Arvind Kejriwal: ‘‘యమునా నదిలో విషం’’.. కేజ్రీవాల్కి ఈసీ కీలక ఆదేశం..
- ‘‘యమునా నదిలో విషం’’ అంటూ కేజ్రీవాల్ కామెంట్స్..
- రేపు రాత్రి 8 గంటల్లోగా రుజువులు ఇవ్వాలని ఈసీ ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలో నీటి సరఫరాకు అంతరాయం కలిగించేందుకు హర్యానా యమునా నదిలో ‘‘విషం’’ కలుపుతోందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలకు రుజువులు ఇవ్వాలని ఎన్నికల సంఘం మంగళవారం కేజ్రీవాల్కి లేఖ రాసింది. బుధవారం రాత్రి 8 గంటల వరకు రుజువులు ఇవ్వాలని ఆదేశించింది.
దీనికి ముందు హర్యానా నుంచి ఢిల్లీకి సరఫరా చేయబడిన నీటిలో అమ్మోనియా స్థాయిలు పెరిగాయనే ఆరోపణలకు సంబంధించి జనవరి 28 న నాటికి వాస్తవ నివేదికను సమర్పించాలని పోల్ ప్యానెల్ హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. జనవరి 27న ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ కేజ్రీవాల్.. ప్రజలకు నీటి కొరత ఉండేలా చేయడం కన్నా పెద్ద పాపం మరొకటి ఉండదని, బీజేపీ తన మురికి రాజకీయాల కోసం ఢిల్లీ ప్రజల దాహంతో ఆటలు ఆడుతోందని, వారు హర్యానా నుంచి పంపుతున్న నీటిలో విషం కలుపుతున్నారని ఆరోపణలు చేశారు. ఈ కలుషిత నీరు విషపూరితమైనదని, ఢిల్లీలో ఉన్న నీటి శుద్ధి కేంద్రాలు వీటిని శుద్ధి చేయలేవని, బీజేపీ ఢిల్లీ వాసుల్ని సామూహిక హత్య చేయాలని అనుకుంటోందని సంచలన ఆరోపణలు చేశారు.
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
- Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
Read Also: Indiramma houses: ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై అధ్యయనం.. కమిటీ నియామకం
ఫిబ్రవరి 05న జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ వ్యాఖ్యలు రావడం సంచలనంగా మారింది. అయితే, కేజ్రీవాల్ వ్యాఖ్యల్ని హర్యానా సీఎం నయాబ్ సైనీ తిప్పికొట్టారు. ప్రభుత్వం ఆయనపై పరువు నష్టం కేసు వేయాలని యోచిస్తున్నల్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హర్యానా ప్రభుత్వంపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు అబద్ధమైతే, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఢిల్లీ జల్ బోర్డ్ సీఈఓ శిల్పా షిండే, ఢిల్లీ సీఎస్కి లేఖ రావారు. కేజ్రీవాల్ ప్రకటనలు తప్పు అని, వాటికి ఆధారం లేదని, తప్పుదారి పట్టించేవిగా చెప్పారు. ఇలాంటి ప్రకటనలు ఢిల్లీ వాసుల్లో భయాన్ని పెంచేందుకు దోహదం చేస్తాయని ఆమె లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
-
Peddi: ‘పెద్ది’కి లైన్ క్లియర్.. పర్సంటేజ్ విధానంపై గుడ్ న్యూస్
-
Hyderabad Water Board : ఏసీబీ దాడుల్లో షాక్.. బయటపడ్డ కోట్ల సామ్రాజ్యం.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
-
Cheesy Chicken Sandwich Recipe: నోరూరించే చీజీ ‘చికెన్ శాండ్విచ్’.. బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ కోసం ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోండి!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!