PM Modi: రాముడు లేడన్న వాళ్లు, ఇప్పుడు “జై సియారం” అంటున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అయోధ్య రామమందిరంపై ఆ పార్టీ వైఖరిని ఉద్దేశిస్తూ ఈ రోజు విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రాముడి ఉనికి ఊహాత్మకం అని, ఆలయాన్ని నిర్మించొద్దనే వారని, కాని ఇప్పుడు వారే ‘జై సియారం’ అని నినాదాలు చేస్తున్నారని అన్నారు. హర్యానాలోని రేవారిలో ఎయిమ్స్కి శంకుస్థాపనకు హాజరైన ప్రధాని మోడీ, అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశం ప్రపంచంలో మంచి గుర్తింపు పొందిందని, ఇది ప్రజల వల్లే సాధ్యమైందని ఆయన అన్నారు.
Read Also: CM Revanth Reddy: తెలంగాణ పోలీసులను, డీజీపీ రవిగుప్తాను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Also Read
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
ఈ వారం జరిగిన యూఏఈ, ఖతార్ పర్యటనను ప్రస్తావిస్తూ.. ఇప్పుడు ప్రపంచంలోని ప్రతీ మూలలో గౌరవం లభిస్తోందని, ఇది ఒక్క నరేంద్రమోడీకే కానది యావత్ దేశానికి గౌరవం లభిస్తోందని ఆయన అన్నారు. గతంలో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడంలో దశాబ్దాలుగా కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించింది. ఆర్టికల్ 370ని రద్దు చేసి హామీ ఇచ్చామని, దానిని నెరవేర్చామన్నారు. దేశ ప్రయోజనాల కన్నా కాంగ్రెస్ పార్టీకి ఒక్క కుటుంబ ప్రయోజనాలే ఎక్కువ అని ఆరోపించారు. కాంగ్రెస్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణాలు చేసిందని దుయ్యబట్టారు.
2014 సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటి కార్యక్రమం రేవారిలోనే జరిగిందని ఆయన గుర్తు చేశారు. అయోధ్య హామీని నెరవేర్చామని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో ఈ సారి 400కు పైగా సీట్లను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో సీట్లు ముఖ్యమని, తనకు మాత్రమ ప్రజల దీవనలే పెద్ద ఆస్తి అని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో గతేడాది జీ-20 సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించిందని అన్నారు. గత 10 ఏళ్లలో భారత్ 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని అన్నారు. రాబోయే మూడో టర్మ్లో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారతుందని మోడీ హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Peddi : పెద్దిపై మిక్డ్స్ టాక్.. కానీ ఆ ఒక్కదానికి అందరూ కనెక్ట్ అవ్వాల్సిందే
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!