Site icon NTV Telugu

Election Results 2022: ఐదు రాష్ట్రాల ఫైనల్‌ రిజల్ట్ ఇదే..!

ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఇవాళ వెల్లడించారు.. ఈ ఫలితాల్లో ఎగ్జిట్​పోల్స్​ అంచనాలకు మించి నరేంద్ర మోడీ-అమిత్‌షా ద్వయం ప్రభంజనాన్ని సృష్టించింది.. పంజాబ్‌ మినహా నాలుగు రాష్ట్రాల్లో విజయాన్ని సాధించింది.. పంజాబ్‌లో ఆమ్​ఆద్మీ పార్టీ గ్రాండ్‌ విక్టరీ కొట్టింది.. ఇక, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్‌లో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది భారతీయ జనతా పార్టీ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ మాత్రం ఎక్కడా పుంజుకున్నది లేదు.. పైగా తన ఓటమి పరంపరను కొనసాగించిందనే చెప్పాలి..

Read Also: AP: బందరులో దారుణం.. ప్రియుడిని తాళ్లతో కట్టేసి.. ప్రియురాలిపై..!

ఇక ఐదు రాష్ట్రాల్లో తుది ఫలిలితాలను ఓసారి పరిశీలిస్తే…
ఉత్తరప్రదేశ్‌ (403): బీజేపీ 273, ఎస్పీ 125, బీఎస్పీ 1, కాంగ్రెస్‌ 2, ఇతరులు 2
పంజాబ్‌ (117): ఆమ్‌ఆద్మీ పార్టీ 92, కాంగ్రెస్‌ 18, ఎస్‌ఏడీ 4, బీజేపీ 2, ఇతరులు 1
ఉత్తరాఖండ్‌ (70): బీజేపీ 47, కాంగ్రెస్‌ 19, ఇతరులు 4
మణిపూర్‌ (60): బీజేపీ 32, కాంగ్రెస్‌ 5, ఎన్‌సీపీ 7, ఇతరులు 16
గోవా (40): బీజేపీ 20, కాంగ్రెస్‌ 12, టీఎంసీ 2, ఇతరులు 6

Exit mobile version