NTV Telugu Site icon

India Pakistan War: ఎయిర్ బేస్‌లపై దాడితో పాకిస్తాన్‌లో భయం.. ఆ తర్వాతే చర్చల ప్రతిపాదన..

Operation Sindoor

Operation Sindoor

India Pakistan War: పహల్గామ్ ఉగ్రదాడి చేసి ఏం అవుతుందిలే, భారత్ ఏం చేస్తుందిలే అనుకున్న పాకిస్తాన్ ఇప్పుడు, దాడి ఎందుకు చేశామా..? అని బాధపడటం తథ్యం. ఎందుకంటే, భారత్ వైమానిక దాడుల్లో భారీ ఎత్తున పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. భారత్ ఈ రేంజ్‌లో అటాక్ చేస్తుందని దాయాది ఊహించలేదు. ఉరి, పుల్వామా ఉగ్రదాడులు జరిగిన తర్వాత, భారత్ చేసినట్లు ఏదైనా చిన్న సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే చేస్తుందని అనుకుంది.

Read Also: Tri Series: సెంచరీతో చెలరేగిన స్మృతి మందాన.. ఫైనల్లో శ్రీలంక పై ఘన విజయం..!

కానీ, భారత్ ఈ రేంజ్‌లో తమను నాశనం చేస్తుందని పాక్ ఆర్మీ, ఐఎస్ఐ అనుకోలేదు. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం, మే 09 భారత్ జరిపిన వైమానిక దాడులు, మే 10న పాకిస్తాన్ మిలిటరీ, ఎయిర్ బేస్‌లను నాశనం చేసిన తర్వాతే పాకిస్తాన్‌కి అర్థమైంది. ఈ దాడులతోనే పాకిస్తాన్ దారికి వచ్చి, కాల్పుల విమరణ, చర్చలకు సిద్ధమైందని తెలుస్తోంది.

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడిన తర్వాత, భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తో మాట్లాడారు. పాకిస్తాన్ చర్చలకు సిద్ధంగా ఉందనే విషయాన్ని చెప్పారు. అయితే, భారత్ చర్చలు కేవలం DGMOల మధ్యే జరగాలి, మరెవరి మధ్యా కాదని భారతదేశం స్పష్టం చేసింది. మే 10న మధ్యాహ్నం 1 గంటలకు పాకిస్తాన్ DGMO, భారత DGMOతో మాట్లాడాలని అనుకున్నారు. దీనికి ముందు, భారత్ మే 07న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్లు పాకిస్తాన్ DGMOకి తెలియజేసిందని, కానీ ఆయన స్పందించలేదని తెలిసింది. పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై దాడి తర్వాతే ఆ దేశం దారికొచ్చినట్లు తెలిసింది.