Bihar: ప్రియుడు ఘాతుకం.. షాపింగ్ మాల్లో ఉన్న ప్రియురాలిని బయటకు పిలిచి ఏం చేశాడంటే..!
- బీహార్లో దారుణం
- ప్రియురాలిని చంపి ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని కఠిన శిక్షలు వచ్చినా నేరస్థుల్లో మార్పు రావడం లేదు. ఎక్కడొక చోటు దారుణాలు జరుగుతూనే ఉంటున్నాయి. ప్రేమ కారణంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. పెళ్లికి చేసుకునేందుకు నిరాకరించిందన్న కోపంతో ఓ ప్రియుడు ఘాతుకానికి తెగబడ్డాడు. ప్రియురాలిని చంపి.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన బీహార్లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. పెరిగిన పసిడి ధరలు
Also Read
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
జాకీ నాట్, కాజల్ కుమార్ ప్రేమించుకున్నారు. అయితే వేర్వేరు కులాలు కావడంతో అనంతరం జాకీ నాట్ను పెళ్లి చేసుకునేందుకు ఆమె నిరాకరించింది. దీంతో జాకీ నాట్ కోపం పెంచుకున్నాడు. బీహార్లోని రోహ్తాస్ జిల్లాలోని ఒక ప్రైవేటు గెస్హౌస్కు కాజల్ కుమార్ను తీసుకెళ్లాడు. ఏం గొడవ జరిగిందో ఏమో తెలియదు గానీ.. అనంతరం తుపాకీ తీసుకుని కాజల్ కుమార్ను కాల్చి చంపాడు. అనంతరం జాకీ నాట్ కూడా తనకు తానుగా కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
ఇది కూడా చదవండి: Trump: ఆ కార్డులాడితే చైనా వినాశనమే.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
కాజల్ కుమారి తల్లి గాయత్రి దేవి మాట్లాడుతూ.. తన కూతురు ఒక మాల్లో పనిచేస్తుందని.. కొన్ని గంటల ముందే మార్కెట్లో దింపి వచ్చినట్లు తెలిపింది. తన కూతురిని బల్లియాకు చెందిన ఒక వ్యక్తి హోటల్ గదిలో కాల్చి చంపాడనే విషయం తెలిసిందని కన్నీరుమున్నీరు అయింది. పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నాడని.. ఒప్పుకోకపోవడంతో చంపేశాడని వాపోయింది. తనకు దక్కని అమ్మాయి.. మరొకరికి దక్కకూడదన్న కారణంతోనే చంపేశాడని విలపించింది. అయినా వేరే కులానికి చెందిన వాడిని ఎలా పెళ్లి చేసుకుంటుందని ఆమె ప్రశ్నించింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. జాకీ కాజల్పై కాల్పులు జరిపిన తర్వాత తనకు తాను కాల్చుకుని నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోందని పోలీసులు చెప్పారు. బాధిత మహిళను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి వారణాసిలోని ఆస్పత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ చనిపోయింది. తుపాకీ, కార్ట్రిడ్జ్ షెల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
-
Success Story: ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.. IT జాబ్ వదిలి మష్రూమ్ బిజినెస్తో లక్షలు!
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
-
Kriti Sanon: రాహుల్గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..