Fake Job Racket: నకిలీ జాబ్స్ మోసం.. మయన్మార్ నుంచి 13మంది ఇండియన్స్ సేఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
13 Indians trapped in fake IT job racket rescued from Myanmar: నకిలీ జాబ్ రాకెట్ వలలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా రక్షించారు. మయన్మార్ దేశంలో ఐటీ జాబ్స్ కోసమని వెళ్లారు 45 మంది భారతీయులు. అయితే అక్కడి వెళ్లాక కానీ తెలియలేదు తామంతా మోసపోయామని. మయన్మార్ లోని మైవడ్డీ ప్రాంతంలో అంతర్జాతీయ జాబ్ రాకెట్ బారిన పడిన 13 మంది భారతీయులను సురక్షితంగా రక్షించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. వీరంతా బుధవారం తమిళనాడుకు చేరుకున్నారని ఆయన వెల్లడించారు.
గత నెలలో మయన్మార్, థాయ్ లాండ్ లోని భారతీయ మిషన్ల ద్వారా 32 మంది భారతీయులను మైవాడి నుంచి రక్షించారు. తాజాగా మరో 13 మందిని సురక్షితంగా ఇండియాకు తీసుకువచ్చారు. మయన్మార్ నకిలీ జాబ్ రాకెట్లలో చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించామని.. ఇప్పటికే 32 మంది భారతీయులను రక్షించామని.. అరిందమ్ బాగ్చీ ట్వీట్ చేశారు.
Also Read
- AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
- India S-400 Squadron: భారత్కు రష్యా నుంచి నాలుగో S-400 స్క్వాడ్రన్.. దేశ వైమానిక రక్షణ మరింత పటిష్టం
- Vivek Agarwal's Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
Read Also: HD Kumaraswamy: కర్ణాటకలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తాం
థాయ్ లాండ్ సరిహద్దుల్లోని ఆగ్నేయ మయన్మార్ లో కయిన్ రాష్ట్రంలోని మైవాడీ ప్రాంతం పూర్తిగా మయన్మార్ ప్రభుత్వం నియంత్రణలో లేదు. అక్కడ సాయుధ తిరుగుబాటు జరుగుతోంది. అయితే భారతీయులు మయన్మార్ లోకి అక్రమంగా ప్రవేశించారని అక్కడి అధికారులు వీరిని నిర్భంధంలోకి తీసుకున్నారు. దీంతో వీరందరిని విడిపించేందుకు భారత విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేసింది. ప్రస్తుతం జాబ్ రాకెట్ తో సంబంధం ఉన్న అనేక మంది ఏజెంట్ల వివరాలను రాష్ట్రాల అధికారులతో పంచుకున్నామని బాగ్చీ వెల్లడించారు.
లావోస్, కంబోడియాలో కూడా ఇలాంటి జాబ్ రాకెట్ ఉదంతాలు వెలుగులోకి వచ్చాయని.. వియంటియాన్, నమ్ పెన్, బ్యాంకాక్ లో ఉన్న భారత రాయబార కార్యాలయాల సహకారంతో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు సహాయం చేస్తున్నామని ఆయన అన్నారు. మయన్మార్ తూర్పు సరిహద్దు ప్రాంతాల్లో డిజిటల్ స్కామింగ్, ఫోర్జ్ క్రిఫ్టో కార్యకలాపాలతో సంబంధం ఉన్న కొన్ని ఎల్టీ కంపెనీలు ఐటీ రంగంలో ఉపాధి అవకాశాల సాకుతో రిక్రూట్మెంట్ ఏజెంట్ల ద్వారా వివిధ ప్రాంతాల నుంచి భారతీయును రిక్రూట్ చేసుకుందని.. సరైన డాక్యుమెంటేషన్ లేకుండా వీరంతా వెళ్లడంతో అక్కడి అధికారులు నిర్భంధంలోకి తీసుకున్నారు.
We have been actively pursuing the case of Indians being trapped in fake job rackets in Myanmar.
Thanks to the efforts of @IndiainMyanmar & @IndiainThailand, around 32 Indians had already been rescued.
Another 13 Indian citizens have now been rescued,& reached Tamil Nadu today. pic.twitter.com/OfkPtnGUkZ
— Randhir Jaiswal (@MEAIndia) October 5, 2022
తాజావార్తలు
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే… ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
-
Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
ట్రెండింగ్
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!