Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక చిత్రపటంలో ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా క్రీడలు, పర్యాటక రంగాలు రెండింటినీ మిళితం చేస్తూ తెలంగాణను “గోల్ఫ్ టూరిజం హబ్”గా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ప్రపంచస్థాయి కోర్సుల నిర్మాణం..
హైదరాబాద్ శివారు ప్రాంతమైన షామీర్పేట సమీపంలోని జవహర్నగర్లో దాదాపు 130 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ గోల్ఫ్ కోర్సును నిర్మించనున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే క్రీడాకారులను, పర్యాటకులను ఆకట్టుకునేలా దీనిని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపకల్పన చేయనున్నారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
దీంతోపాటు, ప్రకృతి అందాలకు నిలయమైన నాగర్కర్నూల్ జిల్లాలోని సోమశిల వద్ద మరో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సును అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) విధానంలో ఈ రెండింటిని నిర్మించి, పర్యాటకులకు ఉన్నత స్థాయి వసతులను కల్పించనున్నారు.
బ్రాండ్ అంబాసిడర్గా కపిల్ దేవ్..
ఈ భారీ ప్రాజెక్టులతో పాటు తెలంగాణ పర్యాటక , క్రీడారంగాలను ప్రపంచస్థాయిలో ప్రచారం చేసేందుకు ప్రముఖ భారతీయ క్రికెట్ దిగ్గజం, గోల్ఫ్ క్రీడాభిమాని కపిల్ దేవ్ సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయనకున్న ప్రపంచవ్యాప్త గుర్తింపు ద్వారా విదేశీ పర్యాటకులను, పెట్టుబడిదారులను తెలంగాణ వైపు ఆకర్షించడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం.
క్రీడా పర్యాటకానికి కొత్త ఊపిరి..
ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి కేవలం పర్యాటక ఆదాయం మాత్రమే కాకుండా, స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. విదేశీ పర్యాటకుల రాకతో హోటల్, రవాణా రంగాలకు కూడా మహర్దశ పడుతుంది. ప్రకృతి సౌందర్యం, ఆధునిక క్రీడా వసతుల మేళవింపుతో తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.
తాజావార్తలు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్మెన్గా ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!