Uttar Pradesh: 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. బిడ్డకు జన్మనిచ్చిన మైనర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
12-Year Old girl Gives Birth To Boy In UTTAR PRADESH: అభం శుభం తెలియన 12 ఏళ్ల బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బాలికను బెదిరించి ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం సదరు బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ కు చెందిన 7వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలికపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకే అపార్ట్మెంట్ లో నివసిస్తున్న 19 ఏళ్ల వ్యక్తి బాలికపై కన్నేశాడు. బాలికను బెదిరించి లొంగదీసుకున్నారు. పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.
అతనితో పాటు అతని 21 ఏళ్ల సోదరుడు కూడా బాలికపై అత్యాచారం చేయడం ప్రారంభించాడు. ఇద్దరూ కూడా బాలికను బెదిరిస్తూ అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతే కాకుండా.. ఈ ఇద్దరు సోదరులతో కలిసి నివసిస్తున్న 16 ఏళ్ల బాలిక, డబ్బు కోసం బాధితురాలిని వేరే వ్యక్తికి అప్పగించింది. ఆ వ్యక్తి కూడా బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బాలిక గర్భం దాల్చింది.
Also Read
- Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర...వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
Read Also: Kerala: డాక్టర్ల నిర్లక్ష్యం ఐదేళ్లుగా మహిళ కడుపులో కత్తెర.. విచారణకు మంత్రి ఆదేశం
అయితే కుటుంబీకులు బాధితురాలు గర్భం దాల్చడాన్ని గమనించలేదు. బిడ్డను ప్రసవించే సమయం వరకు బాలిక సాధారణంగానే ఉంది. అయితే ఆస్పత్రికి తీసుకురాగా.. ఆమెకు కిడ్నీలో రాళ్లు ఉన్నాయని వైద్యులు శస్త్ర చికిత్స చేయాలని చెప్పారని బాలిక కుటుంబసభ్యులకు చెప్పింది. తీరా మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు అన్నదమ్ములతో పాటు 35 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 5న ఘజియాబాద్ ఖోడో స్టేషన్ లో ఫిర్యాదు నమోదు అయినట్లు పోలీస్ అధికారి అల్తాప్ అన్సారీ వెల్లడించారు. నిందుతులందరిని అరెస్ట్ చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్టు వెల్లడించారు.
తాజావార్తలు
-
Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర…వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
-
Hyper Adhi: ‘అక్కడ ఆ ఇంద్రుడిది.. ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది’..!
-
Chiranjeevi Birthday: శివశంకర వరప్రసాద్ నుంచి మెగాస్టార్ వరకు.. 71 ఏళ్లలోనూ చెక్కుచెదరని చిరు ప్రభంజనం
-
Electric Shock Gloves: అమెరికా దుర్మార్గం..వలసదారులపై కరెంట్ ‘షాక్’ అస్త్రం!
-
Psychology Facts: పొసెసివ్నెస్.. రిలేషన్షిప్ను నాశనం చేస్తుందా?
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?