GPS: జీపీఎస్ని నమ్మి పోతే, కారుని నదిలో ముంచింది.. ముగ్గురు మృతి..
- ఉత్తర్ ప్రదేశ్లో జీపీఎస్ ప్రమాదం..
- గూగుల్ మ్యాప్స్ని నమ్మిపోతే వంతెన పై నుంచి కార్ బోల్తా..
- కారు నదిలో పడి ముగ్గురు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GPS: ఇటీవల కాలంలో జీపీఎస్ గూగుల్ మ్యాప్స్ నమ్మి కొన్ని సార్లు ప్రమాదాలు కొన్ని తెచ్చుకుంటున్నారు వాహనదారులు. కొన్ని సందర్భాల్లో తప్పుడు రూట్లలోకి తీసుకెళ్లడం మూలంగా కొందరు ప్రయాణికులు ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఓ ఘటన ప్రతీ సారి జీపీఎస్ని నమ్మడం ఎంత ప్రమాదమో తెలియజేస్తోంది. గమ్యస్థానాన్ని చేరుకోవడానికి జీపీఎస్ని వినియోగించిన ఇద్దరు సోదరులతో సహా ముగ్గురు మరణించారు.
Read Also: Sanjay Raut: సంజయ్ రౌత్.. 3 పార్టీలను ముంచాడు.. ముఖ్యంగా ఠాక్రేని..
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
బదౌన్ జిల్లాలోని బరేలీ నుంచి డేటా గంజ్కి వెళ్తున్న కారు జీపీఎస్ని నమ్మి బ్రిడ్జ్పై నుంచి 50 అడుగుల దిగువన నదిలో పడిపోయింది. ఈ ఘటన ఫరీద్పూర్ సమీపంలో జరిగింది. వంతెన పాడైపోవడం గురించి తెలియక కారుని వంతెన మీద నుంచి పోనిచ్చారు. గ్రామస్థులు గమనించి పాడైపోయిన వ్యాగన్ఆర్ను రామగంగా నది నుంచి బయటకు తీశారు. కారులో ఉన్న ఇద్దరు సోదరులతో సహా మరొకరు మొత్తం ముగ్గురు అప్పటికే మరణించి ఉన్నారు. ఇద్దరు ప్రయాణికులను ఫరూఖాబాద్కు చెందిన వివేక్కుమార్, అమిత్గా గుర్తించారు. మూడో బాధితుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో వరదల కారణంగా వంతెన ముందు భాగం నదిలో కూలిపోయింది. ఈ విషయాన్ని జీపీఎస్లో అప్డేట్ చేయలేదు. దీంతో కారును తెలియక ఇదే మార్గం గుండా పోనిచ్చారు. ప్రమాదానికి గురై ముగ్గురు మరణించారు. బాధితులు గూగుల్ మ్యాప్స్పైనే ఆధారపడుతున్నారని, వంతెన అసంపూర్తిగా ఉండడంతో పాటు వచ్చే వాహనాలను అప్రమత్తం చేసేందుకు చుట్టుపక్కల బారికేడింగ్ లేకపోవడంపై బాధితుల కుటుంబ సభ్యులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా మెజిస్ట్రేట్ను కోరారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?