Rahul Gandhi: ‘‘మా విజన్ స్వీకరించినందుకు సంతోషం’’.. కుల గణనపై రాహుల్ గాంధీ..
- మా విజన్ స్వీకరించినందుకు సంతోషం..
- కేంద్రం కులగణన నిర్ణయంపై రాహుల్ గాంధీ..
- మా ఒత్తిడితోనే కేంద్రం నిర్ణయం తీసుకుందన్న కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కింపుతో పాటు ‘‘కుల గణన’’ చేస్తామని బుధవారం సంచలన ప్రకటన చేసింది. అయితే, ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్ ఒత్తిడి మేరకే కేంద్రం తలొగ్గిందని, కుల గణనకు అంగీకరించిందని ఆయన అన్నారు. ‘‘మేము కుల గణన నిర్వహిస్తామని పార్లమెంట్లో చెప్పాము. 50 శాతం రిజర్వేషన్ పరిమితిని కూడా రద్దు చేస్తామని అన్నాము. నరేంద్రమోడీ కేవలం 4 కులాలు ఉన్నాయని మాత్రమే చెప్పేవారు. ఏం జరిగిందో తెలియదు కానీ, 11 ఏళ్ల తర్వాత కులగణనను ప్రకటించారు. ’’ అని అన్నారు. కులగణనపై ఎంత టైమ్ పడుతుందో కావాలని, దీనిపై మరింత తెలుసుకోవాలని అనుకుంటున్నామని అన్నారు.
Read Also: Simhachalam Incident: సింహాచలం ఘటనపై ఎంక్వైరీ కమిషన్.. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు..
Also Read
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
ఇది మొదటి అడుగు మాత్రమే అని, తెలంగాణ కుల గణన కేంద్ర ప్రభుత్వానికి ఒక నమూనాలా, బ్లూ ఫ్రింట్గా మారవచ్చని ఆయన అన్నారు. కుల గణనకు ఈ ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తున్నామని, కుల గణనకు రెండు ఉదాహరణలు ఒకటి తెలంగాణ, రెండోది బీహార్ అని, ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉందని రాహుల్ చెప్పారు. కుల గణన ద్వారా రిజర్వేషన్లు మాత్రమే కాదని, కొత్త అభివృద్ధి నమూనాను తీసుకురావడమే తమ దృక్ఫథమని అన్నారు. దేశంలో ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు వారి భాగస్వామ్యం ఎంత అనేది కుల గణన ద్వారా కనుగొనబడుతుందని చెప్పారు. ఆర్టికల్ 15(5) ప్రకారం, ప్రైవేట్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు ఇప్పటికే చట్టంగా ఉందని, ఎన్డీయే బీజేపీ ప్రభుత్వం దీనిని అమలు చేయాలని రాహుల్ గాంధీ కోరారు.
ఉగ్రవాదంపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ కేంద్రాన్ని కోరారు. పెహల్గామ్ దాడికి పాల్పడినవారు సరైన మూల్యం చెల్లించుకోవాలని, ఉగ్రవాదంపై పోరుకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ప్రధాన మంత్రి ఊగిసలాడకూడదని, అరకొర చర్యలు తీసుకోరాదని, పెహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారిని ‘‘అమరవీరులు’’గా గుర్తించాలని కోరారు. ఈ విషయాన్ని బాధిత కుటుంబీకులు తన ద్వారా తెలియజేయాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
-
RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
-
SRH Vs RCB: ఉప్పల్లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!