Swati Maliwal Row: అవినీతి కేసులో ఇరుక్కుంది, బీజేపీ ఆమెను బ్లాక్మెయిల్ చేస్తోంది.. ఆప్ సంచలన ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swati Maliwal Row: ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి అంశం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని ఇరకాటంలో పెట్టింది. ఈ వ్యవహారంలో దాడికి పాల్పడినట్లు ఆరోపించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎయిమ్స్ నివేదిక ప్రకారం, ఆమె కాలు, చెంపపై గాయాలు ఉన్నట్లు తేలింది. సోమవారం సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఆమెపై దాడి జరిగిందని ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో బీజేపీ, ఆప్ని లక్ష్యంగా చేసుకుని విమర్శించడమే కాకుండా, సీఎం కేజ్రీవాల్ ఈ విషయంపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే, ఆప్ మాత్రం ఇది బీజేపీ కుట్రగా ఆరోపిస్తోంది. ఆమెపై దాడి జరగనే లేదని నిన్న ఆప్ మంత్రి అతిషీ ప్రెస్మీట్లో చెప్పారు. ఈ కుట్రలో భాగం అయ్యేలా స్వాలి మలివాల్ని బీజేపీ బ్లాక్మెయిల్ చేసిందని బీజేపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి వ్యతిరేకంగా బీజేపీ ఆమెను ఉపయోగించుకుంటోందని మరోసారి ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిషీ శనివారం ఆరోపించారు. బిభవ్ కుమార్ స్వాతి మలివాల్కి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినా ఢిల్లీ పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదేని, ఢిల్లీ పోలీసుల్ని బీజేపీ సాధనంగా వాడుకుంటోందని అన్నారు. దేశ రాజధానిలో లోక్సభ ఎన్నికల ముందు కేజ్రీవాల్ని బీజేపీ టార్గెట్ చేస్తుందని దుయ్యబట్టారు.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
Read Also: Appointment of SPs: మూడు జిల్లాలకు ఎస్పీల నియామకం.. ఈ మేరకు ఈసీ ఆదేశాలు
స్వాతి మలివాల్పై అక్రమ రిక్రూట్మెంట్ కేసు ఆరోపణలు ఉన్నాయని, ఈ విషయంలోనే బీజేపీ ఆమెను బ్లాక్మెయిల్ చేస్తోందని, అందుకే ఈ కుట్రలో భాగమైందని అతిషీ అన్నారు. అయితే, స్వాతి మలివాల్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎడిట్ చేసిన వీడియోలను ఆప్ ప్రసారం చేస్తోందని ఢిల్లీ బీజేపీ ఆరోపించింది. అపాయింట్మెంట్ లేకుండా సోమవారం ముఖ్యమంత్రి నివాసానికి ఆమె ఎందుకు వెళ్లారని అతిషీ ప్రశ్నించారు.
అపాయింట్మెంట్ లేకుండా ఆమె ఎందుకు సీఎం నివాసంలోకి దూసుకెళ్లింది. ఆ రోజు కేజ్రీవాల్ బీజీగా ఉన్నారు. ఆమెను కలవలేదు. అతను ఆ రోజు కలిసి ఉంటే బిభవ్ కుమార్పై ఆరోపణలు వచ్చిన విధంగానే ఆయనపై కూడా వచ్చి ఉండేవని అతిషీ చెప్పారు. బిభవ్ కుమార్, స్వాతి మలివాల్ చెంపపై కొట్టడం, పొట్టలో తన్నడం వంటివి ఆరోపణలు అబద్ధమని అతిషీ చెప్పింది. ఈ కుట్రంలో స్వాతి మలివాల్ కాల్ రికార్డుల్ని పరిశీలించి, ఆమె ఏ బీజేపీ నేతతో టచ్లో ఉందో వెల్లడించాలని ఢిల్లీ పోలీసుల్ని డిమాండ్ చేసింది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!