Private Shooters to Kills Leopard: గ్రామాల్లోని మనుషులపై దాడులు చేస్తున్న “నరభక్షక” చిరుతపులి..
- గ్రామాల్లోని మనుషులపై దాడులు చేస్తున్న "నరభక్షక" చిరుతపులి
- ఉత్తరాఖండ్లోని పౌరీ జిల్లా, గజాల్డ్ గ్రామంలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పులిని చంపేందుకు ప్రైవేట్ షూటర్లను ఏర్పాటు చేసిన అటవీ శాఖ
ఉత్తరాఖండ్లోని పౌరీ జిల్లాలో ఒక చిరుతపులి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. అడవి నుంచి బయటకు వచ్చిన ఈ చిరుత గ్రామాల్లో తిరుగుతూ, గత వారం రోజులుగా వరుస దాడులు చేసింది. దీంతో అటవీ అధికారులు దానిని అధికారికంగా ‘నరభక్షక చిరుత’గా ప్రకటించారు. ఈ ఘటన పౌరీ జిల్లా గజాల్డ్ గ్రామ పరిసరాల్లో చోటు చేసుకుంది.
చిరుతపులిని చంపేందుకు పౌరిలో అటవీ శాఖ ఇద్దరు ప్రైవేట్ షూటర్లను నియమించింది. ఇప్పటివరకు సమస్యాత్మక వన్యప్రాణులను నిర్మూలించే హక్కు అటవీ అధికారులకే ఉన్నప్పటికీ, పరిస్థితి మరింత దిగజారడంతో ఈసారి షూటర్లను ప్రత్యేకంగా నియమించారు.
Also Read
అయితే..బుధవారం పౌరీలోని పోఖ్రా బ్లాక్లో గడ్డి కోస్తున్న కాంచన్ దేవి అనే మహిళపై చిరుతపులి అకస్మాత్తుగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ఆమె కేకలు వినిన ఇద్దరు గ్రామస్తులు రాళ్లు విసరడంతో చిరుత వెనక్కి తగ్గింది. అనంతరం కాంచన్ దేవిని హెలికాప్టర్ ద్వారా రిషికేశ్లోని ఎయిమ్స్కు తరలించారు.
అంతకుముందు గజాల్డ్ గ్రామంలో చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన రాజేంద్ర నౌటియాల్ కుటుంబాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ (అటవీ) ఆర్.కె. సుధాన్షు, గర్హ్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే పరామర్శించారు. అధికారులు గ్రామస్తులతో మాట్లాడుతున్న సమయంలో అదే ప్రాంతంలోని మరొక కుటుంబానికి చెందిన పశువులపై కూడా చిరుత దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో ప్రాంతంలో భయాందోళనలు మరింత పెరిగాయి.
పరిస్థితి తీవ్రతను గుర్తించిన అధికారులు, పౌరీ గర్హ్వాల్కు చెందిన జయ్ హుకిల్ రాకేష్ చంద్ర బద్వాల్ అనే ఇద్దరు ప్రైవేట్ షూటర్లను అటవీ బృందాలతో కలిసి పనిచేసేలా అధికారికంగా నియమించి, నరభక్షక చిరుతను చంపే బాధ్యతలను వారికి అప్పగించారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?