Jagdeep Dhankhar: మాజీ ఉపరాష్ట్రపతి ధన్ఖర్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..! వెలుగులోకి సమాచారం
- వెలుగులోకి మాజీ ఉపరాష్ట్రపతి ధన్ఖర్ సమాచారం
- అన్ని సదుపాయాలు అందుతున్నాయన్న ఓ అధికారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగదీప్ ధన్ఖర్.. మాజీ ఉపరాష్ట్రపతి. జూలై 21న అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల చేత పదవికి రాజీనామా చేసినట్లు రాష్ట్రపతికి లేఖ పంపారు. అప్పటి నుంచి బహిరంగంగా ఎప్పుడూ కనిపించలేదు. దీంతో ఆయన ఏమయ్యారంటూ విపక్షాలు.. కేంద్రానికి లేఖలు రాశాయి. ధన్ఖర్ సమాచారం ఇవ్వాలంటూ అమిత్ షాను శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ కోరారు.
ఇది కూడా చదవండి: Bihar: ప్రియుడు ఘాతుకం.. షాపింగ్ మాల్లో ఉన్న ప్రియురాలిని బయటకు పిలిచి ఏం చేశాడంటే..!
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
తాజాగా జగదీప్ ధన్ఖర్ గురించి కీలక సమాచారం బయటకు వచ్చింది. ప్రస్తుతం ధన్ఖర్ ఓటీటీ షోలు, టేబుల్ టెన్నిస్, యోగా చేస్తున్నారంటూ ఓ అధికారి తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతిగా ప్రభుత్వం తగిన బంగ్లాను కేటాయించిందని చెప్పారు. అధికారికంగా కారు, ఎస్కార్ట్ కారు, సెక్యూరిటీ గార్డులు, ఇతర ప్రయోజనాలన్నీ లభిస్తాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. పెరిగిన పసిడి ధరలు
జాతీయ మీడియా కథనం ప్రకారం… మినీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో సాయంత్రం పూట టేబుల్ టెన్నిస్ ఆడుతున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం పూట మాత్రం యోగా సాధన చేస్తున్నారని సమాచారం. గురువు ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఓటీటీ వాచ్లిస్టులో ది లింకన్ లాయర్, హౌస్ ఆఫ్ కార్డ్స్ చూస్తున్నారు. వాస్తవానికి వృత్తిపరంగా ధన్ఖర్ న్యాయవాది కావడం విశేషం.
ఇది కూడా చదవండి: Trump-Modi: రేపటి నుంచి ట్రంప్ కొత్త సుంకం అమలు.. భారత్ స్పందన ఇదే!
ఇక భార్య సుదేష్ ధన్ఖర్ గత నెలలో రాజస్థాన్కు కనీసం మూడు రోడ్ ట్రిప్లు చేసినట్లు తెలుస్తోంది. జైపూర్లో పూర్వీకుల వ్యవసాయ భూమిలో ధన్ఖర్ దంపతులు రెండు వాణిజ్య భవనాలను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. కుమార్తె కామ్నా వాజ్పేయి గుర్గావ్ ప్రతిరోజూ సందర్శిస్తూ వస్తుంది. సుదేష్ ధన్ఖర్ చివరిసారిగా జైపూర్కు 7-10 రోజుల క్రితం ప్రైవేట్ సందర్శనకు వచ్చారని సమాచారం. జైపూర్ విమానాశ్రయం నుంచి కేవలం 15 నిమిషాల దూరంలో న్యూ సంగనేర్ రోడ్లో ఈ నిర్మాణం ఉంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!