Farooq Abdullah: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా నేను పోటీలో లేను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఉమ్మడి అభ్యర్థిని నియమించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నప్పటికీ.. అడుగు కూడా ముందుకు పడటం లేదు. విపక్షాలు అనుకుంటున్న అభ్యర్థులు క్రమంగా తాము పోటీలో ఉండబోవడం లేదని చెబుతున్నారు. గతంలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ నేత, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ ను అనుకున్నప్పటికీ.. ఆయన నేను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. దీంతో విపక్షాలు మరికొన్ని పేర్లను తెరపైకి తీసుకువచ్చాయి.
తాజాగా శరద్ పవార్ దారిలోనే నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా కూడా నడుస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా తాను ఉండటానికి నిరాకరించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల ఢిల్లీలో ప్రతిపక్షాల సమావేశాన్ని నిర్వహించింది. అయితే ఇందులో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని ఎన్నికల్లో నిలబెట్టాలని అంతా అనుకున్నారు. అయితే ఫరూఖ్ అబ్దుల్లా పేరు వినిపించింది. కాగా తాను ఈ పోటీలో లేనిని చెప్పడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. భారత రాష్ట్రపతిగా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పరిగణించకుండా తన పేరును ఉపసంహరించుకుంటున్నానని.. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ పరిస్థితి క్లిష్టంగా ఉందని.. ఈ అనిశ్చిత సమాయాల్లో కాశ్మీర్ కు నా ప్రయత్నాలు అవసరం అని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ పేరు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రముఖంగా వినిపిస్తోంది.
Also Read
- Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
- India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
- US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
- PM Modi: న్యూజిలాండ్ టూర్కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
అయితే ఇప్పటి వరకు ప్రతిపక్షాలు ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించడంలో విఫలం అయ్యాయి. ఇదిలావుండగా, రాష్ట్రపతి ఎన్నికలకు ఏకాభిప్రాయ అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు జూన్ 20-21 తేదీల్లో సమావేశం కానున్నారు. ముంబైలో శరద్ పవార్ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి సమావేశానికి టీడీపీ, వైసీపీ, బిజూజనతా దళ్, టీఆర్ఎస్, ఆప్ వంటి పార్టీలు హాజరుకాలేదు. కాంగ్రెస్ తో వేదిక పంచుకునేందకు ఆప్, టీఆర్ఎస్ సిద్ధంగా లేవు.
తాజావార్తలు
-
Jupally Krishna Rao : రూ.8.21 లక్షల కోట్ల అప్పు.. జూపల్లి బిగ్ ఛాలెంజ్.!
-
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ భీకర దాడులు.. 15 మంది మృతి
-
CM Chandrababu Naidu: ఉక్కు కర్మాగార పనులను ప్రారంభించిన సీఎం.!
-
CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
-
Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!