Arvind Kejriwal: ‘‘యమునా నదిలో విషం’’.. కేజ్రీవాల్కి ఈసీ కీలక ఆదేశం..
- ‘‘యమునా నదిలో విషం’’ అంటూ కేజ్రీవాల్ కామెంట్స్..
- రేపు రాత్రి 8 గంటల్లోగా రుజువులు ఇవ్వాలని ఈసీ ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలో నీటి సరఫరాకు అంతరాయం కలిగించేందుకు హర్యానా యమునా నదిలో ‘‘విషం’’ కలుపుతోందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలకు రుజువులు ఇవ్వాలని ఎన్నికల సంఘం మంగళవారం కేజ్రీవాల్కి లేఖ రాసింది. బుధవారం రాత్రి 8 గంటల వరకు రుజువులు ఇవ్వాలని ఆదేశించింది.
దీనికి ముందు హర్యానా నుంచి ఢిల్లీకి సరఫరా చేయబడిన నీటిలో అమ్మోనియా స్థాయిలు పెరిగాయనే ఆరోపణలకు సంబంధించి జనవరి 28 న నాటికి వాస్తవ నివేదికను సమర్పించాలని పోల్ ప్యానెల్ హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. జనవరి 27న ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ కేజ్రీవాల్.. ప్రజలకు నీటి కొరత ఉండేలా చేయడం కన్నా పెద్ద పాపం మరొకటి ఉండదని, బీజేపీ తన మురికి రాజకీయాల కోసం ఢిల్లీ ప్రజల దాహంతో ఆటలు ఆడుతోందని, వారు హర్యానా నుంచి పంపుతున్న నీటిలో విషం కలుపుతున్నారని ఆరోపణలు చేశారు. ఈ కలుషిత నీరు విషపూరితమైనదని, ఢిల్లీలో ఉన్న నీటి శుద్ధి కేంద్రాలు వీటిని శుద్ధి చేయలేవని, బీజేపీ ఢిల్లీ వాసుల్ని సామూహిక హత్య చేయాలని అనుకుంటోందని సంచలన ఆరోపణలు చేశారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
Read Also: Indiramma houses: ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై అధ్యయనం.. కమిటీ నియామకం
ఫిబ్రవరి 05న జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ వ్యాఖ్యలు రావడం సంచలనంగా మారింది. అయితే, కేజ్రీవాల్ వ్యాఖ్యల్ని హర్యానా సీఎం నయాబ్ సైనీ తిప్పికొట్టారు. ప్రభుత్వం ఆయనపై పరువు నష్టం కేసు వేయాలని యోచిస్తున్నల్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హర్యానా ప్రభుత్వంపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు అబద్ధమైతే, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఢిల్లీ జల్ బోర్డ్ సీఈఓ శిల్పా షిండే, ఢిల్లీ సీఎస్కి లేఖ రావారు. కేజ్రీవాల్ ప్రకటనలు తప్పు అని, వాటికి ఆధారం లేదని, తప్పుదారి పట్టించేవిగా చెప్పారు. ఇలాంటి ప్రకటనలు ఢిల్లీ వాసుల్లో భయాన్ని పెంచేందుకు దోహదం చేస్తాయని ఆమె లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!