GPS: జీపీఎస్ని నమ్మి పోతే, కారుని నదిలో ముంచింది.. ముగ్గురు మృతి..
- ఉత్తర్ ప్రదేశ్లో జీపీఎస్ ప్రమాదం..
- గూగుల్ మ్యాప్స్ని నమ్మిపోతే వంతెన పై నుంచి కార్ బోల్తా..
- కారు నదిలో పడి ముగ్గురు మృతి..
GPS: ఇటీవల కాలంలో జీపీఎస్ గూగుల్ మ్యాప్స్ నమ్మి కొన్ని సార్లు ప్రమాదాలు కొన్ని తెచ్చుకుంటున్నారు వాహనదారులు. కొన్ని సందర్భాల్లో తప్పుడు రూట్లలోకి తీసుకెళ్లడం మూలంగా కొందరు ప్రయాణికులు ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఓ ఘటన ప్రతీ సారి జీపీఎస్ని నమ్మడం ఎంత ప్రమాదమో తెలియజేస్తోంది. గమ్యస్థానాన్ని చేరుకోవడానికి జీపీఎస్ని వినియోగించిన ఇద్దరు సోదరులతో సహా ముగ్గురు మరణించారు.
Read Also: Sanjay Raut: సంజయ్ రౌత్.. 3 పార్టీలను ముంచాడు.. ముఖ్యంగా ఠాక్రేని..
Also Read
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
బదౌన్ జిల్లాలోని బరేలీ నుంచి డేటా గంజ్కి వెళ్తున్న కారు జీపీఎస్ని నమ్మి బ్రిడ్జ్పై నుంచి 50 అడుగుల దిగువన నదిలో పడిపోయింది. ఈ ఘటన ఫరీద్పూర్ సమీపంలో జరిగింది. వంతెన పాడైపోవడం గురించి తెలియక కారుని వంతెన మీద నుంచి పోనిచ్చారు. గ్రామస్థులు గమనించి పాడైపోయిన వ్యాగన్ఆర్ను రామగంగా నది నుంచి బయటకు తీశారు. కారులో ఉన్న ఇద్దరు సోదరులతో సహా మరొకరు మొత్తం ముగ్గురు అప్పటికే మరణించి ఉన్నారు. ఇద్దరు ప్రయాణికులను ఫరూఖాబాద్కు చెందిన వివేక్కుమార్, అమిత్గా గుర్తించారు. మూడో బాధితుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో వరదల కారణంగా వంతెన ముందు భాగం నదిలో కూలిపోయింది. ఈ విషయాన్ని జీపీఎస్లో అప్డేట్ చేయలేదు. దీంతో కారును తెలియక ఇదే మార్గం గుండా పోనిచ్చారు. ప్రమాదానికి గురై ముగ్గురు మరణించారు. బాధితులు గూగుల్ మ్యాప్స్పైనే ఆధారపడుతున్నారని, వంతెన అసంపూర్తిగా ఉండడంతో పాటు వచ్చే వాహనాలను అప్రమత్తం చేసేందుకు చుట్టుపక్కల బారికేడింగ్ లేకపోవడంపై బాధితుల కుటుంబ సభ్యులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా మెజిస్ట్రేట్ను కోరారు.
తాజావార్తలు
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
-
Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
-
Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
-
Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!