Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. దేశంలో టాప్-1 ధనవంతుడిగా స్థానం..
- దేశంలో అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ..
- అంబానీని దాటేసి టాప్-1 స్థానానికి చేరుకున్న అదానీ..
- హూరన్ రిచ్ రిస్ట్-2024 నివేదికలో వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Adani: గౌతమ్ అదానీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని అధిగమించి అగ్రస్థానంలో నిలిచారు. 2024 హూరన్ ఇండియా రిచ్ లిస్టులో గౌతమ్ అదానీ అతడి కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ. 11.6 లక్షల కోట్లుగా ఉంది. 2020లో అదానీ నాలుగో స్థానంలో ఉన్నారు. గతేడాది కాలంలోనే అంబానీ సంపద విలువ 95 శాతం పెరిగింది. హిండెన్బర్గ్ నివేదిక తర్వాత అదానీ కోలుకున్నారు. హిండెన్బర్గ్ నివేదిక తర్వాత అదానీ వ్యాపారాలు ఒడిదొడుకులకు లోనైప్పటికీ ఫినిక్స్ పక్షిలా ఎగురుతూ ఈ ఏడాది ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచారని హూరన్ వెల్లడించింది.
గతేడాదితో పోలిస్తే సంపదలో 95 శాతం పెరుగదలతో రూ.1,161,800 కోట్లకు చేరుకుంది. టాప్-10 జాబితాను పరిశీలిస్తే అదానీ గత 5 ఏళ్లలో అత్యధిక సంపద వృద్ధిని నమోదు చేశారు. గతేడాది అన్ని అదానీ గ్రూపు కంపెనీల షేర్ల ధరలలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. కొత్త పోర్టులు, కంటైనర్ టెర్మినల్స్ కొనుగోలు కారణంగా అదానీ పోర్ట్స్ 98 శాతం పెరుగుదలను చూసింది. అదానీ ఎనర్జీ, అదానీ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్ మరియు అదానీ పవర్-షేరు ధరలో సగటున 76% వృద్ధిని సాధించింది. MSCI తన ఆగస్టు 2024 సమీక్షలో అదానీ గ్రూప్ సెక్యూరిటీలపై పరిమితులను ఎత్తివేయాలని నిర్ణయించడంతో సాధారణ ఆపరేషన్స్ సాధ్యమయ్యాయి.
Also Read
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
Read Also: Reliance AGM 2024: ముఖేష్ అంబానీ భారీ ప్రకటన.. ఇక నుంచి ఒక్కరూపాయికే….?
10.14 లక్షల కోట్ల సంపదతో అంబానీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. దేశంలో బిలియనీర్ల సంఖ్య రికార్డు స్థాయిలో 334కి చేరుకుంది. హురున్ ఇండియా వ్యవస్థాపకుడు మరియు ప్రధాన పరిశోధకుడు అనస్ రెహమాన్ జునైద్ మాట్లాడుతూ.. ‘‘భారత్ ఆసియా సంపద సృష్టి ఇంజిన్గా అభివృద్ధి చెందుతోంది’’ అని అన్నారు. ఇదే సమయంలో చైనా బిలియనీర్ల సంఖ్య 25 శాతం క్షీణించింది. భారతదేశంలో 29 శాతం పెరుగుదల కనిపించింది.
జాబితాలో అదానీ, అంబానీ తర్వాత హెచ్సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివనాడార్ అతని కుటుంబం రూ. 3.14 లక్షల కోట్ల సంపదతో మూడో స్థానంలో ఉన్నారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత సైరస్ ఎస్ పూనావాలా(2.89 లక్షల కోట్లు) 4వ స్థానంలో, సన్ ఫార్మా అధినేత దిలీప్ సింఘ్వీ (2.39 లక్షల కోట్లు)తో 5వ స్థానంలో ఉన్నారు. గత ఏడాదిలో ప్రతీ ఐదురోజులకు దేశంలో ఒక బిలియనీర్ పుట్టుకొస్తున్నట్లు నివేదిక తెలిపింది. 1,500 కంటే ఎక్కువ మంది వ్యక్తులు రూ.1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ నికర విలువను కలిగి ఉన్నారు. ఏడేళ్ల క్రితంతో పోలిస్తే ఇది 150% వృద్ధిని చూపుతుందని బిజినెస్ టుడే నివేదించింది. ఈసారి, జాబితా 1,539 అల్ట్రా-రిచ్ వ్యక్తులను గుర్తించింది, గత సంవత్సరంతో పోలిస్తే 220 మంది గణనీయంగా పెరిగారు.
తాజావార్తలు
-
Team India: టీమిండియాకు ఒక్క పరుగు షాక్.. ఇదేం మొదటిసారి కాదు!
-
iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
-
Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
-
Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
-
G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!