Ukraine War: ఉక్రెయిన్పై రష్యా భీకరదాడులు.. 21 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా మరోసారి విరుచుకుపడింది. బుధవారం ఉక్రెయిన్ లోని దక్షిణ ఖేర్సన్ ప్రాంతంపై రష్యా క్షిపణులతో దాడులు చేసింది. ఈ ఘటనలో 21 మంది మరణించడంతో పాటు 48 మంది గాయపడ్డారు. శుక్రవారం నుండి ప్రధాన నగరమైన ఖెర్సన్లో అధికారులు కర్ఫ్యూ విధించారు. రష్యా చేసిన దాడుల్లో నగరంతో పాటు నగరం చుట్టు పక్కల ఉన్న గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దాడుల్లో రైల్వే స్టేషన్, క్రాసింగ్, ఇళ్లు, హార్డ్వేర్ దుకాణం, ఒక కిరాణా సూపర్ మార్కెట్, గ్యాస్ స్టేషన్ ధ్వంసం అయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ తెలిపారు.
Read Also: Russia: జెలెన్ స్కీని చంపడం తప్ప వేరే మార్గం లేదు.. రష్యా తీవ్ర హెచ్చరిక..
Also Read
- JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
- Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
- China Caste System: చైనాలో కుల వ్యవస్థ?.. కమ్యూనిజం వెనుక దాగిన చీకటి కోణం బట్టబయలు..
- Explainer: బంగాళాఖాతంలో పాగా వేయడానికి పాక్ కుట్రలు.. హంగోర్ క్లాస్ సబ్ మెరైన్ల కథేంటి?
ఖేర్సన్ నగరం నుంచి గత నవంబర్ లో రష్యా దళాలు ఉపసంహరించుకున్నాయి. రష్యా జరిగిన దాడిని ప్రపంచం చూడాలని జెలన్ స్కీ అన్నారు. ఖేర్సన్ నగరంలో 12 మంది చనిపోయినట్లు, సమీప గ్రామాల్లో 9మంది చనిపోయినట్లు ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు. ఖెర్సన్లో శుక్రవారం నుండి సోమవారం వరకు కర్ఫ్యూ విధించబడింది. ఉక్రెయిన్ బలగాల మోహరింపును సులభతరం చేయడానికి ఉక్రెయిన్ కర్ఫ్యూ విధించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ లో ప్రధాన నగరం అయిన ఖేర్సన్ ను తొలుత రష్యా ఆక్రమించుకుంది. గతేడాది నవంబర్ లో రష్యన్ బలగాలు అక్కడి నుంచి నిష్క్రమించాయి.
తాజావార్తలు
-
Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ ‘గట్ ఫీల్’ గురించే అంటూ వ్యాఖ్యలు..
-
Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
-
WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
-
KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
-
Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?