Arvind Kejriwal: ‘‘యమునా నదిలో విషం’’.. కేజ్రీవాల్కి ఈసీ కీలక ఆదేశం..
- ‘‘యమునా నదిలో విషం’’ అంటూ కేజ్రీవాల్ కామెంట్స్..
- రేపు రాత్రి 8 గంటల్లోగా రుజువులు ఇవ్వాలని ఈసీ ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలో నీటి సరఫరాకు అంతరాయం కలిగించేందుకు హర్యానా యమునా నదిలో ‘‘విషం’’ కలుపుతోందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలకు రుజువులు ఇవ్వాలని ఎన్నికల సంఘం మంగళవారం కేజ్రీవాల్కి లేఖ రాసింది. బుధవారం రాత్రి 8 గంటల వరకు రుజువులు ఇవ్వాలని ఆదేశించింది.
దీనికి ముందు హర్యానా నుంచి ఢిల్లీకి సరఫరా చేయబడిన నీటిలో అమ్మోనియా స్థాయిలు పెరిగాయనే ఆరోపణలకు సంబంధించి జనవరి 28 న నాటికి వాస్తవ నివేదికను సమర్పించాలని పోల్ ప్యానెల్ హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. జనవరి 27న ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ కేజ్రీవాల్.. ప్రజలకు నీటి కొరత ఉండేలా చేయడం కన్నా పెద్ద పాపం మరొకటి ఉండదని, బీజేపీ తన మురికి రాజకీయాల కోసం ఢిల్లీ ప్రజల దాహంతో ఆటలు ఆడుతోందని, వారు హర్యానా నుంచి పంపుతున్న నీటిలో విషం కలుపుతున్నారని ఆరోపణలు చేశారు. ఈ కలుషిత నీరు విషపూరితమైనదని, ఢిల్లీలో ఉన్న నీటి శుద్ధి కేంద్రాలు వీటిని శుద్ధి చేయలేవని, బీజేపీ ఢిల్లీ వాసుల్ని సామూహిక హత్య చేయాలని అనుకుంటోందని సంచలన ఆరోపణలు చేశారు.
Also Read
- Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
- Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
- Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
- CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
Read Also: Indiramma houses: ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై అధ్యయనం.. కమిటీ నియామకం
ఫిబ్రవరి 05న జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ వ్యాఖ్యలు రావడం సంచలనంగా మారింది. అయితే, కేజ్రీవాల్ వ్యాఖ్యల్ని హర్యానా సీఎం నయాబ్ సైనీ తిప్పికొట్టారు. ప్రభుత్వం ఆయనపై పరువు నష్టం కేసు వేయాలని యోచిస్తున్నల్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హర్యానా ప్రభుత్వంపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు అబద్ధమైతే, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఢిల్లీ జల్ బోర్డ్ సీఈఓ శిల్పా షిండే, ఢిల్లీ సీఎస్కి లేఖ రావారు. కేజ్రీవాల్ ప్రకటనలు తప్పు అని, వాటికి ఆధారం లేదని, తప్పుదారి పట్టించేవిగా చెప్పారు. ఇలాంటి ప్రకటనలు ఢిల్లీ వాసుల్లో భయాన్ని పెంచేందుకు దోహదం చేస్తాయని ఆమె లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
-
Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Kangana Ranaut: కంగనా, రామ్దేవ్ వివాదానికి రాఖీతో ముగింపు.. మిఠాయిలతో మళ్లీ అన్నాచెల్లెళ్ల బంధం!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!