Karnataka sex scandal: తన తల్లిని కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించాడు.. హెచ్డీ రేవణ్ణపై సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka sex scandal: కర్ణాటకలో ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోల కేసు ఆ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్కి సంబంధించిన అసభ్యకరమైన వీడియోలు ఇటీవల కర్ణాటక వ్యాప్తంగా, ముఖ్యంగా రేవణ్ణ కుటుంబానికి పట్టు ఉన్న హసన్ జిల్లాలో వైరల్గా మారాయి. దీని తర్వాత రేవణ్ణ ఇంట్లో పనిచేసే 47 ఏళ్ల మహిళ ప్రజ్వల్ రేవణ్ణతో పాటు అతని తండ్రి, జేడీయూ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. దీనిపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ నిమిత్తం సిట్ ఏర్పాటు చేసింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో ప్రజ్వల్ రేవణ్ణ దేశం నుంచి జర్మనీ వెళ్లారు. అతడిపై కర్ణాటక పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా హెచ్డీ రేవణ్ణపై సంచలన ఆరోపణలు నమోదయ్యాయి. తన తల్లిని హెచ్డీ రేవణ్ణ కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళ కొడుకు 20 ఏళ్ల యువకుడు ఆరోపించాడు. దీంతో అతడిపై కిడ్నాప్ కేసు నమోదైంది. గత నెలలో తల్లిపై లైంగిక వేధింపుల వీడియో వైరల్గా మారింది. ఫిర్యాదు చేసిన వ్యక్తి హెచ్డీ రాజు, అతని తల్లి రేవణ్ణ ఫామ్హౌజులో పని చేస్తున్నారు. అయితే, ఈ కేసులో హెచ్డీ రేవణ్ణ ముందస్తు బెయిల్ కోరారు.
Also Read
Read Also: Supreme Court: ‘‘రాహుల్ గాంధీ పేరు ఉన్నంత మాత్రాన’’.. ఒకే పేరుతో ఉన్న అభ్యర్థుల్ని నిషేధించలేం..
తన తల్లి ఏప్రిల్ 29 నుంచి తప్పిపోయిందని ఆరోపిస్తూ హెచ్డీ రాజు కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో మే 2న ఫిర్యాదు చేశారు. ఆమె కనిపించకుండా పోయిన తర్వాత నుంచి ఆమెని లైంగికంగా వేధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాను, తన తల్లి రేవణ్ణ ఫామ్ హౌజులో ఆరేళ్లుగా పనిచేస్తున్నామని రాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, మూడేళ్ల క్రితం ఆమె అక్కడ పనిచేయడం మానేసింది. ఏప్రిల్ 26న రెండో దశ లోక్సభ ఎన్నికలకు 3-4 రోజుల ముందు తమకు తెలిసిన వ్యక్తి తమ ఇంటికి వచ్చి, రేవణ్ణ భార్య భవానీ తన తల్లిని ఏదో పని నిమిత్తం పిలిచిందని రాజు పేర్కొన్నాడు.
ఏప్రిల్ 26న సతీష్ అనే వ్యక్తి తన తల్లిని తిరిగి ఇంటికి తీసుకువచ్చానడి, అయితే, పోలీసలుు తమ ఇంటికి వస్తే తల్లితో కలిసి పారిపోవాలని సతీష్ రాజుతో చెప్పాడు. మూడు రోజుల తర్వాత ఏప్రిల్ 29న రాత్రి 9 గంటల ప్రాంతంలో సతీస్ తమ నివాసానికి వచ్చి తన తల్లిని తీసుకువాలని రేవణ్ణ ఆదేశించాడని చెప్పి బలవంతంగా తీసుకెళ్లినట్లు రాజు చెప్పాడు. మే 1న తన తల్లిని లైంగికంగా వేధించిన వీడియో వైరల్ అయిందని, ఈ విషయం తన స్నేహితుల ద్వారా తెలిసిందని రాజు చెప్పారు. ఆ వీడియోలో తన తల్లి కాళ్లను కట్టివేసి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు కనిపించిందని చెప్పారు. అదే రోజు తన తల్లి ఆచూకీ తెలుసుకునేందుకు సతీష్ కి ఫోన్ చేస్తే ఆమెపై కేసు నమోదైందని, ఆమెకు బెయిల్ కావాలని చెప్పాడని రాజు చెప్పారు. గతంలో రేవణ్ణతో జరిగి గొడవపై మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఆమె కర్రతో ఉన్న ఫోటో బయటపడినట్లు సతీష్ చెప్పాడు. దీంతో రాజు తన తల్లిని కిడ్నాప్ చేసి ఉండొచ్చని అనుమానించి పోలీసుల్ని ఆశ్రయించాడు. తన తల్లిని కొనుగొనాలని ఆయన కోరాడు.
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!