Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. దేశంలో టాప్-1 ధనవంతుడిగా స్థానం..
- దేశంలో అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ..
- అంబానీని దాటేసి టాప్-1 స్థానానికి చేరుకున్న అదానీ..
- హూరన్ రిచ్ రిస్ట్-2024 నివేదికలో వెల్లడి..
Gautam Adani: గౌతమ్ అదానీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని అధిగమించి అగ్రస్థానంలో నిలిచారు. 2024 హూరన్ ఇండియా రిచ్ లిస్టులో గౌతమ్ అదానీ అతడి కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ. 11.6 లక్షల కోట్లుగా ఉంది. 2020లో అదానీ నాలుగో స్థానంలో ఉన్నారు. గతేడాది కాలంలోనే అంబానీ సంపద విలువ 95 శాతం పెరిగింది. హిండెన్బర్గ్ నివేదిక తర్వాత అదానీ కోలుకున్నారు. హిండెన్బర్గ్ నివేదిక తర్వాత అదానీ వ్యాపారాలు ఒడిదొడుకులకు లోనైప్పటికీ ఫినిక్స్ పక్షిలా ఎగురుతూ ఈ ఏడాది ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచారని హూరన్ వెల్లడించింది.
గతేడాదితో పోలిస్తే సంపదలో 95 శాతం పెరుగదలతో రూ.1,161,800 కోట్లకు చేరుకుంది. టాప్-10 జాబితాను పరిశీలిస్తే అదానీ గత 5 ఏళ్లలో అత్యధిక సంపద వృద్ధిని నమోదు చేశారు. గతేడాది అన్ని అదానీ గ్రూపు కంపెనీల షేర్ల ధరలలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. కొత్త పోర్టులు, కంటైనర్ టెర్మినల్స్ కొనుగోలు కారణంగా అదానీ పోర్ట్స్ 98 శాతం పెరుగుదలను చూసింది. అదానీ ఎనర్జీ, అదానీ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్ మరియు అదానీ పవర్-షేరు ధరలో సగటున 76% వృద్ధిని సాధించింది. MSCI తన ఆగస్టు 2024 సమీక్షలో అదానీ గ్రూప్ సెక్యూరిటీలపై పరిమితులను ఎత్తివేయాలని నిర్ణయించడంతో సాధారణ ఆపరేషన్స్ సాధ్యమయ్యాయి.
Also Read
- Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
Read Also: Reliance AGM 2024: ముఖేష్ అంబానీ భారీ ప్రకటన.. ఇక నుంచి ఒక్కరూపాయికే….?
10.14 లక్షల కోట్ల సంపదతో అంబానీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. దేశంలో బిలియనీర్ల సంఖ్య రికార్డు స్థాయిలో 334కి చేరుకుంది. హురున్ ఇండియా వ్యవస్థాపకుడు మరియు ప్రధాన పరిశోధకుడు అనస్ రెహమాన్ జునైద్ మాట్లాడుతూ.. ‘‘భారత్ ఆసియా సంపద సృష్టి ఇంజిన్గా అభివృద్ధి చెందుతోంది’’ అని అన్నారు. ఇదే సమయంలో చైనా బిలియనీర్ల సంఖ్య 25 శాతం క్షీణించింది. భారతదేశంలో 29 శాతం పెరుగుదల కనిపించింది.
జాబితాలో అదానీ, అంబానీ తర్వాత హెచ్సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివనాడార్ అతని కుటుంబం రూ. 3.14 లక్షల కోట్ల సంపదతో మూడో స్థానంలో ఉన్నారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత సైరస్ ఎస్ పూనావాలా(2.89 లక్షల కోట్లు) 4వ స్థానంలో, సన్ ఫార్మా అధినేత దిలీప్ సింఘ్వీ (2.39 లక్షల కోట్లు)తో 5వ స్థానంలో ఉన్నారు. గత ఏడాదిలో ప్రతీ ఐదురోజులకు దేశంలో ఒక బిలియనీర్ పుట్టుకొస్తున్నట్లు నివేదిక తెలిపింది. 1,500 కంటే ఎక్కువ మంది వ్యక్తులు రూ.1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ నికర విలువను కలిగి ఉన్నారు. ఏడేళ్ల క్రితంతో పోలిస్తే ఇది 150% వృద్ధిని చూపుతుందని బిజినెస్ టుడే నివేదించింది. ఈసారి, జాబితా 1,539 అల్ట్రా-రిచ్ వ్యక్తులను గుర్తించింది, గత సంవత్సరంతో పోలిస్తే 220 మంది గణనీయంగా పెరిగారు.
తాజావార్తలు
-
Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
-
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
-
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!