Jammu Kashmir Issue: జర్మనీ ప్రకటనపై భారత్ ఆగ్రహం.. మీ జోక్యం అవసరం లేదని స్ట్రాంగ్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
German intervention in the Kashmir issue is not necessary Says India: జమ్మూ కాశ్మీర్ అంశంపై జర్మనీ విదేశాంగ మంత్రి చేసి ప్రకటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ జోక్యం అవసరం లేదని స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. కాశ్మీర్ పై జర్మనీ అనుసరిస్తున్న వైఖరిని తిరస్కరించింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ, జర్మనీ విదేశాంగ శాఖ మంత్రి అన్నలెనా బేర్ బాక్ ఇద్దరు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కాశ్మీర్ పరిస్థితికి సంబంధించి జర్మనీ పాత్ర, బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు అన్నలేనా బేర్ వాక్. ఈ ప్రాంతంలో శాంతియుత పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి కలుగుచేసుకోవాలని అన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని తిరస్కరిస్తూ.. శనివారం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాదం, ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కీలక బాధ్యత పోషించాల్సిన అవసరం అంతర్జాతీయ సమాజానికి ఉందని.. భారత కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ దశాబ్ధాలుగా ఉగ్రవాదాన్ని భరించిందని.. ఇప్పటి వరకు అది కొనసాగుతుందని.. విదేశీ పౌరులు కూడా బాధితులుగా ఉన్నారని.. 26/11 ఉగ్రదాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులను యూఎన్ భద్రతా మండలి, ఎఫ్ఏటీఎఫ్ వెంబడిస్తోందని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read
- NALSAR: "CJI సూర్యకాంత్ చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోం".. నల్సార్ యూనివర్సిటీ వివాదం..
- Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
- Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
Read Also: Uttar Pradesh: 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. బిడ్డకు జన్మనిచ్చిన మైనర్
జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలేనా బేర్ బాక్ మాట్లాడుతూ.. భుట్టో వివరించినట్లు ఉద్రిక్తతలు ఉన్నాయని.. మేము కాల్పుల విరమరణనను అనుసరించాలని పాకిస్తాన్ కు చెబుతున్నామని.. రాజకీయంగా చర్చించాలని భారత్ దేశాన్ని కోరుతున్నామని..ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కోరుతున్నామని అన్నారు. దీనిపై భారత్ స్పందింస్తూ.. ముందుగా పాకిస్తాన్ నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదం గురించి యూరోపియన్ దేశాలు ఆలోచించాలని.. జమ్మూకాశ్మీర్ అంశం ద్వైాపాక్షికంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మూడో దేశం అవసరం లేదని జర్మనీకి చెప్పకనే చెప్పింది. స్వార్థం, ఉదాసీనత వల్ల దేశాలు ఈ విషయాలను గుర్తించనప్పుడు అవి శాంతిని అణగదొక్కతాయని.. తీవ్రవాద బాధితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అరిందమ్ బాగ్చీ ప్రకటనలో పేర్కొన్నారు.
Our response to media queries on comments regarding Jammu and Kashmir during recent joint press conference of the Foreign Ministers of Germany and Pakistanhttps://t.co/sZZ88zfQVa pic.twitter.com/K3hqhLZbjM
— Randhir Jaiswal (@MEAIndia) October 8, 2022
తాజావార్తలు
-
CM Chandrababu: గిరిజన ఉత్పత్తుల స్టాళ్ల సందర్శన.. బ్రాండింగ్పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
-
Allu Arjun : నా కల్లో కూడా అనుకోలేదు.. AAA వైజాగ్ ఓపెనింగ్ లో అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్
-
NALSAR: “CJI సూర్యకాంత్ చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోం”.. నల్సార్ యూనివర్సిటీ వివాదం..
-
Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!