Air India crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై ప్రాథమిక రిపోర్టు వచ్చింది. ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదిక ‘‘ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్’’పై అనుమానాలను వ్యక్తం చేసింది. ఈ నివేదిక ప్రకారం ఇంధన స్విచ్లు రన్ నుంచి కటాఫ్కు మారినట్లు నిర్ధారణ అయింది. దీంతోనే ఇంజన్లకు ఇంధనం నిలిచిపోయినట్లు తేలింది. అయితే, ఇలా ఎందుకు జరిగిందనే దానిపై లోతైన విచారణ జరుగుతోంది.
Air India Plane Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 270 మంది మరణించారు. అయితే, ఈ ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు బృందాలు విచారణ చేపట్టాయి. అయితే, విమానం గాలిలో ఉండగానే రెండు ఇంజన్లు ఫెయిల్ అయ్యాయా.?? అని పరిశోధకులు, విమానయాన సంస్థలు అధ్యయనం చేస్తున్నాయి. విమానం కూలిపోయే సమయంలో ల్యాండింగ్ గేర్ బయటకు ఉండటం, రెక్కల్లోని ప్లాప్స్ ఉపసంహరించుకుని ఉండటం ప్రమాద విజువల్స్లో కనిపించాయి.
అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో ఒక్క వ్యక్తి తప్ప ఎవరూ బయటపడలేదు. విశ్వాస్ కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతం. తాజాగా ఆయనకు సంబంధించి ఓ సమాచారం వెలువడింది. విమాన ప్రమాదం జరిగిన వెంటనే, విశ్వాస్ తన తండ్రితో వీడియో కాల్లో మాట్లాడారు. ఈ వీడియో కాల్ గురించి అతని మరో సోదరుడు తెలిపారు. ప్రమాదం జరిగిన కొన్ని క్షణాల్లోనే విశ్వాస్ తన తండ్రికి ఫోన్ చేసి తాను ప్రాణాలతో బయటపడ్డానని చెప్పారన్నారు.