Rahul On Defamation Case: పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనే అవకాశమివ్వండి: సుప్రీం అఫిడవిట్లో రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul On Defamation Case: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ సుప్రీం కోర్టు అఫిడవిట్ దాఖలు చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరారు. పరువు నష్టం కేసులో తాను ఎలాంటి నేరానికీ పాల్పడలేదని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తాను నిర్దోషినని, తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని సుప్రీంకోర్టును కోరారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. ‘మోడీ ఇంటి పేరు’ కేసులో ఈ మేరకు ఆయన సుప్రీంకోర్టులో తాజాగా అఫిడవిట్ దాఖలు చేశారు. కర్ణాటకలో జరిగిన ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ..‘దొంగలందరికీ మోడీ ఇంటి పేరే ఎందుకుంటుంది’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్కు చెందిన భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ పరువు నష్టం దావా వేశారు. దీంతో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష విధించింది. ఫలితంగా ప్రాతినిధ్య చట్టం కింద వయనాడ్ ఎంపీ పదవి కోల్పోయారు. సూరత్ కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో సవాల్ చేసిన రాహుల్ గాంధీ తాజాగా అఫిడవిట్ దాఖలు చేశారు.
Read also: Breast Cancer: రొమ్ము క్యాన్సర్ ముప్పును పసిగట్టే AI..
Also Read
- Ketan Murder Case: కేతన్ను చంపింది సియానే.. కానీ కోర్టులో నిరూపించడమే అసలు సవాల్!
- INS Mahendragiri: సాహో భారత్.. సముద్రాన్ని శాసించేందుకు వచ్చిన ‘INS మహేంద్రగిరి’! శత్రుదేశాల గుండెల్లో వణుకే..
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
- Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
తాను ఎలాంటి నేరానికీ పాల్పడలేదని రాహుల్ గాంధీ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. తానేమీ శిక్షార్హమైన నేరానికి పాల్పడలేదని తెలిపారు. ఒకవేళ క్షమాపణ చెప్పాల్సి వస్తే అదే అతిపెద్ద శిక్ష అవుతుందని పేర్కొన్నారు. ఒకవేళ క్షమాపణే అయితే ఈ పాటికే చెప్పేవాడినని పేర్కొన్నారు. తాను క్షమాపణ చెప్పడానికి నిరాకరించినందువల్లే తాను ‘అహంకారి’ అని పూర్ణేష్ మోడీ పేర్కొన్నారని తన అఫిడవిట్లో తెలిపారు. ఏ తప్పూ చేయకపోయినా ప్రజాప్రాతినిధ్య చట్టం కింద క్రిమినల్ నేరాలు మోపి బలవంతంగా క్షమాపణ చెప్పించాలనుకోవడం న్యాయ వ్యవస్థ సమయాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. తనపై విధించిన శిక్షపై స్టే విధించి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతివ్వాలని రాహుల్ గాంధీ అఫిడవిట్లో సుప్రీంకోర్టును కోరారు.
తాజావార్తలు
-
Team India Playing XI: టీమిండియాలో భారీ మార్పులు.. సంజూ ఎంట్రీ.. ఆ ప్లేయర్పై వేటు?
-
Ketan Murder Case: కేతన్ను చంపింది సియానే.. కానీ కోర్టులో నిరూపించడమే అసలు సవాల్!
-
Idupu Kayitham: డిసెంబర్ ఫస్ట్ వీక్ లో “ఇడుపు కాయితం” రిలీజ్
-
Harry Brook: “టీమిండియాను వెనక్కి నెట్టేస్తాం.. నా టార్గెట్ ఇదే”.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ బిగ్ స్టేట్మెంట్..
-
INS Mahendragiri: సాహో భారత్.. సముద్రాన్ని శాసించేందుకు వచ్చిన ‘INS మహేంద్రగిరి’! శత్రుదేశాల గుండెల్లో వణుకే..
ట్రెండింగ్
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!