Cruel Father: ఛీ వీడు అసలు తండ్రేనా? భార్యపై అనుమానంతో ఇద్దరు బిడ్డలను చంపి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cruel Father: కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే బిడ్డల పాలిట కాలయముడు అయ్యాడు. భార్యపై అనుమానంతో అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలను హతమార్చాడు. స్కూల్ నుంచి ఇంటికి తీసుకువచ్చి చిన్నారను కిరాతకంగా చంపేశాడు. తండ్రిని నమ్మి వేలుపట్టుకుని వచ్చిన చిన్నారులకు నరకయాతన చూపించి హతమార్చాడు. ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Minister KTR: ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ ప్రకటన.. ఇవాళ, రేపు బీఆర్ఎస్ నిరసన
Also Read
- Ashwini Vaishnaw: వికసిత్ భారత్-2047 లక్ష్యంతో టెక్నాలజీ విప్లవం.. హైదరాబాద్కు 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.!
- Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
- MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
- Damodara Raja Narasimha : మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోళ్లకు కొత్త విధానం..
ఖమ్మం జిల్లా మధిర మండలం రాయపట్నంకు చెందిన పర్శపు శివరామ గోపాలరావు అదే గ్రామానికి చెందిన ఏసుమణిని పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు రామకృష్ణ, కుమార్తె ఆరాధ్య ఉన్నారు. రామకృష్ణ స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతుండగా.. ఆరాధ్య ఒకటవ తరగతి చదువుతోంది. అయితే గోపాలరావుకు భార్యపై అనుమానం పెరిగింది. ఈ క్రమంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. నెల రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో.. ఏసుమణి తన ఇద్దరు పిల్లలతో కలిసి అదే గ్రామంలోని తన ఇంటికి వెళ్లింది. చెడు వ్యసనాలకు బానిసైన గోపాలరావు చివరికి దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు గ్రామంలోని పాఠశాలకు వెళ్లిన గోపాలరావు తన ఇద్దరు పిల్లలను ఇంటికి తీసుకొచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వారిని దారుణంగా హత్య చేశాడు. ఇద్దరు పిల్లలను గొంతు నులిమి చంపాడు. ఆ తర్వాత పిల్లల మృతదేహాలను దుప్పటిలో చుట్టి ఇంటి నుంచి పారిపోయాడు. సాయంత్రం 5 గంటలైనా పిల్లలు పాఠశాల నుంచి ఇంటికి రాకపోవడంతో ఏసుమని ఆందోళనకు గురైంది.
Read also: UK: నర్స్ అక్రమ సంబంధం.. కారులో అది చేస్తుండగా రోగి మృతి.. ఆమె పరిస్థితి
పాఠశాలకు వెళ్లి విచారించగా.. సాయంత్రం 4 గంటలకు నాన్న తీసుకెళ్లారని చెప్పారు. దీంతో ఏసుమణి ఇంటికి వెళ్లి తలుపులు తెరిచి చూడగా పిల్లలు కనిపించలేదు. బీరువా పక్కన ఒక పొట్లం ఉండటంతో అనుమానంతో ఏసుమణి దానిని తెరిచింది. అక్కడ ఇద్దరు పిల్లలు పడి ఉండడం చూసి షాక్ తిన్నారు. వెంటనే స్థానికుల సహాయంతో పిల్లలను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లింది. అప్పటికే పిల్లలు చనిపోయారని అనడంతో తల్లి ఏసుమణి బోరున విలపించింది. ఆమె రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఏసుమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న గోపాలరావు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే పిల్లలను చంపేయడం స్థానికంగా కలకలం రేపింది. ఇంత దారుణానికి ఒడిగట్టిన గోపాలరావు అసలు వ్యక్తి కాదని, అతడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Extramarital Affair: ఇంటి యజమానురాలితో డ్రైవర్ ఎఫైర్.. ఫోన్ పెట్టిన చిచ్చుతో ఊహించని ట్విస్ట్
తాజావార్తలు
-
Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని పై నుంచి కిందికి ఎందుకు చెక్కారు.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్మాణం!
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Akkineni Nagarjuna : అఖిల్కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను
-
Sri Charani: చరిత్ర సృష్టించిన కడప బిడ్డ.. టెస్ట్ ఫార్మాట్లోకి అడుగు పెట్టిన తెలుగమ్మాయి..
-
INS Mahendragiri: భారత నౌకాదళంలోకి స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి.. ఆత్మనిర్భర్ భారత్కు మరో మైలురాయి
ట్రెండింగ్
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!