Flying Buses: ఢిల్లీ, బెంగళూరులో ట్రాఫిక్ సమస్య.. ఎగిరే బస్సులకు కేంద్రం ప్లాన్..
- మెట్రో నగరాల్లో ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి కేంద్రం సరికొత్త ప్లాన్..
- ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ఎగిరే బస్సులు తీసుకొచ్చేందుకు సన్నాహాలు..
- భారత్ లో ఫ్లాష్-ఛార్జింగ్ వ్యవస్థ ప్రధాన ఆవిష్కరణగా నిలవనుంది: కేంద్రమంత్రి గడ్కరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flying Buses: మెట్రో నగరాల్లో ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్లాన్ చేస్తుంది. ఈ సందర్భంగా మెట్రో సిటీల్లో ఎలివేటెడ్ ఎయిర్పాడ్ ఆధారిత వ్యవస్థలు, ఫ్లాష్-చార్జింగ్ ఎలక్ట్రిక్ బస్సులు లాంటి కొత్త రవాణా పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ సందర్భంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. 2014లో అధికారంలోకి తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా రవాణాకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఢిల్లీ, పుణే, బెంగళూరు లాంటి నగరాల్లోని ప్రజలు ఇప్పటికే ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. దీని వలన వేగం, పర్యావరణ స్థిరత్వంపై దృష్టి సారించే ప్రత్యామ్నాయలు చేస్తున్నామని నితీన్ గడ్కరీ వెల్లడించారు.
Read Also: Honeymoon Murder: మరో ట్విస్ట్.. జితేంద్ర యూపీఐ నుంచి నిందితులకు నగదు బదిలీ! పోలీసుల ఆరా
Also Read
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఇక, మన దేశంలో అతి ముఖ్యమైన సమస్య కాలుష్యం.. రూ. 22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాన్ని మనం దిగుమతి చేసుకుంటున్నామని కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ తెలిపారు. భారతీయ సమాజం ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు.. ఇప్పుడు సౌకర్యాన్ని కోరుకుంటోంది అన్నారు. లగ్జరీ బస్సులతో పోలిస్తే, ప్రజలు సౌకర్యంగా ఉండటానికి ఇష్టపడుతున్నారని చెప్పుకొచ్చారు. దీంతో ఢిల్లీ, బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో రద్దీని తగ్గించడానికి ఎగిరే బస్సులను త్వరలోనే అందుబాటులోకి తీసుకుని వస్తాని చెప్పుకొచ్చారు. ఇవి ఎలివేటెడ్ ట్రాక్లపై పని చేసే డ్రైవర్లెస్ ఎలక్ట్రిక్ పాడ్లు అన్నారు. ప్రతిదాంట్లో 135 మంది ప్రయాణీకులను తీసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుంది అని నితీన్ గడ్కరీ చెప్పుకొచ్చారు.
అయితే, ఫ్లాష్-ఛార్జింగ్ వ్యవస్థ ప్రధాన ఆవిష్కరణగా భారత్ లో నిలవనుంది అని కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ తెలిపారు. ఈ బస్సులు స్టేషన్లో ఆగినప్పుడు, ఆటోమేటిక్ ఛార్జింగ్ యూనిట్ వాహనంతో అనుసంధానించబడుతుందని.. ఇది సుమారు 40 కిలోమీటర్ల వరకు నడుస్తుందని వివరించారు. వీటికి సంబంధించిన టెండర్లు అమెరికా, యూరోపియన్ దేశాలతో పాటు రష్యా నుంచి వచ్చాయి. కానీ అవి ఆర్థికంగా లాభదాయకంగా ఉన్నాయని మనం నిర్ధారించుకోవాలి అని సూచించారు. ఈ సేవలను దేశ ప్రజలకు చౌక ధరకు అందించాలని ప్లాన్ చేస్తున్నామని నితీన్ గడ్కరీ చెప్పారు.
తాజావార్తలు
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరే.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!