Google: గూగుల్కు షాక్.. రూ. 1,337 కోట్ల ఫైన్ కట్టాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google: టెక్ దిగ్గజం గూగుల్ కు షాక్ ఇచ్చింది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ). 30 రోజుల్లో రూ. 1337.76 కోట్ల జరిమానాను కట్టాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను అతిక్రమించి, గుత్తాధిపత్యంగా వ్యవహరిస్తుందని గతంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) రూ. 1337 కోట్ల జరిమానాను విధించింది. దీనిపై గతంలో గూగుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఉపశమనం దక్కలేదు. దీనిపై స్టే ఇవ్వాలని సుప్రీంను కోరింది. అయితే ఈ కేసుపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసును మార్చి 31 లోెగా తేల్చాలని ఎన్సీఎల్ఏటీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ రోజు తీర్పు చెబుతూ.. ట్రిబ్యునల్ ఫైన్ కట్టాల్సిందే అని గూగుల్ ను ఆదేశించింది.
Read Also: Karnataka: కాంగ్రెస్కు డీకే శివకుమార్ తలనొప్పి.. నోట్లు వెదజల్లడంపై విమర్శలు..
Also Read
- MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
దేశంలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై గూగుల్ గుత్తాధిపత్యంగా వ్యవహరిస్తోందని సీసీఐ జరిమానా విధించింది. దేశంలో ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారిత ఫోన్ల వినియోగమే ఎక్కువ. ఈ ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తుందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇండియాలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఆపరేటింగ్ సిస్టమ్స్ లో గూగుల్ ఆండ్రాయిడ్ ది 97 శాతం. అయితే నిబంధనలకు, భారతీయ చట్టాలకు విరుద్ధంగా తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తుందని ప్రధాన ఆరోపణ. గూగుల్ సంస్థ యూరప్ దేశాల్లో ఒకలా భారత్ తో మరోలా వ్యవహరిస్తోందని సీసీఐ గతంలో సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
ఈ కేసులో గత ఏడాది సుప్రీంకోర్టుకు చేరిన తర్వాత గూగుల్ భారత్ లోని ఆండ్రాయిడ్ కు భారీ మార్పులు చేసింది. వీటిలో మొబైల్ తయారీదారులు వ్యక్తిగత యాప్ లను ప్రీ-ఇన్స్టాలేషన్ కోసం అనుమతించడం, వినియోగదారులు వారి డిఫాల్ట్ సెర్చ్ ఇంజన్ ఎంచుకోవడం వంటి వాటిని మార్చింది. గూగుల్ మ్యాప్స్, జీమెయిల్, యూట్యూబ్ వంటి వాటిని ముందే అన్ ఇన్స్టాల్ చేయడానికి వినియోగదారులకు గూగుల్ అనుమతించాల్సిన అవసరం లేదు. గతంలోొ వీటిపై గూగుల్ ఇష్టారాజ్యం నడిచేది. అందుకే సీసీఐ ఫైన్ విధించింది.
తాజావార్తలు
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!