Honeymoon Murder: మరో ట్విస్ట్.. జితేంద్ర యూపీఐ నుంచి నిందితులకు నగదు బదిలీ! పోలీసుల ఆరా
- హనీమూన్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్
- జితేంద్ర యూపీఐ నుంచి నిందితులకు నగదు బదిలీ!
- పోలీసుల ఆరా.. హవాలా వార్తలను ఖండించిన సోనమ్ సోదరుడు
దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా మరో కొత్త విషయం బయటకు వచ్చింది. నిందితులకు జితేంద్ర రఘువంశీ యూపీఐ ఖాతా నుంచి నగదు బదిలీ అయింది. సోనమ్ రఘువంశీ.. జితేంద్ర రఘువంశీ ఖాతా నుంచి నగదు బదిలీ చేసినట్లుగా మేఘాలయ పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడెవరు? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Rayapati Sailaja: కాలం బాగోలేదు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి.. మహిళ కమిషన్ చైర్ పర్సన్ కీలక వ్యాఖ్యలు..!
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
భర్త రాజా రఘువంశీని హత్య చేసేందుకు భార్య సోనమ్.. కిరాయి హంతకులను నియమించుకుంది. మేఘాలయలో రాజా రఘువంశీని చంపిన తర్వాత నిందితురాలు సోనమ్.. హంతక ముఠాకు మే 23న జితేంద్ర రఘువంశీ పేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతా నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసింది. ఈ నగదును హవాలా రూపంలో ఏమైనా బదిలీ చేసిందా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇది కూడా చదవండి: Lok Sabha Elections: నారీమణులకు కేంద్రం గుడ్న్యూస్..! వచ్చే లోక్సభ ఎన్నికల్లో..!
అయితే ఈ ఆరోపణలను సోనమ్ సోదరుడు గోవింద్ ఖండించాడు. జితేంద్ర రఘువంశీ తమ బంధువేనని.. కజిన్ అని పేర్కొన్నాడు. హవాలాతో మాకు ఎలాంటి సంబంధాలు లేవని తెలిపాడు. కుటుంబ వ్యాపారంలో ఉద్యోగిగా పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అతడి పేరు మీద ఉన్న ఖాతాలోని డబ్బులన్నీ తమవేనని.. ఖర్చుల నిమిత్తం ఖాతాలో జమ చేస్తామని వివరణ ఇచ్చాడు. సోనమ్ యూపీఐ ఖాతా కూడా జితేంద్ర పేరుతోనే తెరిచినట్లు వివరించాడు. ఎందుకు జితేంద్ర పేరుతో ఖాతా తెరిచారని విలేకర్లు అడిగితే మాత్రం కారణాలు చెప్పకుండా దాట వేశాడు.
అయితే జితేంద్ర ఏమైనా సోనమ్ సహకరించాడా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా.. జితేంద్ర కూడా ఒకే దగ్గర పని చేస్తున్నారు. ఆ స్నేహం మీద ఒకవేళ సోనమ్కు ఏమైనా సహకరించాడేమోనన్న విధంగా కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
అయితే జితేంద్ర అలాంటి వాడు కాదని సోనమ్ సోదరుడు తోసిపుచ్చాడు. ఇటీవల రాజా రఘువంశీ ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించి వచ్చినట్లు తెలిపాడు. సోనమ్.. భర్తను చంపిందని వంద శాతం నమ్ముతున్నట్లు జితేంద్ర కూడా అన్నాడని చెప్పుకొచ్చాడు. ఘాజీపూర్ నుంచి సోనమ్ ఫోన్ చేసినప్పుడు ఆమె మాట తీరును బట్టి చూస్తే.. ఆమె నేరం చేసినట్టు అర్థమైనట్లు తెలిపాడు. ప్రస్తుతం ఆమెతో సంబంధాలు తెంచుకున్నామని.. నేరం రుజువైతే మాత్రం ఉరి శిక్ష విధించాలని సోదరుడు డిమాండ్ చేశాడు. అంతేకాకుండా ఇండోర్ వెళ్లి రాజా రఘువంశీ తల్లిని ఓదార్చి వచ్చాడు.
రాజా రఘువంశీ-సోనమ్కు మే 11న వివాహం జరిగింది. మే 20న హనీమూన్ కోసం మేఘాలయకు వచ్చారు. మే 23న అత్యంత దారుణంగా రాజాను సోనమ్ హంతక ముఠాతో చంపించింది. అనంతరం వారితో కలిసి భర్త మృతదేహాన్ని లోయలో తోసేసింది. అనంతరం ఇండోర్కు వచ్చి ఒక గది అద్దెకు తీసుకుని ప్రియుడితో ఎంజాయ్ చేసింది. అటు తర్వాత యూపీకి పారిపోయారు. జూన్ 9న ఘాజీపూర్లో సోనమ్ లొంగిపోయింది. ప్రస్తుతం మేఘాలయ పోలీస్ కస్టడీలో నిందితులు ఉన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?