Rajyavardhan Singh Rathore: గాంధీ కుటుంబం దేశాన్ని విభజించడంలో ప్రసిద్ధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajyavardhan Singh Rathore: బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్రపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘భారత్ తోడో యాత్ర’ అని రాహుల్ గాంధీ తన ప్రయాణంలో భారతదేశ వ్యతిరేక వ్యక్తులతో సమావేశమవుతున్నారని ఆరోపించారు. “గాంధీ కుటుంబం భారతదేశాన్ని విభజించడంలో ప్రసిద్ధి చెందింది. అది కాశ్మీర్లో అధ్వాన్నమైన పరిస్థితిని సృష్టించిన జవహర్లాల్ నెహ్రూ అయినా, దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన ఇందిరా గాంధీ అయినా లేదా సిక్కు అల్లర్లకు నాయకత్వం వహించిన రాజీవ్ గాంధీ అయినా. వారు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోంది” అని రాథోడ్ అన్నారు.
రాజస్థాన్ కాంగ్రెస్కు అన్ని వేళలా కుటుంబానికి మద్దతు ఇవ్వడం తప్ప మరో బాధ్యత లేదని అశోక్ గెహ్లాట్ను ఉద్దేశించి రాజ్యవర్ధన్ రాథోడ్ అన్నారు. రాష్ట్రంలోని సర్కారు సమస్యలపై శ్రద్ధ చూపడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో మహిళల భద్రత, లంపి డిసీజ్ వంటి అనేక ప్రధాన సమస్యలు ఉన్నాయన్నారు. రాజస్థాన్ నేడు అల్లర్లకు కేంద్రంగా మారిందన్నారు. రాజస్థాన్లో అత్యాచారాల సంఘటనలు పెరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. అయితే ఇవి కాంగ్రెస్కు చిన్న సంఘటనలు.. కానీ ఒక కుటుంబాన్ని ప్రశ్నిస్తే అది వారికి పెద్ద సమస్య అవుతుందంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ యాత్ర గురించి రాథోడ్ మాట్లాడుతూ.. దేశాన్ని ఏకం చేస్తున్నట్లు కాంగ్రెస్ నటిస్తోందన్నారు.
Also Read
- Bhojshala Case: "భోజ్శాల హిందువులదే".. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
- Monsoon 2026: గుడ్న్యూస్.. కేరళలోకి ఆరు రోజులు ముందుగానే మాన్సూన్ ఎంట్రీ! ఖరారు చేసిన ఐఎండీ..
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- Bhojshala case: "భోజ్శాల ఒక దేవాలయం".. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
West Bengal: రణరంగాన్ని తలపించిన పశ్చిమ బెంగాల్.. పోలీసుపై దాడి వీడియో వైరల్
రాహుల్గాంధీ భారత వ్యతిరేక పాస్టర్తో సమావేశమై హిందూ సమాజం, ఆర్ఎస్ఎస్పై విపరీతమైన ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్లో చీలిక ఉందని.. మొదట కాంగ్రెస్ను కలిపి పని చేయాలని రాహుల్కు సూచించారు. ప్రజలు తమను తిరస్కరించారని వారు విచారంగా ఉన్నారన్నారు. ‘బీజేపీ అధికారంలో ఉన్న చోట ఎలాంటి అల్లర్లు లేవని, ప్రతి పథకం ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతుందని, కాంగ్రెస్ హయాంలో దేశం విడిచి వెళ్లిన ప్రజలు తిరిగి భారత్కు వస్తున్నారని, ఇప్పుడు ఆర్థికంగా బలమైన దేశాల్లో భారత్ ఒకటి’ అని కేంద్ర మాజీ మంత్రి అన్నారు. చైనా కమ్యూనిస్టులతో కాంగ్రెస్ చేతులు కలిపిందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Husband Suicide: ‘‘నా చేయి పట్టుకున్న భార్యే నన్ను చంపింది’’.. సూసైడ్ వీడియోలో భర్త ఆవేదన
-
Dollar vs Rupee: రక్తకన్నీరు పెట్టుకుంటున్న రూపాయి.. తొలిసారిగా రూ.96 మార్క్ను దాటిన డాలర్ విలువ!
-
Durandhar 2 Review: ఓటీటీలోకి ‘ధురంధర్: ద రివెంజ్’.. ఎక్కడ? ఎప్పుడు? చూడాలంటే!
-
Peddi : వేట షురూ.. ‘రాంబుజ్జి’గా దివ్యేందు సంచలన ఎంట్రీ!
-
Bhojshala Case: “భోజ్శాల హిందువులదే”.. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!