Gold Smuggling: బెంగళూర్, ట్రిచి, చెన్నై ఎయిర్ పోర్టుల్లో బంగారం పట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా… ఏదో విధంగా విదేశాాల నుంచి అక్రమ బంగారం దేశానికి చేరుతూనే ఉంది. అక్రమ బంగార రవాణాలకు ఎయిర్ పోర్టులు వేదిక అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఇండియాలోని పలు విమానాశ్రయాల్లో వరసగా బంగారం పట్టుబడుతోంది. తాజాగా కర్ణాటక బెంగళూర్, తమిళనాడు చెన్నై, ట్రిచి ఎయిర్ పోర్టుల్లో అక్రమ బంగారం పట్టుబడింది.
బెంగళూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు అధికారులు. దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికుల వద్ద రూ. 1.44 కోట్ల విలువ చేసే 2.8 కేజీల బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని పేస్టు గా మార్చి, ప్లాస్టిక్ కవర్స్ లో ప్యాకింగ్ చేసి, లగేజ్ బ్యాగ్ లో దాచి తరలించే యత్నం చేశారు. కస్టమ్స్ అధికారుల తనిఖీ చేయడంతో వ్యవహారం బయటపడింది. బంగారాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
మరోఘటనలో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీ గా బంగారం పట్టివేశారు. కొలంబో నుంచి వస్తున్న ప్రయాణీకుల వద్ద రూ. 1.7 కోట్ల విలువ చేసే 3.7 కేజీల బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. బంగారాన్ని పేస్టు గా మార్చి ప్లాస్టిక్ కవర్స్ లో ప్యాకింగ్ చేసి లగేజ్ బ్యాగ్ లో దాచారు భార్యాభర్తలు. మరో ప్లాస్టిక్ కవర్ ను వాష్ రూమ్ వద్ద వదిలారు కేటుగాళ్లు. ఈ ఇద్దరి దగ్గర నుంచి బంగారం సీజ్ చేసి అరెస్ట్ చేశారు.
బంగారం అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో ట్రిచి ఎయిర్ పోర్టులో నిఘా పెట్టిన అధికారులకు భారీగా బంగారం పట్టుబడింది. సింగపూర్ నుంచి తిరుచ్చి వచ్చిన ఇండిగో ఫ్లైట్ లో 19 విదేశీ బంగారు కడ్డీలను పట్టుకున్నారు. విమానాల లావెటరీలో బంగారాన్ని దాచి భారత్ లోకి అక్రమంగా తరలిస్తున్నారు. మొత్తం 1450 గ్రాముల బరువున్న బంగారం విలువ రూ. 75,71,900 అని తేలింది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!