Video Call Trap: సెక్స్ వీడియో కాల్ ట్రాప్లో వ్యాపారవేత్త.. ఏకంగా రూ. 2 కోట్లు సమర్పయామి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Businessman Loses ₹ 2.69 Crore In Sex Video Call Trap: సెక్స్ టార్షన్ ఉచ్చులో చిక్కుకున్న ఓ గుజరాత్ వ్యాపారిని బ్లాక్ మెయిల్ చేస్తూ.. రూ. 2.69 కోట్లు కొల్లగొట్టారు. సెక్స్ వీడియో కాల్ ట్రాప్ లో ఇరుక్కొని వారు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూపోయాడు. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే గుజరాత్ లో పునరుత్పాదక ఇంధన సంస్థను నడుపుతున్న బాధితుడికి గత ఏడాది ఆగస్టు 8న మోర్చీకి చెందిన రియా శర్మ అనే మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అయితే వీరిద్దరి మధ్య సన్నిహితం పెరిగి న్యూడ్ కాల్ చేసుకునే వరకు వెళ్లింది. పక్కా పథకం ప్రకారం సదరు యువతి, బాధితుడిని బట్టలు విప్పి ఫోన్ మాట్లాడేలా ప్రోత్సహించింది.
Read Also: Maoist Party Letter: హిడ్మా చనిపోలేదు.. మావోయిస్టు పార్టీ ఓపెన్ లెటర్
Also Read
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
దీని తర్వాత బాధితుడికి ఫోన్ చేసి రూ. 50,000 చెల్లించమని డిమాండ్ చేసిందని పోలీసులు వెల్లడించారు. లేకపోతే న్యూడ్ వీడియో క్లిప్ సర్క్యూలేట్ చేస్తానని బెదిరించడంతో బాధితుడు డబ్బులు ఇచ్చాడు. అయితే ఆ తరువాత ఢిల్లీ పోలీస్ ఇన్ప్పెక్టర్ గుడ్డు శర్మ అని చెప్పుకుని మరో వ్యక్తి ఫోన్ చేసి, న్యూడ్ వీడియో నా దగ్గర ఉందని రూ. 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి డబ్బు తీసుకున్నాడు. ఆ తరువాత ఆగస్టు 14న తనను సైబర్ సెల్ పోలీస్ గా పరిచయం చేసుకుని మరో వ్యక్తి యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని చెబుతూ ఏకంగా రూ. 80.97 లక్షలు కోరినట్లు పోలీసులు వెల్లడించారు.
దీని తర్వాత కూడా వ్యాపారవేత్తకు వేధింపులు ఆగలేదు. యువతి సీబీఐని సంప్రదించిందని.. సీబీఐ అధికారులమని చెబుతూ మరికొంతమంది కాల్ చేయడం ప్రారంభించారు. రూ. 8.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఇలా పలుమార్లు అడిగినంత ఇచ్చుకుంటూ పోయాడు. చివరకు డిసెంబర్ 15న ఢిల్లీ హైకోర్టు కేసును క్లోజ్ చేస్తుందని చెబుతూ ఫేక్ ఉత్తర్వులు కూడా పంపారు. అయితే ఇది చూసిన తర్వాత అనుమానం వచ్చిన సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఏకంగా 11 మందికి రూ.2.69 కోట్లు దోపిడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 387 (దోపిడీ), 170 (ప్రభుత్వ సేవకుడిగా నటించడం), 465 (ఫోర్జరీ) 420 (మోసం), మరియు 120-బి (నేరపూరిత కుట్ర) ఇతర నేరాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని, విచారణ జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..