PM Modi: చిన్నప్పుడు కప్పులు, ప్లేట్లు కడుగుతూ పెరిగాను.. చాయ్తో ప్రత్యేక అనుబంధం..
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ఉత్తర్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మరోసారి సమాజ్వాదీ(ఎస్పీ)ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. తనకు ‘చాయ్’కి ఉన్న సంబంధం ఎంతో ప్రత్యేమైనదిగా చెప్పారు. ‘‘చిన్నతనంలో కప్పులు, ప్లేట్లు కడుగుతూ పెరిగాను. నేను టీ అందిచేవాడిని, మోడీకి టీకి మధ్య సంబంధం చాలా లోలైనది’’ అని ఈ రోజు మీర్జాపూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ అన్నారు.
సమాజ్ వాదీ పార్టీకి ఓటేసి ఎవరూ కూడా తమ ఓటును వృధా చేసుకోవాలనుకోరని, మునిగిపోయే వారికి ఎవరు ఓటు వేయరని, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో వారికే ఓటేస్తారని ప్రధాని అన్నారు. ప్రజలకు ఇండియా కూటమి గురించి చాలా బాగా తెలుసని, వారు మతవిద్వేషకులని, కులపిచ్చి ఉన్నవారని, వారు అధికారంలోకి వచ్చిన సందర్భాల్లో ఈ రెండింటి ఆధారంగా నిర్ణయాలు తీసుకునేవారని ఆరోపించారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్పై విమర్శలు గుప్పిస్తూ.. యాదవ సామాజిక వర్గంలో చాలా మంది ఆశావహులు ఉన్నప్పటికీ, ఆయన మాత్రం తన కుటుంబానికి మాత్రమే టిక్కెట్లు ఇచ్చారని అన్నారు.
Also Read
- Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
- May 1st Labor Day: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ఈరోజే ఎందుకు.. పూర్తి వివరాలు
- West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర దీదీ ధర్నా..
- Mamata Banerjee: బీహార్, మహారాష్ట్ర కాదు.. ఇది బెంగాల్.. ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ విమర్శలు
Read Also: Lucknow: లక్నోలో దారుణం.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భార్యను చంపి, దొచుకెళ్లిన దుండగులు..
ఎస్పీకి చెందిన వ్యక్తులు పట్టుబడిన ఉగ్రవాదుల్ని విడిచిపెట్టేవారని, ఇందులో ఎవరైనా పోలీస్ అధికారి అయిష్టంగా ఉంటే అతడిని సస్పెండ్ చేసేవారని, యూపీ, పూర్వాంచల్ని మాఫియాకు అడ్డాగా మార్చారని ప్రధాని అననారు. ఎస్పీ ప్రభుత్వం మాఫియాను ఓటు బ్యాంకుగా చూసిందని అన్నారు. యూపీ సీఎం ‘‘స్వచ్ఛతా అభియాన్’’ని చాలా ధైర్యంగా ముందుకు తీసుకెళ్తున్నారని, ఎస్పీ ప్రభుత్వం హయాంలో ప్రజానీకం ఈ మాఫియాకు వణికిపోయేవారని, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలో మాఫియా వణికిపోతోందని ఆయన అన్నారు.
ఇండియా కూటమి ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను లాక్కోవాలని ప్రయత్నిస్తోందని ప్రధాని ఆరోపించారు.మతం ఆధారంగా రిజర్వేషన్లు ఉండకూడదని మన రాజ్యాంగం చెబుతోందని, అయితే, ఎస్పీ మాత్రం తన మేనిఫెస్టోలో దళితులు, వెనబడిని తరగతుల వారి రిజర్వేషన్లను ముస్లింకు ఇవ్వాలని పేర్కొందని చెప్పారు. దీని కోసం రాజ్యాంగం కూడా మారుస్తామని ఎస్పీ చెబుతోందని, పోలీస్, పీఏసీల్లో కూడా ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ పార్టీ చెబుతోందని, వారి ఓటు బ్యాంకు కోసం రిజర్వేషన్లు ఇస్తామని చెబుతున్నారని ఆరోపించారు. పేదలు, దళితులు, వెనుకబడిన ప్రజలకు తాను అంకితమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.
తాజావార్తలు
-
US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’ సిద్ధం!
-
Imran Khan: 85% చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్.. వైద్య కారణాలతో విడుదల కోరుతూ కోర్టుకు అప్పీల్
-
Rajat Patidar: పాయింట్ల పట్టికను పట్టించుకోవడం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
-
Bitter Gourd Chips Recipe: కారం కారంగా కరకరలాడే కాకరకాయ చిప్స్.. చేదు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసే ప్రత్యేక రెసిపీ..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!