PM Modi: కాంగ్రెస్ హయాంలో ‘‘హనుమాన్ చాలీసా’’ విన్నా కూడా నేరమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్రమోడీ విమర్శల దాడిని పెంచారు. ఈ రోజు రాజస్థాన్ టోంక్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఒకరు తమ మత విశ్వాసాలను అనుసరించడం కూడా కష్టంగా ఉండేదని అన్నారు. ఆ పార్టీ హయాంలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమే అని ఆరోపించారు. దేశం మొత్తం హనుమాన్ జయంతి జరుపుకుంటున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాజస్థాన్ బస్స్వారా ర్యాలీలో ‘సంపదని పంచడం’పై తాను చేసిన వ్యాఖ్యల్ని ప్రధాని మోడీ మరోసారి ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్, ఇండియా కూటమికి కోపం తెప్పించాయని, వారు ప్రతీచోట నరేంద్రమోడీని విమర్శించడం ప్రారంభించారని అన్నారు.
బెంగళూర్లో ఇటీవల ఓ షాప్ కీపర్ హనుమాన్ చాలీసా వింటున్న క్రమంలో మరో వర్గానికి చెందిన యువకులు తీవ్రంగా కొట్టారు. దీనిని ప్రస్తావిస్తూ ప్రధాని మాట్లాడారు. ‘‘ ఒక పేదవాడు తన చిన్న దుకాణంలో హనుమాన్ చాలీసా వింటూ కూర్చున్నాడు. అతడిని రక్తం కారేలా కొట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతోంది.’’ అని అన్నారు. ‘‘అయోధ్య రామ మందిర ఆహ్వానాన్ని తిరస్కరించారు కాబట్టి, వారి సహాయకులు, అనుచరులు హనుమాన్ చాలీసా వింటున్న ప్రజల్ని సులభం కొట్టవవచ్చు.’’ అని చెప్పారు.
Also Read
Read Also: Kyrgyzstan: విషాదం.. జలపాతంలో పడి ఏపీ మెడికల్ విద్యార్థి మృతి
మీ సంపదను లాక్కుని ఎంపికైన వ్యక్తులకు పంచేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతుందనే సత్యం దేశం ముందుందని చెప్పారు. ‘‘రెండు మూడు రోజుల క్రితం, నేను కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాలరు, బుజ్జగింపు రాజకీయాలను బయటపెట్టాను. ఇది కాంగ్రెస్, ఇండియా కూటమిని కోపం తెప్పించింది. వారు ప్రతీ చోట ప్రధాని మోడీని దుర్వినియోగం చేయడం ప్రాంరభించారు. నిజాలకు కాంగ్రెస్ ఎందుకు భయపడుతోంది..?’’ అని ప్రధాని మోడీ అన్నారు. తాను చేసిన 90 సెకన్ల ప్రచారం కాంగ్రెస్లో భయనాన్ని పెంచిందని అన్నారు. మీ ఆస్తుల్ని లాక్కుని ప్రత్యేక వ్యక్తులకు పంచడానికి కాంగ్రెస్ కుట్రలు చేస్తుందనే సత్యాన్ని చెప్పానని అన్నారు. చివకు వారు మన తల్లులు, సోదరీమణుల బంగారాన్ని, మంగళసూత్రాలను కూడా వదిలిపెట్టబోరని నిన్న అన్నారు.
ప్రజల సంపదపై సర్వే చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాసి ఉందని, సంపదపై ఎక్స్రే చేస్తామని కాంగ్రెస్ నాయకుడు ఒక ప్రసంగంలో చెప్పారని, మోడీ రహస్యాన్ని బయటపెట్టడానే మీ రహస్య ఎజెండా బయటపడిందని మీరు భయపడుతున్నారని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఒకరి విశ్వాసాన్ని అనుసరించడం కష్టమని ప్రధాని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరంగా మారిందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!