Karnataka sex scandal: తన తల్లిని కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించాడు.. హెచ్డీ రేవణ్ణపై సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka sex scandal: కర్ణాటకలో ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోల కేసు ఆ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్కి సంబంధించిన అసభ్యకరమైన వీడియోలు ఇటీవల కర్ణాటక వ్యాప్తంగా, ముఖ్యంగా రేవణ్ణ కుటుంబానికి పట్టు ఉన్న హసన్ జిల్లాలో వైరల్గా మారాయి. దీని తర్వాత రేవణ్ణ ఇంట్లో పనిచేసే 47 ఏళ్ల మహిళ ప్రజ్వల్ రేవణ్ణతో పాటు అతని తండ్రి, జేడీయూ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. దీనిపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ నిమిత్తం సిట్ ఏర్పాటు చేసింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో ప్రజ్వల్ రేవణ్ణ దేశం నుంచి జర్మనీ వెళ్లారు. అతడిపై కర్ణాటక పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా హెచ్డీ రేవణ్ణపై సంచలన ఆరోపణలు నమోదయ్యాయి. తన తల్లిని హెచ్డీ రేవణ్ణ కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళ కొడుకు 20 ఏళ్ల యువకుడు ఆరోపించాడు. దీంతో అతడిపై కిడ్నాప్ కేసు నమోదైంది. గత నెలలో తల్లిపై లైంగిక వేధింపుల వీడియో వైరల్గా మారింది. ఫిర్యాదు చేసిన వ్యక్తి హెచ్డీ రాజు, అతని తల్లి రేవణ్ణ ఫామ్హౌజులో పని చేస్తున్నారు. అయితే, ఈ కేసులో హెచ్డీ రేవణ్ణ ముందస్తు బెయిల్ కోరారు.
Also Read
- Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
Read Also: Supreme Court: ‘‘రాహుల్ గాంధీ పేరు ఉన్నంత మాత్రాన’’.. ఒకే పేరుతో ఉన్న అభ్యర్థుల్ని నిషేధించలేం..
తన తల్లి ఏప్రిల్ 29 నుంచి తప్పిపోయిందని ఆరోపిస్తూ హెచ్డీ రాజు కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో మే 2న ఫిర్యాదు చేశారు. ఆమె కనిపించకుండా పోయిన తర్వాత నుంచి ఆమెని లైంగికంగా వేధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాను, తన తల్లి రేవణ్ణ ఫామ్ హౌజులో ఆరేళ్లుగా పనిచేస్తున్నామని రాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, మూడేళ్ల క్రితం ఆమె అక్కడ పనిచేయడం మానేసింది. ఏప్రిల్ 26న రెండో దశ లోక్సభ ఎన్నికలకు 3-4 రోజుల ముందు తమకు తెలిసిన వ్యక్తి తమ ఇంటికి వచ్చి, రేవణ్ణ భార్య భవానీ తన తల్లిని ఏదో పని నిమిత్తం పిలిచిందని రాజు పేర్కొన్నాడు.
ఏప్రిల్ 26న సతీష్ అనే వ్యక్తి తన తల్లిని తిరిగి ఇంటికి తీసుకువచ్చానడి, అయితే, పోలీసలుు తమ ఇంటికి వస్తే తల్లితో కలిసి పారిపోవాలని సతీష్ రాజుతో చెప్పాడు. మూడు రోజుల తర్వాత ఏప్రిల్ 29న రాత్రి 9 గంటల ప్రాంతంలో సతీస్ తమ నివాసానికి వచ్చి తన తల్లిని తీసుకువాలని రేవణ్ణ ఆదేశించాడని చెప్పి బలవంతంగా తీసుకెళ్లినట్లు రాజు చెప్పాడు. మే 1న తన తల్లిని లైంగికంగా వేధించిన వీడియో వైరల్ అయిందని, ఈ విషయం తన స్నేహితుల ద్వారా తెలిసిందని రాజు చెప్పారు. ఆ వీడియోలో తన తల్లి కాళ్లను కట్టివేసి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు కనిపించిందని చెప్పారు. అదే రోజు తన తల్లి ఆచూకీ తెలుసుకునేందుకు సతీష్ కి ఫోన్ చేస్తే ఆమెపై కేసు నమోదైందని, ఆమెకు బెయిల్ కావాలని చెప్పాడని రాజు చెప్పారు. గతంలో రేవణ్ణతో జరిగి గొడవపై మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఆమె కర్రతో ఉన్న ఫోటో బయటపడినట్లు సతీష్ చెప్పాడు. దీంతో రాజు తన తల్లిని కిడ్నాప్ చేసి ఉండొచ్చని అనుమానించి పోలీసుల్ని ఆశ్రయించాడు. తన తల్లిని కొనుగొనాలని ఆయన కోరాడు.
తాజావార్తలు
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
-
Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!