Pahalgam Terror attack: “48 గంటల్లో పొలాలు ఖాళీ చేయాలి”.. సరిహద్దు రైతులకు బీఎస్ఎఫ్ ఆదేశం..
- ‘‘48 గంటల్లో పంటలు ఖాళీ చేయాలి’’..
- సరిహద్దు రైతులకు బీఎస్ఎఫ్ కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam Terror attack: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సరిహద్దుల్లోని రైతులకు కీలక ఆదేశాలు ఇవ్వడం సంచలనంగా మారింది. సరిహద్దు వెంబడి ఉన్న రైతులు 48 గంటల్లో పంట కోత పూర్తి చేసి తమ పొలాలను ఖాళీ చేయాలని శనివారం బీఎస్ఎఫ్ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన భద్రతా చర్యల వల సరిహద్దు కంచె, జీరో లైన్ మధ్య ఉన్న సున్నితమైన జోన్లోని వ్యవసాయ భూమిని కలిగి ఉన్న రైతులు పొలాలను ఖాళీ చేయాలని అడిగారు. దీని వల్ల వేల మంది రైతులపై ప్రభావం పడుతుంది.
Read Also: TVS iQube: బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 150 కి.మీ. రేంజ్!
Also Read
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
- Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
530 కి.మీ అంతర్జాతీయ సరిహద్దులో సుమారు 45,000 ఎకరాల సాగుపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఇది పంజాబ్ రైతులకు సవాల్గా మారింది. అమృత్సర్, తర్న్ తరణ్, ఫిరోజ్పూర్, ఫాజిల్కా జిల్లాల్లోని ఈ వ్యవసాయ ప్రాంతాలకు త్వరలో ప్రవేశం మూసివేయబడుతుందని, పరిస్థితి మరింత దిగజారితే వారి భూములకు నిరవధికంగా ప్రవేశం నిలిపేస్తామని గ్రామాల గురుద్వారాల ద్వారా హెచ్చరికల ప్రకటనలు చేశారు.
ఈ పరిస్థితిపై సరిహద్దు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారుర. పశుగ్రాసం తమ పశువులకు చాలా అవసరమని, శాంతి ఉన్నంత వరకు తాము పనిచేయడానికి అనునమతించాలని రైతులు కోరుతున్నారు. ఇటీవల వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో గోధుమ కోత ఇప్పటికే ఆలస్యమైంది. ఈ పరిస్థితుల్లో ఈ ఆదేశాలు వచ్చాయి. అయితే, రైతులు ప్రయోజనాలను మేము అర్థం చేసుకున్నామని, దీని కన్నా దేశ ప్రయోజనాలు, భద్రత ముఖ్యమని బీఎస్ఎఫ్ అధికారులు చెబుతున్నారు. పంటల వల్ల గస్తీకి ఇబ్బందులు కలగకుండా బీఎస్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!