సెంట్రల్ ఎమ్ఎస్పీ కమిటీతో చర్చించనున్న రైతు సంఘాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్ఎస్పీ (కనీస మద్దతు ధర)పై కేంద్ర కమిటీకి ప్రతిపాదించాల్సిన పేర్లను చర్చించేందుకు పంజాబ్కు చెందిన 32 మంది రైతుల సంఘాలు సోనేపట్-కుండ్లీ సరిహద్దులో సమావేశం నిర్వహించాయి.కేంద్ర ప్రభుత్వం సంయుక్త కిసాన్ మోర్చా (SKM)ని కమిటీలో చర్చించేందుకు ఐదుగురు రైతు నాయకుల పేర్లను సమర్పించాలని కోరింది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ నవంబర్ 19న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన తర్వాతఈ చర్చల కోసం కార్యచరణ ప్రారంభం అయింది. వివాదాస్పద చట్టాన్ని రద్దు చేసే బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం ఆమోదించిన విషయం తెల్సిందే.
ఎంఎస్పీ విధానాన్ని మరింత పారదర్శకంగా, ప్రభావవంతంగా మార్చేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. సంయుక్త కిసాన్ మోర్చా కమిటీ అభ్యర్థుల పేర్ల జాబితాను రాబోయే రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి పంపే అవకాశం ఉందని రైతు సంఘాలు వెల్లడించాయి. పంజాబ్కు చెందిన రైతు నాయకులు ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు పేర్లను కమిటీ కోసం ముందుకు తెస్తున్నారు. ప్రభుత్వం మా డిమాండ్లన్నింటినీ ఆమోదించింది. డిసెంబర్ 4న ఆందోళన ఉపసంహరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రైతు నాయకుడు సత్నామ్ సింగ్ మంగళవారం తెలిపారు.
Also Read
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు రైతు సంఘం డిసెంబర్ 1, 4 తేదీల్లో సమావేశం కానున్నట్టు తెలిపారు. హర్యానాకు చెందిన రైతు నాయకులు బుధవారం సీఎం మనోహర్లాల్తో సమావేశం కానున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో గత ఏడాది కాలంగా నిరసన తెలుపుతున్న రైతులపై పెట్టిన పోలీసు కేసులను ఉపసంహరించుకోవడం ఈ సమావేశంలో చర్చించనున్న కీలకాంశాలలో ఒకటిగా సత్నామ్ సింగ్ తెలిపారు. అంతే కాకుండా, ఆందోళనలో భాగమైన రైతులపై దాఖలైన అన్ని కేసుల ఉపసంహరణను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు/యూటీలకు ఒక ప్రతిపాదనను పంపిందని తెలిపారు.
తాజావార్తలు
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Unbeaten Directors of Tollywood : ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుల సినిమాలపై భారీ అంచనాలు
-
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమాకు ఊహించని చిక్కు.. కోర్టు మెట్లు ఎక్కనున్న కుటుంబం
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!