PM Modi: పాకిస్తాన్లో పేలుళ్లతో కాంగ్రెస్ రాజకుటుంబానికి నిద్ర కరువు..
- పాకిస్తాన్ పేలుళ్లతో కాంగ్రెస్ రాజకుటుంబానికి నిద్ర కరువు..
- గాంధీలపై తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi:ఆపరేషన్ సిందూర్ విజయం తర్వాత దేశం తన సైన్యాన్ని చూసి గర్వపడిందని, కానీ కాంగ్రెస్-ఆర్జేడీ దానిని ఇష్టపడటం లేదని ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ విమర్శించారు. బీహార్లోని అర్రాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. రెండు పార్టీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘పాకిస్తాన్లో పేలుళ్లు జరిగితే, కాంగ్రెస్ రాజకుటుంబం నిద్ర కోల్పోతోంది. ఆపరేషన్ సిందూర్ షాక్ నుంచి పాకిస్తాన్, కాంగ్రెస్ కోలుకోలేదు’’ అని గాంధీ కుటుంబాన్ని తీవ్రంగా విమర్శించారు.
Read Also: Andhra-King-Taluka : షూటింగ్ కంప్లీట్ – ప్రమోషన్లు స్టార్ట్..!
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
విక్షిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారతదేశం) ప్రతిజ్ఞతో ఎన్డీఏ ముందుకు సాగుతోంది. మరోవైపు, కాంగ్రెస్,ఆర్జేడీ ఘర్షణ పడుతున్నాయని అన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఒక రోజు ముందు బీహార్లో మూసిన తలుపుల వెనక దొంగల ఆట జరిగిందని ప్రధాని ఆరోపించారు. కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేతను పేర్కొనడం కాంగ్రెస్కు ఇష్టం లేదని, ఆర్జేడీ కాంగ్రెస్ తలపై తుపాకీ పెట్టి ముఖ్యమంత్రి పదవిని దొంగిలించని ప్రధాని ఆరోపించారు.
ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య గొడవ తీవ్రమైందని, మేనిఫెస్టోపై కాంగ్రెస్ను సంప్రదించలేదని, ఎన్నికల ముందు ఇంత ద్వేషం ఉంటే, ఎన్నికల తర్వాత ఒకరి తలలు ఒకరు పగలగొట్టుకుంటారని ఎద్దేవా చేశారు. ఇలాంటి వారు బీహార్ అభివృద్ధికి పనికి రారు అని ప్రధాని అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ పాలన జంగిల్ రాజ్ అని, ఎన్డీయే పాలన సుపరిపాలన అని ప్రధాని అన్నారు. నితీష్ కుమార్, ఎన్డీయే ప్రభుత్వం బీహార్ను జంగిల్ రాజ్ లాంటి క్లిష్ట కాలం నుంచి బయటకు తీసుకువచ్చిందని ప్రధాని చెప్పారు.
తాజావార్తలు
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!