“Dog” Remark: ‘‘నిరాశ నుంచి నిరుత్సాహానికి’’.. కాంగ్రెస్ చీఫ్ ‘‘కుక్క’’ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
- కాంగ్రెస్ మహా చీఫ్ ‘‘కుక్క’’ వ్యాఖ్యల కలకలం..
- నిరాశతో ఉన్నందుకే ఇలాంటి కామెంట్స్ అని బీజేపీ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“Dog” Remark: మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటేలే బీజేపీ నేతల్ని ఉద్దేశిస్తూ చేసిన ‘‘కుక్క’’ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న మహారాష్ట్రలో ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారాయి. బీజేపీ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ కాంగ్రెస్ ‘‘నిరాశ’’ చెందుతోందని అభివర్ణించింది. మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి తీవ్ర నిరుత్సాహంతో ఉందని బీజేపీ నేత కిరీట్ సోమయ్య అన్నారు.
‘‘వారు నిరాశ నుంచి నిరుత్సాహనికి’’ వెళ్తున్నారు. శరద్ పవార్ ఏదో మాట్లాడుతున్నాడు, ఉద్ధవ్ ఠాక్రే ఎన్నికల సంఘాన్ని తిడుతున్నాడు, ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ బీజేపీని కుక్క అని పిలుస్తోంది, ఎందుకంటే అన్ని సర్వేలు కూడా బీజేపీ నేతృత్వంలోని మహాయుతి అధికారం చేపడుతుందని చెబుతున్నాయి, దీంతో వారంతా నిరాశలో ఉన్నారు, దీనిని మేము అర్థం చేసుకోగలమని సోమయ్య ఎద్దేవా చేశారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: CM Chandrababu: వాళ్లకు బాధ్యత లేదు.. మనం ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం
సోమవారం అకోలాలో జరిగిన కాంగ్రెస్ ప్రచారంలో నానా పటోలే మాట్లాడుతూ.. ‘‘ మిమ్మల్ని కుక్కలని పిలిచే బీజేపీ వాళ్లకు అకోలా జిల్లాలోని ఓబీసీలు ఓటేస్తారా..? ఇప్పుడు బీజేపీని కుక్కగా మార్చే సమయం వచ్చింది. వారు చాలా అహంకారంతో ఉన్నారు’’అని బీజేపీని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అంతే ధీటుగా స్పందిస్తోంది.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మాట్లాడుతూ.. నానా పటోలే నిరుత్సాహానికి గురయ్యారని, ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోదని స్పష్టమైందని, అందుకే వారు నిరాశలో ఉన్నారని, అందుకు బీజేపీని కుక్కులు అంటూ తిడుతున్నారని, ఇది ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ మైండ్ సెట్ని తెలియజేస్తోందని దుయ్యబట్టారు. నానా పటోలే వాడిన పదాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. కర్ణాటక కాంగ్రెస్ మంత్రి జమీర్ అహ్మద్, కుమారస్వామిని ఉద్దేశిస్తూ ‘‘నలుపు’’ అనే పదాన్ని వాడాడని, ఇప్పుడు పటోలే కుక్క అనే పదాన్ని వాడుతున్నాడని బీజేపీ అధికార ప్రతినిధి మండిపడ్డారు.
తాజావార్తలు
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
-
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!