Arvind Kejriwal: ‘‘యమునా నదిలో విషం’’.. కేజ్రీవాల్కి ఈసీ కీలక ఆదేశం..
- ‘‘యమునా నదిలో విషం’’ అంటూ కేజ్రీవాల్ కామెంట్స్..
- రేపు రాత్రి 8 గంటల్లోగా రుజువులు ఇవ్వాలని ఈసీ ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలో నీటి సరఫరాకు అంతరాయం కలిగించేందుకు హర్యానా యమునా నదిలో ‘‘విషం’’ కలుపుతోందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలకు రుజువులు ఇవ్వాలని ఎన్నికల సంఘం మంగళవారం కేజ్రీవాల్కి లేఖ రాసింది. బుధవారం రాత్రి 8 గంటల వరకు రుజువులు ఇవ్వాలని ఆదేశించింది.
దీనికి ముందు హర్యానా నుంచి ఢిల్లీకి సరఫరా చేయబడిన నీటిలో అమ్మోనియా స్థాయిలు పెరిగాయనే ఆరోపణలకు సంబంధించి జనవరి 28 న నాటికి వాస్తవ నివేదికను సమర్పించాలని పోల్ ప్యానెల్ హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. జనవరి 27న ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ కేజ్రీవాల్.. ప్రజలకు నీటి కొరత ఉండేలా చేయడం కన్నా పెద్ద పాపం మరొకటి ఉండదని, బీజేపీ తన మురికి రాజకీయాల కోసం ఢిల్లీ ప్రజల దాహంతో ఆటలు ఆడుతోందని, వారు హర్యానా నుంచి పంపుతున్న నీటిలో విషం కలుపుతున్నారని ఆరోపణలు చేశారు. ఈ కలుషిత నీరు విషపూరితమైనదని, ఢిల్లీలో ఉన్న నీటి శుద్ధి కేంద్రాలు వీటిని శుద్ధి చేయలేవని, బీజేపీ ఢిల్లీ వాసుల్ని సామూహిక హత్య చేయాలని అనుకుంటోందని సంచలన ఆరోపణలు చేశారు.
Also Read
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
- NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని 'నీట్'లో ర్యాంక్..
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
Read Also: Indiramma houses: ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై అధ్యయనం.. కమిటీ నియామకం
ఫిబ్రవరి 05న జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ వ్యాఖ్యలు రావడం సంచలనంగా మారింది. అయితే, కేజ్రీవాల్ వ్యాఖ్యల్ని హర్యానా సీఎం నయాబ్ సైనీ తిప్పికొట్టారు. ప్రభుత్వం ఆయనపై పరువు నష్టం కేసు వేయాలని యోచిస్తున్నల్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హర్యానా ప్రభుత్వంపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు అబద్ధమైతే, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఢిల్లీ జల్ బోర్డ్ సీఈఓ శిల్పా షిండే, ఢిల్లీ సీఎస్కి లేఖ రావారు. కేజ్రీవాల్ ప్రకటనలు తప్పు అని, వాటికి ఆధారం లేదని, తప్పుదారి పట్టించేవిగా చెప్పారు. ఇలాంటి ప్రకటనలు ఢిల్లీ వాసుల్లో భయాన్ని పెంచేందుకు దోహదం చేస్తాయని ఆమె లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
-
Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
-
Amit Shah: ‘చికెన్ నెక్’ కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!