“Dog” Remark: ‘‘నిరాశ నుంచి నిరుత్సాహానికి’’.. కాంగ్రెస్ చీఫ్ ‘‘కుక్క’’ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
- కాంగ్రెస్ మహా చీఫ్ ‘‘కుక్క’’ వ్యాఖ్యల కలకలం..
- నిరాశతో ఉన్నందుకే ఇలాంటి కామెంట్స్ అని బీజేపీ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“Dog” Remark: మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటేలే బీజేపీ నేతల్ని ఉద్దేశిస్తూ చేసిన ‘‘కుక్క’’ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న మహారాష్ట్రలో ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారాయి. బీజేపీ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ కాంగ్రెస్ ‘‘నిరాశ’’ చెందుతోందని అభివర్ణించింది. మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి తీవ్ర నిరుత్సాహంతో ఉందని బీజేపీ నేత కిరీట్ సోమయ్య అన్నారు.
‘‘వారు నిరాశ నుంచి నిరుత్సాహనికి’’ వెళ్తున్నారు. శరద్ పవార్ ఏదో మాట్లాడుతున్నాడు, ఉద్ధవ్ ఠాక్రే ఎన్నికల సంఘాన్ని తిడుతున్నాడు, ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ బీజేపీని కుక్క అని పిలుస్తోంది, ఎందుకంటే అన్ని సర్వేలు కూడా బీజేపీ నేతృత్వంలోని మహాయుతి అధికారం చేపడుతుందని చెబుతున్నాయి, దీంతో వారంతా నిరాశలో ఉన్నారు, దీనిని మేము అర్థం చేసుకోగలమని సోమయ్య ఎద్దేవా చేశారు.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
Read Also: CM Chandrababu: వాళ్లకు బాధ్యత లేదు.. మనం ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం
సోమవారం అకోలాలో జరిగిన కాంగ్రెస్ ప్రచారంలో నానా పటోలే మాట్లాడుతూ.. ‘‘ మిమ్మల్ని కుక్కలని పిలిచే బీజేపీ వాళ్లకు అకోలా జిల్లాలోని ఓబీసీలు ఓటేస్తారా..? ఇప్పుడు బీజేపీని కుక్కగా మార్చే సమయం వచ్చింది. వారు చాలా అహంకారంతో ఉన్నారు’’అని బీజేపీని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అంతే ధీటుగా స్పందిస్తోంది.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మాట్లాడుతూ.. నానా పటోలే నిరుత్సాహానికి గురయ్యారని, ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోదని స్పష్టమైందని, అందుకే వారు నిరాశలో ఉన్నారని, అందుకు బీజేపీని కుక్కులు అంటూ తిడుతున్నారని, ఇది ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ మైండ్ సెట్ని తెలియజేస్తోందని దుయ్యబట్టారు. నానా పటోలే వాడిన పదాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. కర్ణాటక కాంగ్రెస్ మంత్రి జమీర్ అహ్మద్, కుమారస్వామిని ఉద్దేశిస్తూ ‘‘నలుపు’’ అనే పదాన్ని వాడాడని, ఇప్పుడు పటోలే కుక్క అనే పదాన్ని వాడుతున్నాడని బీజేపీ అధికార ప్రతినిధి మండిపడ్డారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!