Goods trains collide: గూడ్స్ రైళ్లు ఢీ.. పట్టాలు తప్పిన 12 బోగీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Goods trains collide: ఒడిశాలో రైళ్లు ఢీకొన్న ప్రమాదం ఘటనను ప్రజలు మరిచిపోలేకపతున్నారు. ఈ ప్రమాదంలో ఏకంగా 275 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. మూడు దశాబ్ధాల కాలంలో ఇదే అతిపెద్ద రైలు దుర్ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. ఇదిలా ఉంటే ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు రెండు గూడ్స్ రైళ్ల ఢీకొనడం వల్ల 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ బంకురాలో జరిగింది. ఒండా స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. గూడ్స్ రైలు లోకో పైలట్ కి స్వల్పగాయాలయ్యాయి.
Read Also: Manipur Violence: సైన్యాన్ని ముట్టడించిన 1500 మంది.. 12 మంది మిలిటెంట్ల విడుదల..
Also Read
- Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
- CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
రైల్వే అధికారుల ప్రకారం.. రెండు ఖాళీ గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయని, ప్రమాదానికి కాణం ఏమిటి..? రెండు రైళ్లు ఎలా ఢీకొన్నాయనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. ఈ ప్రమాదంలో ఆద్రా డివిజన్ లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పశ్చిమ బెంగాల్ లోని నాలు జిల్లాలకు రైల్వే సేవలు నిలిచిపోయాయి. పశ్చిమ మిడ్నాపూర్, బంకురా, పురూలియా మరియు బుర్ద్వాన్, జార్ఖండ్లోని మూడు జిల్లాలు ధన్బాద్, బొకారో మరియు సింగ్భూమ్ ఆగ్నేయ రైల్వే పరిధిలోకి వస్తుంది.
జూన్ 2న ఒడిశా బాలాసోర్ లోని బహనాగా బజార్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 275కు పైగా మంది మరణించారు. ముందుగా కోరమాండల్ రైలు వేగంగా గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఆదే సమయంలో వేరేట్రాక్ లో ఎదురుగా వస్తున్న బెంగళూర్ రైలు, ట్రాకుపై పడి ఉన్న కోరమాండల్ రైలు బోగీలను ఢీకొట్టింది. దీంతో తీవ్ర ప్రమాదం జరిగింది.
తాజావార్తలు
-
MS Dhoni: బిగ్ అప్డేట్.. సన్రైజర్స్తో మ్యాచ్కి ధోనీ ఎంట్రీ..
-
Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
-
Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
-
Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
-
Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..