Floods: ఉగ్రరూపం దాల్చిన నదులు.. వరదల్లో 55 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మేఘాలయ, అసోం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలు భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురయ్యాయి. భారీగా వర్షాలు పడుతున్న అసోంలో మరో 9 మంది మరణించగా వరదల ధాటికి.. రాష్ట్రం మొత్తం చనిపోయిన వారి సంఖ్య 55కు చేరింది. 28 రాష్ట్రాల్లోని దాదాపు 19 లక్షల మంది తీవ్రంగా ప్రభావితమయ్యారు. బ్రహ్మపుత్ర, బరాక్ వాటి ఉపనదులు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వరదలు వందలాది గ్రామాలను ముంచెత్తుతున్నాయి. వరదల తాకిడికి లోయర్ అసోంలోని పలు ప్రాంతాలు మరింత తీవ్రంగా ప్రభావితం అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.అసోంలోని సోనిత్పుర్లోనూ వరదలు పోటెత్తుతున్నాయి. ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
పలు ప్రాంతాల్లో నదుల కట్టలు తెగిపోతున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాష్ట్ర గణాంకాల ప్రకారం 2930 గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. 43,338 హెక్టార్ల మేర పంట మునిగిపోయింది. వరదల ధాటికి ఒక్క అసోంలోనే ఇప్పటివరకు 55 మంది ప్రాణాలు కోల్పోయారు. 19 లక్షల మందికిపైగా తీవ్ర ప్రభావం చూపింది.రాజధాని గువాహటిలో 373 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయగా.. లక్ష మందికిపైగా ఆశ్రయం పొందుతున్నారు. ఒక్క బజలి జిల్లాలోనే 3 లక్షల 50 వేలమంది కిపైగా వరద బాధితులుగా మారారు.
Also Read
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
- Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
వరద సహాయక చర్యల్లో భారత సైన్యం కూడా సేవలందిస్తోంది. ఆయా జిల్లాల అధికారుల విజ్ఞప్తి మేరకు గురువారం నుంచి సహాయచర్యల్లో భాగం పంచుకుంటోంది. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ల్లోనూ పరిస్థితులు అసోం కంటే భిన్నంగా ఏం లేవు. పలు గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. కొండ చరియలు విరిగిపడగా.. రోడ్లు ధ్వంసమయ్యాయి. మేఘాలయలో 18 మంది చనిపోయారు.మేఘాలయలోని చిరపుంజిలో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 972 మి.లీ. వర్షపాతం నమోదైంది. మౌసిన్రామ్లో 1003.6 మి.మీ. వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు
మనుషులు సహా మూగజీవులు కూడా వరదల ధాటికి ఇబ్బందులు పడుతున్నాయి. వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. వరదల్లో వెదురుబొంగులు ఇతరత్రా వాటిని పడవలుగా మార్చుకొని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు.
India Corona: దేశంలో కరోనా కల్లోలం.. వరుసగా మూడోరోజు 12వేలకు పైగానే..
తాజావార్తలు
-
Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
-
AP FDC : ఏపీలో షూటింగ్లకు గుడ్న్యూస్.. ఇక ఫాస్ట్ ట్రాక్ పర్మిషన్లు.!
-
Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
-
Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
-
Shreyas Iyer: ఎంఎస్ ధోని తర్వాత శ్రేయస్ అయ్యర్కే ఆ స్థానం.. మిస్టర్ కూల్ 2.0..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!