Explosion On Train Track: రాజస్థాన్ రైల్వే ట్రాక్పై పేలుడు.. విచారణకు సీఎం ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Explosion On Train Track: రాజస్థాన్ రైల్వే ట్రాకుపై పేలుడు సంభవించింది. అధికారుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. అసర్వా-ఉదయ్పూర్ ఎక్స్ప్రెస్ రైలు వెళ్లడానికి గంటల ముందు, ఆదివారం ఈ ఘటన జరిగింది. అయితే దీంట్లో ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉదయపూర్లోని జావర్ మైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కెవ్డా కి నాల్ సమీపంలోని ఓధా వంతెనపై ట్రాక్లను దెబ్బతీయడానికి మైనింగ్ పేలుడు పదార్థాలను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు.
ఆదివారం ఉదయం ఈ పేలుడు సమాచారం స్థానిక ప్రజల నుంచి అందిందని.. ట్రాక్ పై కొన్ని పేలుడు పదార్థాలను కనుగొన్నట్లు పోలీస్ అధికారి అనిల్ కుమార్ విష్ణోయ్ వెల్లడించారు. పేలుడుకు బాధ్యులను గుర్తించడానికి ప్రయత్నాలు జరగుతున్నాయి. అయితే ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డీజీపీ ఉమేష్ మిశ్రాను ఆదేశించారు.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
Read Also: Thieves Molested Wife: దారుణం.. దొంగతనానికి వచ్చి, భర్త ముందే భార్యపై అత్యాచారం
అక్టోబర్ 31న అహ్మదాబాద్ లోని అసర్వా రైల్వే స్టేషన్ నుంచి అసర్వా-ఉదయ్ పూర్ ఎక్స్ప్రెస్ ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. సరిగ్గా ఈ రైలు వెళ్లే గంట ముందే ట్రాక్ పై ఈ పేలుడు సంభవించడం అనుమానాలకు తావిస్తోంది. పేలుడు సమాచారం తెలిసిన తర్వాత రైలును దుంగార్ పూర్ స్టేషన్ లో నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. గనిలో ఉపయోగించే పేలుడు పదార్ధాలతో ట్రాకును దెబ్బతీయడానికి దుండగులు ప్రయత్నించారు. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు అక్కడ కొన్ని చోట్ల విరిగిపోయిన నట్ బోల్టులు కనిపించలేదు. ఈ ఘటనపై రాష్ట్రపోలీసులతో పాటు రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు.
उदयपुर-अहमदाबाद रेल मार्ग के ओडा रेलवे पुल पर रेल पटरियों को नुकसान पहुंचाने की घटना चिंताजनक है। पुलिस व प्रशासन के वरिष्ठ अधिकारी मौके पर हैं। डीजी पुलिस को घटना की तह तक जाने के निर्देश दिए हैं।
— Ashok Gehlot (@ashokgehlot51) November 13, 2022
తాజావార్తలు
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
-
Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!