పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ పై దౌత్య దాడికి దిగింది. ఇందులో భాగంగా భారత్ లో ఉన్నటువంటి పాక్ పౌరులను ఆ దేశానికి పంపించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో హైదరాబాదులోని పాకిస్తానీయులకు లీవ్ ఇండియా పేరుతో నోటీసులు అందజేశారు అధికారులు. హైదరాబాదులో మొత్తం 230 మంది పాకిస్తానీయులు ఉన్నట్లు గుర్తించారు. 199 మందికి లాంగ్ టర్మ్ వీసాలు, 31 మందికి షార్ట్ టైం వీసాలు ఉన్నాయని గుర్తించారు.
షార్ట్ టర్మ్ వీసాలు ఉన్న ఎనిమిది మందికి దేశం విడిచిపోవాలని నోటీసులు జారి చేశారు. మెడికల్ వీసాలు తీసుకున్న వారికి ఈ నెల 29 వరకు గడువు విధించారు. పాకిస్తానీయులు తెలంగాణ రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలని డిజిపి జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నవారు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. అధికారుల ఆదేశాలతో పాకిస్తానీయులు స్వదేశానికి వెళ్తున్నారు. వాఘా-అట్టారీ బార్డర్ కు చేరుకుంటున్నారు. బార్డర్ వద్ద గంభీర వాతావరణం నెలకొంది.