Rayapati Sailaja: కాలం బాగోలేదు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి.. మహిళ కమిషన్ చైర్ పర్సన్ కీలక వ్యాఖ్యలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rayapati Sailaja: అనంతపురం జిల్లా రామగిరిలో మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఘటనా ప్రాంతాన్ని సందర్శించారు. ఆమె మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాలుగా ఓ మైనర్ బాలికపై లైంగిక దాడులు జరుగుతున్నాయని విచారకరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా “కాలం బాగోలేదు… అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా అనుమానాలు ఉంటే తల్లిదండ్రులకు చెప్పాలి” అంటూ ఆమె సూచనలు చేశారు. అయితే, తన ప్రసంగంలో మైనర్ బాలిక పేరు బయట పెట్టిన శైలజ, అది పొరపాటుగా జరిగిందని క్షమాపణ తెలిపారు. కానీ ఆమె వ్యాఖ్యలు సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో వివాదం చెలరేగింది.
Read also: Kalpika pub incident : పబ్ లో గబ్బు.. కల్పికపై కేసు
Also Read
- Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
- Bangladesh: బంగ్లాదేశ్లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
- Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
గతంలో ఓ కేసులో బాధితురాలు పేరు చెప్పారని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై పోలీసులు కేసు నమోదు చేసారు. గతంలో తనపై బాధితురాలి పేరు చెప్పినట్టు కేసు పెట్టారని గుర్తు చేస్తూ, రాయపాటి శైలజపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు అరికట్టాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజను దళిత సంఘాలు అడ్డుకున్నాయి. ఇదిలా ఉంటే, బాధిత బాలిక కుటుంబ సభ్యులు మొదట బాలు అనే యువకుడిపై అనుమానం వ్యక్తం చేయగా, పోలీసులు దానినే ప్రాధాన్యతగా తీసుకుని విచారణ సాగించారు. దీంతో అసలైన నిందితుడు నరేష్ను గుర్తించడంలో ఆలస్యం అయ్యిందని శైలజ పేర్కొన్నారు.
Read also: America vs Iran: ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. సైన్యాన్ని వెనక్కి పిలిచిన ట్రంప్
ఇంటర్ విద్యార్థిని తన్మయి కేసులో మొదట బాలు అనే యువకుడిపై పేరెంట్స్ అనుమానం వ్యక్తం చేశారు. దీంతో బాలుపై పోలీసులు ఫోకస్ చేశారు. అందుకే నిందితుడు నరేష్ ను గుర్తించడం ఆలస్యమైంది. ఇప్పటికే పోలీసు నిర్లక్ష్యంపై సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ ను సస్పెండ్ చేశారు. రామగిరి మైనర్ బాలిక పై అత్యాచారం కేసులో నిందితులను పట్టుకున్నాం…16 మందిని అరెస్ట్ చేసాం. రామగిరి దళిత మైనర్ బాలిక ఘటనలో పార్టీలకు సంబంధం లేదని అన్నారు. ఒక్క పక్క దర్యాప్తు కొనసాగుతుండగా, మరో పక్క మహిళా కమిషన్ చైర్పర్సన్ వ్యాఖ్యలు, ఆమెపై నిరసనలు ఈ ఘటనకు కొత్త మలుపు తిప్పాయి.
తాజావార్తలు
-
Miscarriage: గర్భస్రావం తర్వాత మహిళలు చెప్పుకోలేని బాధ ఇదే! శరీరం కోలుకున్నా మనసు ఎందుకు కోలుకోదు?
-
Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
-
Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
-
YS Jagan : కూటమి పాలనలో పాఠశాల విద్యా రంగం నిర్వీర్యం
-
Yash: కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత హైదరాబాద్ ఎందుకు రాలేదో చెప్పిన యశ్.. అసలు కారణం ఇదేనట!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!