GPS: జీపీఎస్ని నమ్మి పోతే, కారుని నదిలో ముంచింది.. ముగ్గురు మృతి..
- ఉత్తర్ ప్రదేశ్లో జీపీఎస్ ప్రమాదం..
- గూగుల్ మ్యాప్స్ని నమ్మిపోతే వంతెన పై నుంచి కార్ బోల్తా..
- కారు నదిలో పడి ముగ్గురు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GPS: ఇటీవల కాలంలో జీపీఎస్ గూగుల్ మ్యాప్స్ నమ్మి కొన్ని సార్లు ప్రమాదాలు కొన్ని తెచ్చుకుంటున్నారు వాహనదారులు. కొన్ని సందర్భాల్లో తప్పుడు రూట్లలోకి తీసుకెళ్లడం మూలంగా కొందరు ప్రయాణికులు ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఓ ఘటన ప్రతీ సారి జీపీఎస్ని నమ్మడం ఎంత ప్రమాదమో తెలియజేస్తోంది. గమ్యస్థానాన్ని చేరుకోవడానికి జీపీఎస్ని వినియోగించిన ఇద్దరు సోదరులతో సహా ముగ్గురు మరణించారు.
Read Also: Sanjay Raut: సంజయ్ రౌత్.. 3 పార్టీలను ముంచాడు.. ముఖ్యంగా ఠాక్రేని..
Also Read
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
- Kalyan Banerjee: "నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?" మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
- AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
బదౌన్ జిల్లాలోని బరేలీ నుంచి డేటా గంజ్కి వెళ్తున్న కారు జీపీఎస్ని నమ్మి బ్రిడ్జ్పై నుంచి 50 అడుగుల దిగువన నదిలో పడిపోయింది. ఈ ఘటన ఫరీద్పూర్ సమీపంలో జరిగింది. వంతెన పాడైపోవడం గురించి తెలియక కారుని వంతెన మీద నుంచి పోనిచ్చారు. గ్రామస్థులు గమనించి పాడైపోయిన వ్యాగన్ఆర్ను రామగంగా నది నుంచి బయటకు తీశారు. కారులో ఉన్న ఇద్దరు సోదరులతో సహా మరొకరు మొత్తం ముగ్గురు అప్పటికే మరణించి ఉన్నారు. ఇద్దరు ప్రయాణికులను ఫరూఖాబాద్కు చెందిన వివేక్కుమార్, అమిత్గా గుర్తించారు. మూడో బాధితుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో వరదల కారణంగా వంతెన ముందు భాగం నదిలో కూలిపోయింది. ఈ విషయాన్ని జీపీఎస్లో అప్డేట్ చేయలేదు. దీంతో కారును తెలియక ఇదే మార్గం గుండా పోనిచ్చారు. ప్రమాదానికి గురై ముగ్గురు మరణించారు. బాధితులు గూగుల్ మ్యాప్స్పైనే ఆధారపడుతున్నారని, వంతెన అసంపూర్తిగా ఉండడంతో పాటు వచ్చే వాహనాలను అప్రమత్తం చేసేందుకు చుట్టుపక్కల బారికేడింగ్ లేకపోవడంపై బాధితుల కుటుంబ సభ్యులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా మెజిస్ట్రేట్ను కోరారు.
తాజావార్తలు
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?