సెంట్రల్ ఎమ్ఎస్పీ కమిటీతో చర్చించనున్న రైతు సంఘాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్ఎస్పీ (కనీస మద్దతు ధర)పై కేంద్ర కమిటీకి ప్రతిపాదించాల్సిన పేర్లను చర్చించేందుకు పంజాబ్కు చెందిన 32 మంది రైతుల సంఘాలు సోనేపట్-కుండ్లీ సరిహద్దులో సమావేశం నిర్వహించాయి.కేంద్ర ప్రభుత్వం సంయుక్త కిసాన్ మోర్చా (SKM)ని కమిటీలో చర్చించేందుకు ఐదుగురు రైతు నాయకుల పేర్లను సమర్పించాలని కోరింది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ నవంబర్ 19న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన తర్వాతఈ చర్చల కోసం కార్యచరణ ప్రారంభం అయింది. వివాదాస్పద చట్టాన్ని రద్దు చేసే బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం ఆమోదించిన విషయం తెల్సిందే.
ఎంఎస్పీ విధానాన్ని మరింత పారదర్శకంగా, ప్రభావవంతంగా మార్చేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. సంయుక్త కిసాన్ మోర్చా కమిటీ అభ్యర్థుల పేర్ల జాబితాను రాబోయే రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి పంపే అవకాశం ఉందని రైతు సంఘాలు వెల్లడించాయి. పంజాబ్కు చెందిన రైతు నాయకులు ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు పేర్లను కమిటీ కోసం ముందుకు తెస్తున్నారు. ప్రభుత్వం మా డిమాండ్లన్నింటినీ ఆమోదించింది. డిసెంబర్ 4న ఆందోళన ఉపసంహరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రైతు నాయకుడు సత్నామ్ సింగ్ మంగళవారం తెలిపారు.
Also Read
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
- Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు రైతు సంఘం డిసెంబర్ 1, 4 తేదీల్లో సమావేశం కానున్నట్టు తెలిపారు. హర్యానాకు చెందిన రైతు నాయకులు బుధవారం సీఎం మనోహర్లాల్తో సమావేశం కానున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో గత ఏడాది కాలంగా నిరసన తెలుపుతున్న రైతులపై పెట్టిన పోలీసు కేసులను ఉపసంహరించుకోవడం ఈ సమావేశంలో చర్చించనున్న కీలకాంశాలలో ఒకటిగా సత్నామ్ సింగ్ తెలిపారు. అంతే కాకుండా, ఆందోళనలో భాగమైన రైతులపై దాఖలైన అన్ని కేసుల ఉపసంహరణను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు/యూటీలకు ఒక ప్రతిపాదనను పంపిందని తెలిపారు.
తాజావార్తలు
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
-
Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్’పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
-
E85 Fuel: భారత్ లో E85 ఇంధనం విడుదల.. పెట్రోల్ కంటే రూ.20 చౌక..! ప్రత్యేకతలు ఇవే
-
India Forex Reserves: రూపాయి స్థిరత్వానికి బలం.. పెరిగిన విదేశీ మారక నిల్వలు.. 938 మిలియన్ డాలర్ల వృద్ధి
-
Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!