Shivraj Singh Chouhan: రైతులకు గుడ్న్యూస్.. పలు రకాల విత్తనాలు ఉచితంగా అందిస్తామన్న కేంద్రమంత్రి
- రైతులకు గుడ్న్యూస్
- పలు రకాల విత్తనాలు ఉచితంగా అందిస్తామన్న కేంద్రమంత్రి చౌహాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నదాతలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ గుడ్న్యూస్ చెప్పారు. కొత్త వ్యవసాయ ఉత్పత్తుల కోసం రైతులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఇందులో భాగంగా నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ చొరవతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) అభివృద్ధి చేసిన బ్రీడర్, సర్టిఫైడ్ మరియు ఫౌండేషన్ విత్తనాలను ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని శివరాజ్సింగ్ తెలిపారు. నూనె గింజల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన 21 రాష్ట్రాల్లోని 347 జిల్లాలపై దృష్టి సారించి దేశవ్యాప్తంగా 600 క్లస్టర్లలో రైతులకు ఉచితంగా బ్రీడర్, సర్టిఫైడ్ మరియు ఫౌండేషన్ విత్తనాలను ప్రభుత్వం అందజేస్తుందని వ్యవసాయ మంత్రి తెలిపారు.
ఇది కూడా చదవండి: Chhattisgarh Encounter: ఛత్తీస్గడ్ ఎన్కౌంటర్లో కీలక నేతల హతం?
Also Read
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
భోపాల్లో కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడారు. భారతదేశం అంతటా వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి మరియు రైతులను ఆదుకోవడానికి ఉద్దేశించిన అనేక ముఖ్యమైన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ (ఎన్ఎంఈఓ-ఆయిల్సీడ్స్) కింద రైతులకు ఉచితంగా బ్రీడర్ విత్తనాలు, సర్టిఫైడ్ విత్తనాలు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) అభివృద్ధి చేసిన ఫౌండేషన్ విత్తనాలను అందించాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆయన చెప్పారు.
నూనెగింజల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన 21 రాష్ట్రాల్లోని 347 జిల్లాలపై దృష్టి సారించి దేశవ్యాప్తంగా 600 క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రాంతాల్లోని రైతులు ఉచిత విత్తనాలను అందుకోవడమే కాకుండా దిగుబడిని పెంచడానికి అధునాతన వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఇస్తామని చెప్పారు. రైతులు పండించిన ఉత్పత్తులను 100 శాతం కొనుగోలు చేసేలా చూస్తామని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Student suicide: ప్రిన్సిపల్ వేధింపులతో ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం..
ఎడిబుల్ ఆయిల్స్పై దిగుమతి సుంకం విషయంలో ఇటీవలి నిర్ణయాలు దేశీయ ఉత్పత్తి మరియు ధరలను సానుకూలంగా ప్రభావితం చేస్తున్నాయని చౌహాన్ తెలిపారు. సోయాబీన్, ఆవాలు, పొద్దుతిరుగుడు వంటి ఎడిబుల్ ఆయిల్లపై గతంలో 0% ఉన్న దిగుమతి సుంకాన్ని ఇప్పుడు 27.5%కి పెంచినట్లు వివరించారు. న్యాయమైన పరిహారం అందేలా ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కి రైతుల నుంచి సోయాబీన్ను కొనుగోలు చేస్తుందన్నారు.
ఇది కూడా చదవండి: HYDRA: హైడ్రాకి చట్ట బద్దత.. ఆర్డినెన్సుపై సంతకం చేసిన గవర్నర్
తాజావార్తలు
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!