Vande Bharat Express: నవంబర్ 10న ఐదో వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం.. దక్షిణాదికి తొలి రైలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Express: ఐదో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభానికి సిద్ధం అవుతుంది. నవంబర్ 10న ఈ రైలును ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు నాలుగు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తే అవన్నీ ఉత్తర భారత దేశంలోనే పలు రూట్లలో నడుస్తున్నాయి. తాజాగా ఈ ఐదో వందే భారత్ రైలును దక్షిణాదిలో తొలిసారిగా ప్రారంభించబోతున్నారు. నవంబర్ నెలలో చెన్నై-బెంగళూర్-మైసూర్ మార్గంలో ఈ రైలును ప్రారంభించనున్నారు.
Read Also: Ravi Shastri: జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.. గంగూలీకి పరోక్షంగా రవిశాస్త్రి చురకలు
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
భారత రైల్వేల ఆధునీకీకరణలో భాగంగా సెమి హై స్పీడ్ వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే నాలుగు రైళ్లను ప్రారంభించారు. గురువారం హిమచల్ ప్రదేశ్ ఉనా జిల్లాలో నాలుగో వందేభారత్ రైలును ప్రధాని నరేంద్రమోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు ఢిల్లీ, చండీగఢ్ మధ్య ప్రయాణ సమయాన్ని మూడు గంటలకు తగ్గించనుంది. హిమచల్ ప్రదేశ్ లోని అంబ్ అందౌరా-న్యూఢిల్లీ మార్గంలో వారంలో బుధవారం మినహా అన్ని రోజుల్లో ప్రయాణించనుంది. అంబాలా, చండీగఢ్, ఆనంద్ పూర్ సాహిబ్, ఉనా స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయాన్ని కల్పించారు.
అంతకుముందు సెప్టెంబర్ 30న మూడో వందే భారత్ రైలును ప్రధాని మోదీ గుజరాత్ గాంధీనగర్- ముంబైల మధ్య ప్రారంభించారు. భారతదేశంలో మొదటి వందే భారత్ రైలును న్యూఢిల్లీ-వారణాసి మధ్య, రెండో వందే భారత్ రైలును న్యూఢిల్లీ-శ్రీ వైష్ణోదేవి కట్రా మధ్య ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఐదో వందేభారత్ రైలును దక్షిణాదిలో ప్రారంభించనున్నారు. సెమి హైస్పీడ్ ట్రైన్ గా వందే భారత్ రైలును అభివృద్ధి చేశారు. వైఫై, 32 అంగుళాల ఎల్సీడీ టీవీలు, ఆల్ట్రావయోలెట్ ఎయిర్ ఫ్యూరిఫికేషన్ సిస్టమ్స్ వంటి సేవలు ఈ వందే భారత్ రైలులో ఉన్నాయి. యాంటీ ట్రైన్ కొలిజన్ వ్యవస్థ ‘‘ కవచ్ ’’ వంటి అత్యాధునిక వ్యవస్థలు వందే భారత్ రైలులో ఉన్నాయి.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..