపకుడిగా, ప్రఖ్యాత హిందూ ఆధ్యాత్మికవేత్తగా, విద్యావేత్తగా 100 కంటే ఎక్కువ పుస్తకాలను రచించారు. 2022లో గోవా రచయిత దామోదర్ మౌజో ఈ అవార్డును అందుకున్నారు.
జ్ఞానపీఠ్ అవార్డు భారతదేశ అత్యున్నత సాహిత్య పురస్కారం. భారతీయ సాహిత్యానికి విశేష కృషి చేసినందుకు భారతీయ జ్ఞానపీఠ్ ట్రస్ట్ ఈ అవార్డులను అందిస్తుంది. ఈ అవార్డును మొదటిసారిగా 1965లో మలయాళ కవి జి. శంకర్ కురుప్ తన ఒడక్కుఝల్ అనే కవితా సంకలనానికి పురస్కారం పొందారు. ఈ అవార్డును అందుకున్న వారికి రూ. 11 లక్షలతో పాటు, వాగ్దేవి కాంస్య విగ్రహాన్ని బహూకరిస్తారు.
తాజావార్తలు
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!