Delhi: ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్గా రామసుబ్రమణియన్ నియామకం
- ఎన్హెచ్ఆర్సీ ఛైర్మన్గా రామసుబ్రమణియన్ నియామకం
- కమిటీ సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నూతన ఛైర్మన్గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి వి. రామసుబ్రమణియన్ నియమితులయ్యారు. కమిటీ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఎన్హెచ్ఆర్సీ ఛైర్మన్ అరుణ్ కుమార్ మిశ్రా పదవీ కాలం జూన్ 1న ముగిసింది. అప్పటి నుంచి చైర్పర్సన్ పదవి ఖాళీగా ఉంది. మిశ్రా పదవీ విరమణ తర్వాత తాత్కాలిక చైర్పర్సన్గా విజయ భారతి సయానీ నియమితులయ్యారు. తాజాగా పూర్తి ఛైర్మన్గా రామసుబ్రమణియన్ నియమితులయ్యారు. ఈ పదవికి మాజీ ప్రధాన న్యాయమూర్తులు లేదా సుప్రీంకోర్టు రిటైర్ట్ జడ్జిలను నియమిస్తారు. రాష్ట్రపతి ఆమోదంతో చైర్పర్సన్గా ఉంటారు. గతంలో మాజీ సీజేఐలు హెచ్ఎల్ దత్తు కేజీ బాలకృష్ణన్ కూడా హెచ్ఆర్సీ పదవిలో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Bengaluru: సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిజిటల్ అరెస్ట్.. రూ.11.8 కోట్లు మాయం
Also Read
- Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
- Ketan Agarwal Case: ‘పురుషులకు రక్షణ లేదు’.. జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఎంపీ మిట్టల్
- PM Modi: ఆస్ట్రేలియా టూర్ ముందు మోడీకి బెదిరింపులు.. ఫేస్బుక్ ఐడీ ఎక్కడదంటే..!
- Om Birla: ప్రజాప్రతినిధులు స్వామి వివేకానంద ఆదర్శాలను ఆచరించాలి
తనను జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ పదవికి పరిశీలిస్తున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవమని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ శుక్రవారం ఖండించారు. డిసెంబర్ 18న తదుపరి చైర్పర్సన్ను ఎంపిక చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సమావేశం నిర్వహించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ రాజ్యసభ, లోక్సభలో ప్రతిపక్ష నేతలుగా సమావేశానికి హాజరయ్యారు.
వి.రామసుబ్రమణియన్ భారత్కు చెందిన న్యాయమూర్తి. ఆయన 2019 సెప్టెంబరు 23న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. రామసుబ్రమణ్యన్ తమిళనాడు రాష్ట్రం చైన్నైలో జన్మించారు. మద్రాస్ లా కాలేజీలో ఎల్.ఎల్.బి పూర్తి చేసి 1983 ఫిబ్రవరి 16లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకున్నారు. 1983లో న్యాయవాదిగా ప్రాక్టిస్ ప్రారంభించి 23 సంవత్సరాలపాటు చెన్నై హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టిస్ చేశారు. 31 జూలై 2006లో మద్రాస్ హైకోర్టు న్యాయవాదిగా నియమితులై 2016 ఏప్రిల్ 26 వరకు పనిచేశారు. 2016 ఏప్రిల్ 27 నుంచి 2019 జూన్ 21 వరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా, 2019 జూన్ 22 నుంచి 2019 సెప్టెంబరు 22 వరకు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2019 సెప్టెంబరు 23న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా 2023 జూన్ 30వ తేదీ వరకు కొనసాగారు.
ఇది కూడా చదవండి: Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో అగ్నిప్రమాదం
తాజావార్తలు
-
Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
-
Shreyas Iyer: సంజూ శామ్సన్ను పక్కన పెట్టడానికి కారణం ఇదే.. కెప్టెన్ శ్రేయస్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Thalapathy Vijay: కొడుకు కెరీర్ను దళపతి విజయ్ తొక్కేస్తున్నారా? అసలు స్కెచ్ ఇదేనా!
-
Nagabandham: ‘నాగబంధం’ మేకర్స్ ఊహించని నిర్ణయం!
-
Ketan Agarwal Case: ‘పురుషులకు రక్షణ లేదు’.. జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఎంపీ మిట్టల్
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..