Tech Mahindra: ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 8000 మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tech Mahindra: ప్రపంచవ్యాప్తంగా పలు ఐటీ సంస్థలు లేఆఫ్లు ప్రకటిస్తూనే ఉన్నాయి. ఐటీ సంస్థలు లేఆఫ్లను ప్రకటించడం ఒకవైపు జరుగుతుంటే.. మరోవైపు సాంకేతిక రంగంలో వచ్చిన విఫ్లవాత్మకమైన మార్పు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)తో కూడా ఐటీ ఉద్యోగులకు ఉద్యోగాలు ఊడే ప్రమాదం ఏర్పడింది. దేశంలో ఉన్న ఐటీ కంపెనీలు కూడా లేఆఫ్ను అమలు చేస్తున్నాయి. అయితే మహీంద్ర అండ్ మహీంద్ర సంస్థకు చెందిన టెక్ మహీంద్ర మాత్రం తన కంపెనీలో ఉద్యోగాలను తీసేయకుండా ఏకంగా 8వేల మందికి ఉద్యోగాలు కల్పించింది. వారికి ఏఐలో నైపుణ్యాలను నేర్పించింది. టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)పై హాట్ డిబేట్ సాగుతున్న నేపథ్యంలో దేశీయ ఐటీ కంపెనీ టెక్ మహీంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల మెరుగైన భవిష్యత్కు ఐటీ ఉద్యోగులను సిద్ధం చేసే క్రమంలో సుమారు 8000 మందికి ఏఐలో శిక్షణ ఇచ్చింది. గత ఏడాది నవంబర్లో ఓపెన్ఏఐ చాట్జీపీటీని లాంఛ్ చేసినప్పటి నుంచి ఏఐ పట్ల ఆసక్తి పెరగడంతో పలు కంపెనీలు తమ దైనందిన కార్యకలాపాల్లో కొత్త టెక్నాలజీని వాడటం ప్రారంభించాయి.
Also Read
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
ఏఐ నూతన కాన్సెప్ట్ కాకపోయినప్పటికీ చాట్జీపీటీకి విశేష ఆదరణ లభించిన అనంతరం న్యూ టెక్నాలజీ పట్ల టెకీలతో పాటు కంపెనీల్లోనూ ఆసక్తి పెరిగింది. లేటెస్ట్గా టెక్ మహీంద్ర ఏఐపై తమ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం ద్వారా న్యూ టెక్నాలజీపై ఉద్యోగులు పట్టు సాధించేందుకు అవకాశం ఏర్పడింది. అమెరికా వంటి మార్కెట్లలో తమ కంపెనీ బీఎఫ్ఎస్ఐ, హెల్త్కేర్, మ్యాన్యుఫ్యాక్చరింగ్, రిటైల్ రంగాల్లో దృష్టి సారించిందని, ఉద్యోగులను భవిష్యత్ టెక్నాలజీలపై పట్టు సాధించేలా వారిపై పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించినట్టు టెక్ మహీంద్ర మార్కెటింగ్ హెడ్, గ్లోబల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ హర్ష్వేంద్ర సోయిన్ తెలిపారు. ఈ ఏడాది జూన్ క్వార్టర్లో తమ సంస్థ దాదాపు 8000 మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐ, ఇతర ఏఐ ప్లాట్ఫాంలపై శిక్షణ ఇచ్చినట్టు ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
-
Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా ‘బాహుబలి’ ప్రీక్వెల్ ను నెట్ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!