Tamilnadu Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Five Family Members Died In Cuddalore Road Accident: తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంతో వాహనాలు ఒకదానికి మరొకటి ఢీకొట్టుకున్నాయి. రెండు బస్సులు, రెండు లారీలు, రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతులంతా చెన్నైకి చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనర్లు, ఒక పురుషుడు ఉన్నారు. కడలూరు జిల్లా వేప్పుర్ దగ్గర చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
6 Minors Stab Man: హార్న్ వివాదం.. బైక్ను వెంబడించి, కత్తితో పొడిచి..
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై ఎల్లప్పుడూ వాహనాల రద్దీ ఉంటుంది. దక్షిణాది జిల్లాలకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో.. ఇక్కడ రాత్రిపూట కూడా రద్దీ ఎక్కువగానే ఉంటుంది. దీనికితోడు కడలూరు జిల్లా వేపూర్ సమీపంలోని అయ్యనార్ పాళయం ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. దీంతో, అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఈ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయిన ఒక కారుని.. వేగంగా వచ్చిన ఓ ఇసుకలారీ ఢీకొట్టింది. ఆ కారు ఎదురుగా నిల్చున్న లారీని ఢీకొట్టి, రెండు లారీల మధ్య నుజ్జునుజ్జయ్యింది. ఈ కారులో ఉన్నవారే మృతి చెందారు. ఈ యాక్సిడెంట్ కారణంగానే ఇతర వాహనాలు ఢీకొట్టేసుకున్నాయి. ఈ ఘటన గురించి సమాచారం అందించగా.. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
Instagram Job Fraud: ఆన్లైన్ మోసం.. ఉద్యోగం పేరుతో యువతికి టోకరా
లారీల మధ్య కారు నుజ్జునుజ్జై మృతిచెందిన ఐదుగురి మృతదేహాలను బయటకు తీసేందుకు.. పోలీసులు రెండు గంటల పాటు శ్రమించారు. కారులో లభ్యమైన ఆర్సీ బుక్తో.. మృతిచెందిన వారు కాంచీపురం జిల్లా నంగనల్లూరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. మదురైలోని ఓ ప్రైవేట్ హోటల్లో బస చేసిన రసీదు కూడా కారులో లభ్యమైంది. ఈ ప్రమాదం కారణంగా.. తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.
తాజావార్తలు
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..