Tamilnadu Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Five Family Members Died In Cuddalore Road Accident: తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంతో వాహనాలు ఒకదానికి మరొకటి ఢీకొట్టుకున్నాయి. రెండు బస్సులు, రెండు లారీలు, రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతులంతా చెన్నైకి చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనర్లు, ఒక పురుషుడు ఉన్నారు. కడలూరు జిల్లా వేప్పుర్ దగ్గర చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
6 Minors Stab Man: హార్న్ వివాదం.. బైక్ను వెంబడించి, కత్తితో పొడిచి..
Also Read
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై ఎల్లప్పుడూ వాహనాల రద్దీ ఉంటుంది. దక్షిణాది జిల్లాలకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో.. ఇక్కడ రాత్రిపూట కూడా రద్దీ ఎక్కువగానే ఉంటుంది. దీనికితోడు కడలూరు జిల్లా వేపూర్ సమీపంలోని అయ్యనార్ పాళయం ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. దీంతో, అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఈ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయిన ఒక కారుని.. వేగంగా వచ్చిన ఓ ఇసుకలారీ ఢీకొట్టింది. ఆ కారు ఎదురుగా నిల్చున్న లారీని ఢీకొట్టి, రెండు లారీల మధ్య నుజ్జునుజ్జయ్యింది. ఈ కారులో ఉన్నవారే మృతి చెందారు. ఈ యాక్సిడెంట్ కారణంగానే ఇతర వాహనాలు ఢీకొట్టేసుకున్నాయి. ఈ ఘటన గురించి సమాచారం అందించగా.. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
Instagram Job Fraud: ఆన్లైన్ మోసం.. ఉద్యోగం పేరుతో యువతికి టోకరా
లారీల మధ్య కారు నుజ్జునుజ్జై మృతిచెందిన ఐదుగురి మృతదేహాలను బయటకు తీసేందుకు.. పోలీసులు రెండు గంటల పాటు శ్రమించారు. కారులో లభ్యమైన ఆర్సీ బుక్తో.. మృతిచెందిన వారు కాంచీపురం జిల్లా నంగనల్లూరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. మదురైలోని ఓ ప్రైవేట్ హోటల్లో బస చేసిన రసీదు కూడా కారులో లభ్యమైంది. ఈ ప్రమాదం కారణంగా.. తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.
తాజావార్తలు
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!