Bihar: ప్రియుడు ఘాతుకం.. షాపింగ్ మాల్లో ఉన్న ప్రియురాలిని బయటకు పిలిచి ఏం చేశాడంటే..!
- బీహార్లో దారుణం
- ప్రియురాలిని చంపి ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని కఠిన శిక్షలు వచ్చినా నేరస్థుల్లో మార్పు రావడం లేదు. ఎక్కడొక చోటు దారుణాలు జరుగుతూనే ఉంటున్నాయి. ప్రేమ కారణంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. పెళ్లికి చేసుకునేందుకు నిరాకరించిందన్న కోపంతో ఓ ప్రియుడు ఘాతుకానికి తెగబడ్డాడు. ప్రియురాలిని చంపి.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన బీహార్లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. పెరిగిన పసిడి ధరలు
Also Read
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
- Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
జాకీ నాట్, కాజల్ కుమార్ ప్రేమించుకున్నారు. అయితే వేర్వేరు కులాలు కావడంతో అనంతరం జాకీ నాట్ను పెళ్లి చేసుకునేందుకు ఆమె నిరాకరించింది. దీంతో జాకీ నాట్ కోపం పెంచుకున్నాడు. బీహార్లోని రోహ్తాస్ జిల్లాలోని ఒక ప్రైవేటు గెస్హౌస్కు కాజల్ కుమార్ను తీసుకెళ్లాడు. ఏం గొడవ జరిగిందో ఏమో తెలియదు గానీ.. అనంతరం తుపాకీ తీసుకుని కాజల్ కుమార్ను కాల్చి చంపాడు. అనంతరం జాకీ నాట్ కూడా తనకు తానుగా కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
ఇది కూడా చదవండి: Trump: ఆ కార్డులాడితే చైనా వినాశనమే.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
కాజల్ కుమారి తల్లి గాయత్రి దేవి మాట్లాడుతూ.. తన కూతురు ఒక మాల్లో పనిచేస్తుందని.. కొన్ని గంటల ముందే మార్కెట్లో దింపి వచ్చినట్లు తెలిపింది. తన కూతురిని బల్లియాకు చెందిన ఒక వ్యక్తి హోటల్ గదిలో కాల్చి చంపాడనే విషయం తెలిసిందని కన్నీరుమున్నీరు అయింది. పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నాడని.. ఒప్పుకోకపోవడంతో చంపేశాడని వాపోయింది. తనకు దక్కని అమ్మాయి.. మరొకరికి దక్కకూడదన్న కారణంతోనే చంపేశాడని విలపించింది. అయినా వేరే కులానికి చెందిన వాడిని ఎలా పెళ్లి చేసుకుంటుందని ఆమె ప్రశ్నించింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. జాకీ కాజల్పై కాల్పులు జరిపిన తర్వాత తనకు తాను కాల్చుకుని నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోందని పోలీసులు చెప్పారు. బాధిత మహిళను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి వారణాసిలోని ఆస్పత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ చనిపోయింది. తుపాకీ, కార్ట్రిడ్జ్ షెల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Volvo EX90: వోల్వో EX90 ఎలక్ట్రిక్ SUV.. 602KM రేంజ్, 5-స్టార్ సేఫ్టీ, లగ్జరీ ఫీచర్లతో రానున్న ఫ్లాగ్షిప్ EV
-
Akshay Kumar : ‘వెల్కమ్ టుది జంగిల్’ థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
-
Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
-
Ather: ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్ కు రెడీ.. కొత్త EL ప్లాట్ఫామ్, స్మార్ట్ ఫీచర్లు
-
Mithali Raj: ఇకనైనా ‘స్మృతి మందాన’ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!