సెంట్రల్ ఎమ్ఎస్పీ కమిటీతో చర్చించనున్న రైతు సంఘాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్ఎస్పీ (కనీస మద్దతు ధర)పై కేంద్ర కమిటీకి ప్రతిపాదించాల్సిన పేర్లను చర్చించేందుకు పంజాబ్కు చెందిన 32 మంది రైతుల సంఘాలు సోనేపట్-కుండ్లీ సరిహద్దులో సమావేశం నిర్వహించాయి.కేంద్ర ప్రభుత్వం సంయుక్త కిసాన్ మోర్చా (SKM)ని కమిటీలో చర్చించేందుకు ఐదుగురు రైతు నాయకుల పేర్లను సమర్పించాలని కోరింది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ నవంబర్ 19న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన తర్వాతఈ చర్చల కోసం కార్యచరణ ప్రారంభం అయింది. వివాదాస్పద చట్టాన్ని రద్దు చేసే బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం ఆమోదించిన విషయం తెల్సిందే.
ఎంఎస్పీ విధానాన్ని మరింత పారదర్శకంగా, ప్రభావవంతంగా మార్చేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. సంయుక్త కిసాన్ మోర్చా కమిటీ అభ్యర్థుల పేర్ల జాబితాను రాబోయే రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి పంపే అవకాశం ఉందని రైతు సంఘాలు వెల్లడించాయి. పంజాబ్కు చెందిన రైతు నాయకులు ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు పేర్లను కమిటీ కోసం ముందుకు తెస్తున్నారు. ప్రభుత్వం మా డిమాండ్లన్నింటినీ ఆమోదించింది. డిసెంబర్ 4న ఆందోళన ఉపసంహరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రైతు నాయకుడు సత్నామ్ సింగ్ మంగళవారం తెలిపారు.
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు రైతు సంఘం డిసెంబర్ 1, 4 తేదీల్లో సమావేశం కానున్నట్టు తెలిపారు. హర్యానాకు చెందిన రైతు నాయకులు బుధవారం సీఎం మనోహర్లాల్తో సమావేశం కానున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో గత ఏడాది కాలంగా నిరసన తెలుపుతున్న రైతులపై పెట్టిన పోలీసు కేసులను ఉపసంహరించుకోవడం ఈ సమావేశంలో చర్చించనున్న కీలకాంశాలలో ఒకటిగా సత్నామ్ సింగ్ తెలిపారు. అంతే కాకుండా, ఆందోళనలో భాగమైన రైతులపై దాఖలైన అన్ని కేసుల ఉపసంహరణను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు/యూటీలకు ఒక ప్రతిపాదనను పంపిందని తెలిపారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!