PM Modi: చిన్నప్పుడు కప్పులు, ప్లేట్లు కడుగుతూ పెరిగాను.. చాయ్తో ప్రత్యేక అనుబంధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ఉత్తర్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మరోసారి సమాజ్వాదీ(ఎస్పీ)ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. తనకు ‘చాయ్’కి ఉన్న సంబంధం ఎంతో ప్రత్యేమైనదిగా చెప్పారు. ‘‘చిన్నతనంలో కప్పులు, ప్లేట్లు కడుగుతూ పెరిగాను. నేను టీ అందిచేవాడిని, మోడీకి టీకి మధ్య సంబంధం చాలా లోలైనది’’ అని ఈ రోజు మీర్జాపూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ అన్నారు.
సమాజ్ వాదీ పార్టీకి ఓటేసి ఎవరూ కూడా తమ ఓటును వృధా చేసుకోవాలనుకోరని, మునిగిపోయే వారికి ఎవరు ఓటు వేయరని, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో వారికే ఓటేస్తారని ప్రధాని అన్నారు. ప్రజలకు ఇండియా కూటమి గురించి చాలా బాగా తెలుసని, వారు మతవిద్వేషకులని, కులపిచ్చి ఉన్నవారని, వారు అధికారంలోకి వచ్చిన సందర్భాల్లో ఈ రెండింటి ఆధారంగా నిర్ణయాలు తీసుకునేవారని ఆరోపించారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్పై విమర్శలు గుప్పిస్తూ.. యాదవ సామాజిక వర్గంలో చాలా మంది ఆశావహులు ఉన్నప్పటికీ, ఆయన మాత్రం తన కుటుంబానికి మాత్రమే టిక్కెట్లు ఇచ్చారని అన్నారు.
Also Read
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
Read Also: Lucknow: లక్నోలో దారుణం.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భార్యను చంపి, దొచుకెళ్లిన దుండగులు..
ఎస్పీకి చెందిన వ్యక్తులు పట్టుబడిన ఉగ్రవాదుల్ని విడిచిపెట్టేవారని, ఇందులో ఎవరైనా పోలీస్ అధికారి అయిష్టంగా ఉంటే అతడిని సస్పెండ్ చేసేవారని, యూపీ, పూర్వాంచల్ని మాఫియాకు అడ్డాగా మార్చారని ప్రధాని అననారు. ఎస్పీ ప్రభుత్వం మాఫియాను ఓటు బ్యాంకుగా చూసిందని అన్నారు. యూపీ సీఎం ‘‘స్వచ్ఛతా అభియాన్’’ని చాలా ధైర్యంగా ముందుకు తీసుకెళ్తున్నారని, ఎస్పీ ప్రభుత్వం హయాంలో ప్రజానీకం ఈ మాఫియాకు వణికిపోయేవారని, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలో మాఫియా వణికిపోతోందని ఆయన అన్నారు.
ఇండియా కూటమి ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను లాక్కోవాలని ప్రయత్నిస్తోందని ప్రధాని ఆరోపించారు.మతం ఆధారంగా రిజర్వేషన్లు ఉండకూడదని మన రాజ్యాంగం చెబుతోందని, అయితే, ఎస్పీ మాత్రం తన మేనిఫెస్టోలో దళితులు, వెనబడిని తరగతుల వారి రిజర్వేషన్లను ముస్లింకు ఇవ్వాలని పేర్కొందని చెప్పారు. దీని కోసం రాజ్యాంగం కూడా మారుస్తామని ఎస్పీ చెబుతోందని, పోలీస్, పీఏసీల్లో కూడా ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ పార్టీ చెబుతోందని, వారి ఓటు బ్యాంకు కోసం రిజర్వేషన్లు ఇస్తామని చెబుతున్నారని ఆరోపించారు. పేదలు, దళితులు, వెనుకబడిన ప్రజలకు తాను అంకితమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.
తాజావార్తలు
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!