Jharkhand: లవర్తో మాట్లాడుతుందని కూతురు హత్య.. అత్యాచారంగా చిత్రీకరించే ప్రయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
father kills daughter: తన కూతురు రాత్రి వేళల్లో లవర్ తో మాట్లాడుతోందని ఓ తండ్రి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. దీనికి కుటుంబ సభ్యులు సహకరించారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని చక్రధర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చైసాబాలో చోటు చేసుకుంది. ఈ హత్య నుంచి తప్పించుకునేందుకు కూతురు లవర్ ను నిందితుడిగా చిత్రీకరించేందుకు తండ్రితో పాటు అతని ఇద్దరు కొడుకులు విశ్వప్రయత్నం చేశారు.
Read Also: Sonu Nigam: ప్రముఖ బాలీవుడ్ సింగర్ పై ఎమ్మెల్యే కుమారుడు దాడి
Also Read
వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 9 రాత్రి, తన 20 ఏళ్ల కూతురు సాదియా కౌషర్ వీడియో కాల్ లో తన లవర్ తో మాట్లాడుతుందని భావించిన తండ్రి మహ్మద్ ముస్తాఫా అహ్మద్ తీవ్రంగా కొట్టాడు. దీంతో స్పృహ కోల్పోయిన సాదియా, మరణించిందని భావించి ముస్తాఫా అహ్మద్ తన ఇద్దరు కొడుకులు షేక్ మొహమ్మద్ బకాష్, మొహమ్మద్ షాద్ సాయంతో సాదియా శరీరానికి ఇటుకలు కట్టి ఇంటి ఆవరణలో ఉన్న బావిలో పడేశారు. ఇంతటి ఆగకుండా తన కూతురు కనిపించడం లేదని చక్రధర్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన కూతురుతో ఓ యువకుడితో మాట్లాడుతోందని.. అతనే అత్యాచారం చేసి, తన కూతును చంపేసినట్లు ముస్తాఫా పోలీసులకు ఫిర్యాదు చేసి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. తన కూతురు విషయంలో ఎవరికి అనుమానం రాకుండా పోలీసులపై ఒత్తడి పెంచుతూ, తన కూతురిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు చేయడంతో, ముందుగా పోలీసులు సదరు యువకుడే నిందితుడని భావించారు.
ఇదిలా ఉంటే ఫిబ్రవరి 13న సాదియా శరీరాన్ని ఇంటికి సమీపంలోని ఓ బావిలో కనుగొన్నారు. డాగ్ స్వ్కాడ్ తో పోలీసులు శాస్త్రీయ పరిశోధన చేశారు. విచారణలో నిందితులు హత్య చేసినట్లు అంగీకరించారు. హత్య అనంతరం తండ్రి కొడుకులు తమకు ఏం తెలియనట్లు దుకాణానికి వెళ్లి పనిచేసేవారు. గతంలో కూడా సాదియా కౌషన్ తన స్నేహితులతో మాట్లాడొద్దని తండ్రి హెచ్చరించారు. అయినా తీరు మార్చుకోకపోవడంతో కోపంతో హత్య చేసినట్లు ఎస్పీ అశుతోష్ శేఖర్ తెలిపారు.
తాజావార్తలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!