Honeymoon Murder: మరో ట్విస్ట్.. జితేంద్ర యూపీఐ నుంచి నిందితులకు నగదు బదిలీ! పోలీసుల ఆరా
- హనీమూన్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్
- జితేంద్ర యూపీఐ నుంచి నిందితులకు నగదు బదిలీ!
- పోలీసుల ఆరా.. హవాలా వార్తలను ఖండించిన సోనమ్ సోదరుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా మరో కొత్త విషయం బయటకు వచ్చింది. నిందితులకు జితేంద్ర రఘువంశీ యూపీఐ ఖాతా నుంచి నగదు బదిలీ అయింది. సోనమ్ రఘువంశీ.. జితేంద్ర రఘువంశీ ఖాతా నుంచి నగదు బదిలీ చేసినట్లుగా మేఘాలయ పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడెవరు? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Rayapati Sailaja: కాలం బాగోలేదు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి.. మహిళ కమిషన్ చైర్ పర్సన్ కీలక వ్యాఖ్యలు..!
Also Read
భర్త రాజా రఘువంశీని హత్య చేసేందుకు భార్య సోనమ్.. కిరాయి హంతకులను నియమించుకుంది. మేఘాలయలో రాజా రఘువంశీని చంపిన తర్వాత నిందితురాలు సోనమ్.. హంతక ముఠాకు మే 23న జితేంద్ర రఘువంశీ పేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతా నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసింది. ఈ నగదును హవాలా రూపంలో ఏమైనా బదిలీ చేసిందా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇది కూడా చదవండి: Lok Sabha Elections: నారీమణులకు కేంద్రం గుడ్న్యూస్..! వచ్చే లోక్సభ ఎన్నికల్లో..!
అయితే ఈ ఆరోపణలను సోనమ్ సోదరుడు గోవింద్ ఖండించాడు. జితేంద్ర రఘువంశీ తమ బంధువేనని.. కజిన్ అని పేర్కొన్నాడు. హవాలాతో మాకు ఎలాంటి సంబంధాలు లేవని తెలిపాడు. కుటుంబ వ్యాపారంలో ఉద్యోగిగా పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అతడి పేరు మీద ఉన్న ఖాతాలోని డబ్బులన్నీ తమవేనని.. ఖర్చుల నిమిత్తం ఖాతాలో జమ చేస్తామని వివరణ ఇచ్చాడు. సోనమ్ యూపీఐ ఖాతా కూడా జితేంద్ర పేరుతోనే తెరిచినట్లు వివరించాడు. ఎందుకు జితేంద్ర పేరుతో ఖాతా తెరిచారని విలేకర్లు అడిగితే మాత్రం కారణాలు చెప్పకుండా దాట వేశాడు.
అయితే జితేంద్ర ఏమైనా సోనమ్ సహకరించాడా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా.. జితేంద్ర కూడా ఒకే దగ్గర పని చేస్తున్నారు. ఆ స్నేహం మీద ఒకవేళ సోనమ్కు ఏమైనా సహకరించాడేమోనన్న విధంగా కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
అయితే జితేంద్ర అలాంటి వాడు కాదని సోనమ్ సోదరుడు తోసిపుచ్చాడు. ఇటీవల రాజా రఘువంశీ ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించి వచ్చినట్లు తెలిపాడు. సోనమ్.. భర్తను చంపిందని వంద శాతం నమ్ముతున్నట్లు జితేంద్ర కూడా అన్నాడని చెప్పుకొచ్చాడు. ఘాజీపూర్ నుంచి సోనమ్ ఫోన్ చేసినప్పుడు ఆమె మాట తీరును బట్టి చూస్తే.. ఆమె నేరం చేసినట్టు అర్థమైనట్లు తెలిపాడు. ప్రస్తుతం ఆమెతో సంబంధాలు తెంచుకున్నామని.. నేరం రుజువైతే మాత్రం ఉరి శిక్ష విధించాలని సోదరుడు డిమాండ్ చేశాడు. అంతేకాకుండా ఇండోర్ వెళ్లి రాజా రఘువంశీ తల్లిని ఓదార్చి వచ్చాడు.
రాజా రఘువంశీ-సోనమ్కు మే 11న వివాహం జరిగింది. మే 20న హనీమూన్ కోసం మేఘాలయకు వచ్చారు. మే 23న అత్యంత దారుణంగా రాజాను సోనమ్ హంతక ముఠాతో చంపించింది. అనంతరం వారితో కలిసి భర్త మృతదేహాన్ని లోయలో తోసేసింది. అనంతరం ఇండోర్కు వచ్చి ఒక గది అద్దెకు తీసుకుని ప్రియుడితో ఎంజాయ్ చేసింది. అటు తర్వాత యూపీకి పారిపోయారు. జూన్ 9న ఘాజీపూర్లో సోనమ్ లొంగిపోయింది. ప్రస్తుతం మేఘాలయ పోలీస్ కస్టడీలో నిందితులు ఉన్నారు.
తాజావార్తలు
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
-
Ragi Pakoda: ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.. రాగి పిండితో కరకరలాడే స్నాక్స్ను సింపుల్గా ఇలా చేసుకోండి!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!