Flying Buses: ఢిల్లీ, బెంగళూరులో ట్రాఫిక్ సమస్య.. ఎగిరే బస్సులకు కేంద్రం ప్లాన్..
- మెట్రో నగరాల్లో ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి కేంద్రం సరికొత్త ప్లాన్..
- ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ఎగిరే బస్సులు తీసుకొచ్చేందుకు సన్నాహాలు..
- భారత్ లో ఫ్లాష్-ఛార్జింగ్ వ్యవస్థ ప్రధాన ఆవిష్కరణగా నిలవనుంది: కేంద్రమంత్రి గడ్కరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flying Buses: మెట్రో నగరాల్లో ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్లాన్ చేస్తుంది. ఈ సందర్భంగా మెట్రో సిటీల్లో ఎలివేటెడ్ ఎయిర్పాడ్ ఆధారిత వ్యవస్థలు, ఫ్లాష్-చార్జింగ్ ఎలక్ట్రిక్ బస్సులు లాంటి కొత్త రవాణా పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ సందర్భంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. 2014లో అధికారంలోకి తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా రవాణాకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఢిల్లీ, పుణే, బెంగళూరు లాంటి నగరాల్లోని ప్రజలు ఇప్పటికే ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. దీని వలన వేగం, పర్యావరణ స్థిరత్వంపై దృష్టి సారించే ప్రత్యామ్నాయలు చేస్తున్నామని నితీన్ గడ్కరీ వెల్లడించారు.
Read Also: Honeymoon Murder: మరో ట్విస్ట్.. జితేంద్ర యూపీఐ నుంచి నిందితులకు నగదు బదిలీ! పోలీసుల ఆరా
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
ఇక, మన దేశంలో అతి ముఖ్యమైన సమస్య కాలుష్యం.. రూ. 22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాన్ని మనం దిగుమతి చేసుకుంటున్నామని కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ తెలిపారు. భారతీయ సమాజం ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు.. ఇప్పుడు సౌకర్యాన్ని కోరుకుంటోంది అన్నారు. లగ్జరీ బస్సులతో పోలిస్తే, ప్రజలు సౌకర్యంగా ఉండటానికి ఇష్టపడుతున్నారని చెప్పుకొచ్చారు. దీంతో ఢిల్లీ, బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో రద్దీని తగ్గించడానికి ఎగిరే బస్సులను త్వరలోనే అందుబాటులోకి తీసుకుని వస్తాని చెప్పుకొచ్చారు. ఇవి ఎలివేటెడ్ ట్రాక్లపై పని చేసే డ్రైవర్లెస్ ఎలక్ట్రిక్ పాడ్లు అన్నారు. ప్రతిదాంట్లో 135 మంది ప్రయాణీకులను తీసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుంది అని నితీన్ గడ్కరీ చెప్పుకొచ్చారు.
అయితే, ఫ్లాష్-ఛార్జింగ్ వ్యవస్థ ప్రధాన ఆవిష్కరణగా భారత్ లో నిలవనుంది అని కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ తెలిపారు. ఈ బస్సులు స్టేషన్లో ఆగినప్పుడు, ఆటోమేటిక్ ఛార్జింగ్ యూనిట్ వాహనంతో అనుసంధానించబడుతుందని.. ఇది సుమారు 40 కిలోమీటర్ల వరకు నడుస్తుందని వివరించారు. వీటికి సంబంధించిన టెండర్లు అమెరికా, యూరోపియన్ దేశాలతో పాటు రష్యా నుంచి వచ్చాయి. కానీ అవి ఆర్థికంగా లాభదాయకంగా ఉన్నాయని మనం నిర్ధారించుకోవాలి అని సూచించారు. ఈ సేవలను దేశ ప్రజలకు చౌక ధరకు అందించాలని ప్లాన్ చేస్తున్నామని నితీన్ గడ్కరీ చెప్పారు.
తాజావార్తలు
-
Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
-
Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!