Uttar Pradesh: 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. బిడ్డకు జన్మనిచ్చిన మైనర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
12-Year Old girl Gives Birth To Boy In UTTAR PRADESH: అభం శుభం తెలియన 12 ఏళ్ల బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బాలికను బెదిరించి ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం సదరు బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ కు చెందిన 7వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలికపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకే అపార్ట్మెంట్ లో నివసిస్తున్న 19 ఏళ్ల వ్యక్తి బాలికపై కన్నేశాడు. బాలికను బెదిరించి లొంగదీసుకున్నారు. పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.
అతనితో పాటు అతని 21 ఏళ్ల సోదరుడు కూడా బాలికపై అత్యాచారం చేయడం ప్రారంభించాడు. ఇద్దరూ కూడా బాలికను బెదిరిస్తూ అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతే కాకుండా.. ఈ ఇద్దరు సోదరులతో కలిసి నివసిస్తున్న 16 ఏళ్ల బాలిక, డబ్బు కోసం బాధితురాలిని వేరే వ్యక్తికి అప్పగించింది. ఆ వ్యక్తి కూడా బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బాలిక గర్భం దాల్చింది.
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
Read Also: Kerala: డాక్టర్ల నిర్లక్ష్యం ఐదేళ్లుగా మహిళ కడుపులో కత్తెర.. విచారణకు మంత్రి ఆదేశం
అయితే కుటుంబీకులు బాధితురాలు గర్భం దాల్చడాన్ని గమనించలేదు. బిడ్డను ప్రసవించే సమయం వరకు బాలిక సాధారణంగానే ఉంది. అయితే ఆస్పత్రికి తీసుకురాగా.. ఆమెకు కిడ్నీలో రాళ్లు ఉన్నాయని వైద్యులు శస్త్ర చికిత్స చేయాలని చెప్పారని బాలిక కుటుంబసభ్యులకు చెప్పింది. తీరా మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు అన్నదమ్ములతో పాటు 35 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 5న ఘజియాబాద్ ఖోడో స్టేషన్ లో ఫిర్యాదు నమోదు అయినట్లు పోలీస్ అధికారి అల్తాప్ అన్సారీ వెల్లడించారు. నిందుతులందరిని అరెస్ట్ చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్టు వెల్లడించారు.
తాజావార్తలు
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
-
Red Magic Tablet 5 Pro: రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో వచ్చేస్తోంది.. 8300mAh బ్యాటరీ, 185Hz OLED డిస్ప్లే
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!