Allahabad High Court: ఆర్మీని కించపరిచేలా మాట్లాడే స్వేచ్ఛ ఎవరిచ్చారు.. రాహుల్ గాంధీపై కోర్టు ఆగ్రహం
- భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆర్మీని కించపరిచేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు..
- భారత సైన్యాన్ని విమర్శించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించిన అలహాబాద్ హైకోర్టు..
- మీకు ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛ పరిమితులకు లోబడి ఉంటుంది: న్యాయస్థానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allahabad High Court: 2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇండియన్ ఆర్మీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఈరోజు (జూన్ 4న) విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు మీకు ఇస్తుంది.. కానీ, ఈ స్వేచ్ఛ కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది అని గుర్తి చేసింది. అయితే, భారత సైన్యాన్ని కించపరిచేలా ప్రకటనలు చేసే స్వేచ్ఛ ఎవరు ఇచ్చారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
Read Also: Huawei Pura 80 Series: మాస్టర్ ప్లాన్ వేసిన హువావే.. ఒకేసారి నాలుగు మొబైల్స్ లాంచ్..!?
Also Read
- CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన 'అవ్ని కేజ్రీవాల్'.!
- జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
- RBI Bulletin: బలహీన రుతుపవనాలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపొచ్చు.. నిపుణుల హెచ్చరిక
- Neet Re Exam: పేపర్ లీక్ చేస్తే 'క్షమాపణ'.. గేటు దాటకపోతే 'బలిపశువా'..?
అయితే, భారత్ జోడో యాత్ర సందర్భంగా 2022లో రాజస్థాన్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అరుణాచల్ ప్రదేశ్లో చైనా 2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించి, 20 మంది భారతీయ సైనికులను చంపి, మన సైనికులను కొట్టిందని ఆరోపించారు. దీనిపై కేంద్రాన్ని ప్రశ్నిస్తే.. వారు ఒక్క ప్రశ్నకు కూడా జావాబు ఇవ్వరని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో రాహుల్ గాంధీపై ఉత్తరప్రదేశ్లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ పరువు నష్టం కేసు దాఖలు చేశాడు. ట్రయల్ కోర్టు అతనికి సమన్లు జారీ చేసింది. ఆ తర్వాత ఆయన అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించి.. తనకు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని కోరారు.
Read Also: CM Chandrababu: మంత్రులతో కీలక అంశాలపై చర్చ.. దూకుడు పెంచాలని సీఎం ఆదేశాలు
అలాగే, రాహుల్ గాంధీ తన పిటిషన్లో ఫిర్యాదుదారుడు భారత సైన్యానికి చెందిన అధికారి కాదు.. దీని వల్ల అతడు బాధిత వ్యక్తి కాదని వాదించారు. ఇక, రాహుల్ వాదనను తోసిపుచ్చిన కోర్టు, సెక్షన్ 199(1) క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CRPC) ప్రకారం.. నేరానికి ప్రత్యక్ష బాధితుడు కాకుండా వేరే వ్యక్తి కూడా ఆ నేరం వల్ల ప్రభావితమైతే వారిని బాధిత వ్యక్తిగా పరిగణించవచ్చని వెల్లడించింది. ఈ కేసులో, ఉదయ్ శంకర్ శ్రీవాస్త కల్నల్తో సమానమైన హోదా కలిగిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కు రిటైర్డ్ డైరెక్టర్ కాబట్టి.. ఈ నేరం వల్ల ‘బాధపడిన’ వ్యక్తి అని అలహాబాద్ హైకోర్టు తెలిపింది.
తాజావార్తలు
-
Jamun: రోజుకు 8 నుంచి 10 నేరేడు పండ్లు.. డాక్టర్లు చెప్పిన ఆరోగ్య రహస్యం!
-
CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!
-
Virat Kohli: “నా పని అయిపోయింది.. మళ్లీ ఆడాలనుకోవడం లేదు”.. కోహ్లీ షాకింగ్ స్టేట్మెంట్..
-
Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి!
-
Vijay – Trisha : అన్ఫాలో చేసిన త్రిష.. విజయ్తో ఇక బ్రేకప్?
ట్రెండింగ్
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!