Parliament Session: బడ్జెట్ సమావేశాల్లో 6 కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం.. వివరాలు..
- బడ్జెట్ సమావేశాల్లో 6 కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం..
- పౌర విమానరంగం.. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు బిల్లులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Session: రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం కీలమైన 6 బిల్లులను ప్రవేశపెట్టనునంది. విమానయాన రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేసే బిల్లును తీసుకురానుంది. దీని కోసం 90 ఏళ్ల నాటి ఎయిర్క్రాఫ్ట్ చట్టాన్ని భర్తీ చేయనుంది. దీంతో సహా ఆరు కొత్త బిల్లులను సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెడుతుంది. ఆర్థిక బిల్లులతో పాటు ‘ది డిజాస్టర్ మేనేజ్మెంట్ (సవరణ) బిల్లు’ను కూడా జాబితా చేసింది. ఈ చట్టం ద్వారా వివత్తు నిర్వహణ రంగంలో పనిచేస్తున్న వివిధ సంస్థల పనితీరులో మరింత స్పష్టత, కలయికను తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోక్సభ బులెటిన్ గురువారం పేర్కొంది.
Read Also: Himanta Biswa Sarma: 2041 నాటికి ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా అస్సాం.. సీఎం ఆందోళన..
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
‘భారతీయ వాయుయాన్ విధేయక్’ ద్వారా 2024 పౌర విమానయాన రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి అనుమతించే నిబంధనలను తీసుకురావడానికి 1934 ఎయిర్ క్రాఫ్ట్ చట్టాన్ని భర్తీ చేయనుంది. జూలై 22 ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12న ముగుస్తాయి. జూలై 23న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం ఉన్న చట్టాలను రీప్లేస్ చేసేందుకు ‘బాయిలర్స్ బిల్’ ని తీసుకురాబోతోంది. కాఫీ (ప్రమోషన్ మరియు అభివృద్ధి) బిల్లు మరియు రబ్బరు (ప్రమోషన్ మరియు అభివృద్ధి) బిల్లు స్థానంలో బాయిలర్ల బిల్లును తీసుకు వస్తోంది.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటరీ ఎజెండాను నిర్ణయించే బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ)ని కూడా ఏర్పాటు చేశారు. స్పీకర్ అధ్యక్షత ఏర్పడిన కమిటీలో సుదీప్ బందోపాధ్యాయ (టిఎంసి), పిపి చౌదరి (బిజెపి), లావు శ్రీకృష్ణ దేవరాయలు (టిడిపి), నిషికాంత్ దూబే (బిజెపి), గౌరవ్ గొగోయ్ (కాంగ్రెస్), సంజయ్ జైస్వాల్ (బిజెపి), దిలేశ్వర్ కమైత్ (జెడి- యు), భర్తృహరి మహతాబ్ (బిజెపి), దయానిధి మారన్ (డిఎంకె), బైజయంత్ పాండా (బిజెపి), అరవింద్ సావంత్ (శివసేన-యుబిటి), కొడికున్నిల్ సురేష్ (కాంగ్రెస్), అనురాగ్ ఠాకూర్ (బిజెపి) మరియు లాల్జీ వర్మ (ఎస్పి) సభ్యులుగా ఉన్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!